-
రూ.2000 నోట్ల ఎఫెక్ట్! పడిపోయిన కరెన్సీ వృద్ధి
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7 శాతానికి పడిపోయిందని వార్తా సంస్థ పీటీఐ తాజాగా నివేదించింది. ఏడాది క్రితం ఇది 8.2 శాతంగా ఉండేది. కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ (CiC) అనేది చెలామణిలో ఉన్న నోట్లు, నాణేలను సూచిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం కారణంగా కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు జనవరిలో డిపాజిట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీనికి కూడా రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణే కారణమని చెప్పవచ్చు. ఇక రిజర్వ్ మనీ (RM) వృద్ధి విషయానికి వస్తే ఏడాది క్రితం ఉన్న 11.2 శాతం నుంచి ఈ ఫిబ్రవరి 9 నాటికి 5.8 శాతానికి క్షీణించింది. చలామణిలో ఉన్న కరెన్సీ, ఆర్బీఐలో బ్యాంకుల డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు ఈ రిజర్వ్ మనీలో భాగంగా ఉంటాయి. రిజర్వ్ మనీలో అతిపెద్ద భాగం అయిన కరెన్సీ-ఇన్-సర్క్యులేషన్ వృద్ధి ఏడాది క్రితం నాటి 8.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించడం రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ప్రతిబింబిస్తోంది. ఆర్బీఐ 2032 మే 19న రూ. 2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 31 నాటికి రూ. 2,000 నోట్లలో దాదాపు 97.5 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. దాదాపు రూ. 8,897 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. 2023 మే 19న నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. రూ.2000 నోట్లు ఉన్న వ్యక్తులు, సంస్థలు వాటిని 2023 సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని మొదట్లో ఆర్బీఐ గడువు విధించింది. ఆ తర్వాత గడువు 2023 అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 నోట్ల డిపాజిట్కి వీలుంది. కాగా 2016 నవంబర్లో రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టారు. -
ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన
ఉపసంహరించిన రూ.2000 నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లలో 97.38 శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరాయని, ఇంకా రూ.9,330 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ సోమవారం వెల్లడించింది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు గతేడాది మే 19న ఆర్బీఐ ప్రకటించింది. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉండగా 2023 డిసెంబర్ 29 నాటికి రూ.9,330 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే 97.38 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరినట్లు పేర్కొంది. ఇప్పటికీ ప్రజల వద్ద రూ. 2,000 నోట్లకు చట్టబద్ధమైన చెల్లుబాటు కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రజలు తమ వద్ద రూ.2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా డిపాజిట్ చేయవచ్చు. మార్చుకోవచ్చు. ఆర్బీఐ ఆఫీసులకు రాలేనివారు పోస్టు ద్వారా రూ.2వేల నోట్లను పంపి తమ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. మొదట్లో రూ.2 వేల నోట్లను అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ సమయం ఇచ్చింది. తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అనంతరం బ్యాంకు శాఖలలో డిపాజిట్, మార్పిడి సేవలు నిలిపేసింది. అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ కార్యాలయాలలో మాత్రమే ఈ నోట్లు డిపాజిట్, మార్చుకునే అవకాశం కల్పించింది. ఆర్బీఐ కార్యాలయాలు ఇవే.. రిజర్వ్ బ్యాంక్కు దేశవ్యాప్తంగా 19 ఇష్ష్యూ కార్యాలయాలు ఉన్నాయి. అవి అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం. రూ.2వేల నోట్లను వీటిల్లో ఎక్కడైనా మార్చుకోవచ్చు. -
రూ. 1000 కరెన్సీ నోట్లు మళ్లీ వస్తున్నాయా?
Re-introduction of Rs 1000 notes: కేంద్రం ప్రభుత్వం ఇటీవల అతిపెద్ద కరెన్సీ నోటు రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాత పెద్ద నోట్లు తిరిగి చలామణిలోకి రానున్నాయని ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. పెద్ద నోట్లు లేని కారణంగా గతంలో రద్దు చేసిన రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ వుతున్నాయి. దీంతో కేంద్ర బ్యాంకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా సష్టత నిచ్చినట్టు తెలుస్తోంది. రూ. 1,000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేదని సోర్సెస్ని ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కాగా 2016 నవంబర్లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలు తమ ఉద్ద ఉన్న ఈ నోట్ల మార్పిడికి కొంత సమయాన్ని కూడా ఇచ్చింది ప్రభుత్వం. అప్పట్లో ఈ అనూహ్య ప్రకటనతో యావద్దేశం దిగ్భ్రాంతికి లోనైంది. అనంతరం పాత నోట్ల స్థానంలో కొత్త రూ. 500 నోట్లతోపాటు, కొత్త రూ.2000 కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. అయితే క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఇటీవల రూ 2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంది. అలాగే రూ. 2వేల నోట్ల మార్పిడికి కూడా కొంత గడువు ఇచ్చింది. దీన్ని తొలుత సెప్టెంబర్ 30 వరకు నిర్ణయించింది. ఆ తర్వాత అక్టోబర్ 7, 2023 వరకు అవకాశాన్ని పొడిగించింది. అక్టోబర్ 7 తరువాత కూడా ఇంకా ఎవరిదగ్గరైనా రూ. 2000 నోట్లు ఉంటే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్పు చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. kuch aur expect bhi nahi kar saktey. 😂 pic.twitter.com/lwMBl2tUQh — चयन 🇮🇳 (@Tweet2Chayan) October 20, 2023 -
రూ.2000 నోట్లు: ఆర్బీఐ గుడ్ న్యూస్
Rs 2000 notes Deadline extended up to October 7 ఉపసంహరించుకున్న రూ. 2000 నోటు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును అక్టోబరు 7 వరకు పెంచుతున్నట్టు శనివారం వెల్లడించింది. అంతేకాదు రూ.2000 నోట్లు చట్ట బద్దంగా చలామణిలో ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్బీఐ ప్రజలను కోరింది. RBI సంచలన ప్రకటన ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్ / మార్పిడికి అవకాశాన్ని అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని వెల్లడించింది. ► వినియోగదారులు అక్టోబరు 8 తరువాత నుంచి ఈ నోట్లను 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. వ్యక్తులు, సంస్థలు 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను దేశంలోని తమ బ్యాంక్ ఖాతాలకు ఎంత మొత్తానికి అయినా జమ చేయవచ్చు. ► అంతేకాకుండా, దేశంలోని కస్టమర్లు భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనినైనా చిరునామాకు పంపి, ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు అయితే ఈ క్రెడిట్ సంబంధిత ఆర్బీఐ / ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల సమర్పించాలి. ► న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియల్లో పాలుపంచుకున్న ఇతర పబ్లిక్ అథారిటీలు లేదా ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. కాగా క్లీన్-నోట్ విధానంలో భాగంగా మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్బీఐ గత శుక్రవారం వెల్లడించింది. (లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాల్ సేల్, ధర ఎంతంటే?) -
రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్లైన్ పొడిగిస్తారా?
Exchange Rs 2000: చలామణీలో ఉన్న రూ. 2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకున్న తరువాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆర్బీఐ "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30, 2023 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది. అయితే నిజానికి ఈ గడువు 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబరు 25, 27, 28 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 26, 29, 30 తేదీలు మాత్రమే నోట్ల మార్పిడికి చాన్స్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో డెడ్లైన్ పొడిగిస్తుందా? లేదా అనే ఊహాగానాలున్నాయి. డెడ్లైన్ పొడిగించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిమంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే తాజా రూమర్లపై కేంద్రం నుంచి ఆర్బీఐనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అయితే రెండు వేల రూపాయలనోట్లను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గడువు లోపల తమ వద్ద మిగిలిన రూ. 2 వేల నోటును మార్పిడిలేదా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి, అభ్యర్థన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ లేకుండానే మార్పిడి చేసుకోవచ్చు.అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ID ప్రూఫ్ని కలిగి ఉండటం మంచిది. ఈ వారంలో బ్యాంకుల సెలవులు ♦ బ్యాంకులు సోమవారం నుండి బుధవారం వరకు (సెప్టెంబర్ 25 -సెప్టెంబర్ 27 వరకు) సాధారణంగా పనిచేస్తాయి. ♦ గురువారం,సెప్టెంబర్ 28, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెలవు. ♦ శుక్రవారం,శనివారం అంటే సెప్టెంబర్ 29 , సెప్టెంబర్ 30 తేదీలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో శుక్రవారం కూడా సెలవు. మరోవైపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అయితే మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement