-
Sakshi Cartoon: మిగిలింది మీరొక్కరే కదా! కోరకున్నా వెళ్లిపోండి సార్!
మిగిలింది మీరొక్కరే కదా! కోరకున్నా వెళ్లిపోండి సార్! -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు...
-
దేశంలో కరోనా విలయం, ఒక్కరోజే 81,466 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 469 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,63,396కి చేరుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్లో కరోనా కట్టడికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ 5 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండో డోసు తీసుకున్నా కరోనా పాజిటివ్ ఉత్తర ప్రదేశ్కి చెందిన సీనియర్ పోలీసు అధికారికి కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్గా తేలింది. తాను రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) రాజేశ్ పాండే ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. తన భార్య కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మూడు రోజుల క్రితం వాళ్లబ్బాయికి కరోనా సోకింది. రాబర్ట్ వాద్రాకు కరోనా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్–19 పాజిటివ్గా తేలింది. దీంతో ప్రియాంకా శుక్రవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అస్సాంలో శుక్రవారం, తమిళనాడులో శనివారం, కేరళలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘నాకు కోవిడ్–19 నెగెటివ్గా నిర్థారణ అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటాను’ అని ఆమె తెలిపారు. రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జనం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో 24 గంటల్లో 36.7 లక్షలకుపైగా మంది కోవిడ్–19 టీకాలు తీసుకున్నారు. ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యొత్తంగా 36,71,242 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 33,65,597 మంది మొదటి డోసు తీసుకుంటే, 3,05,645 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.87 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ మహారాష్ట్ర కోవిడ్–19 గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43,183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుందని ఆదేశించారు. -
నేడు ఈడీ ముందుకు వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో గురువారం ఈడీ అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను నేడు మరోసారి ఈడీ ప్రశ్నించనుంది. విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మనీల్యాండరింగ్కు పాల్పడ్డారనే కేసులో ఆయన పాత్రపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. శుక్రవారం జరిగే విచారణకూ హాజరు కావాలని వాద్రాను ఈడీ అధికారులు కోరారు. విచారణ అధికారి ఎదుట గురువారం ఉదయం హాజరు కావాలని బుధవారం వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా తాను దర్యాప్తు సంస్థల ఎదుట హాజరు కావడం ఇది 11వ సారని, దర్యాప్తు సంస్థల విచారణకు తాను సహకరిస్తానని, న్యాయవ్యవస్థ పట్ట తనకు విశ్వాసం ఉందని ఈడీ కార్యాలయానికి చేరుకునే ముందు వాద్రా ట్వీట్ చేశారు. కాగా ఇదే కేసులో ఏప్రిల్ 1న వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంది : వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు కొద్దిగంటల ముందు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని వాణిజ్యవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. భారత న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, దర్యాప్తు ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థల సమన్లు, నిబంధనలను పూర్తిగా అనుసరిస్తానని స్పష్టం చేశారు. మున్ముందు కూడా తాను ఇదే తీరున సహకరిస్తానని పేర్కొన్నారు. తనపై తప్పుడు అభియోగాలను తొలగించేవరకూ తాను దర్యాప్తు ఏజెన్సీల ఎదుట హాజరవుతానని, వారికి సహకరిస్తానని చెప్పారు. తాను ఇప్పటివరకూ 11 సార్లు దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యానని వాద్రా ట్వీట్ చేశారు. లండన్లో ఆస్తులు కొనుగోలులో మనీల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న వాద్రాకు ఈ కేసులో ఏప్రిల్ 1న ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement