breaking news
road cycling championship
-
తెలంగాణకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. కర్ణాటకలోని జామకండిలో జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. 120 కి.మీ రోడ్ మాస్ స్టార్ట్ ఈవెంట్లో బి. ముగేశ్, 40 కి.మీ ఈవెంట్లో అమన్ పుంజరి చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 50 కి.మీ క్రిటోరియమ్ ఈవెంట్లో పరశురామ్ చెంజి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన సైక్లిస్టులను ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్బాబు బుధవారం అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. , -
పరశురామ్కు రజతం
జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలుగు కుర్రాడు పరశురామ్ రాణించాడు. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో 120కి.మీ మాస్ స్టార్ట్ రోడ్ రేస్ విభాగంలో పరశురామ్ రజత పతకాన్ని సాధించాడు. తెలంగాణ సైక్లింగ్ సంఘానికే చెందిన మరో క్రీడాకారుడు అమన్ ఈ రేస్లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలోనూ తెలంగాణ సైక్లింగ్ టీమ్ ప్రతిభ కనబరిచింది. జాతీయ చాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన సైక్లిస్టులను తెలంగాణ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ అభినందించారు.