breaking news
Riyadh flight
-
రన్వేపై నిలిచిపోయిన విమానం: కలకలం
సాక్షి, లక్నో: సౌదీ ఎయిర్లైన్స్ విమానం రన్వే పై నిలిచిపోవడం కలకలం రేపింది. లక్నో నుంచి రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం రన్వే పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అర్థాంతరంగా రన్వే పైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో కొన్ని విమానాలను దారి మళ్లించడం తోపాటు, మరికొన్ని సర్వీసులను నిలిపివేశారు. దీంతో సిబ్బంది, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్నో-రియాద్ విమానం గాల్లోకి ఎగిరే క్రమంలో రన్వేపైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో విమానాశ్రాయానికి వచ్చి వెళ్లే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో మూడు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే విమాన సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
శంషాబాద్లో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రియాద్ బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి గురువారం రియాద్ బయలుదేరిన ఏవీ 753 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తిరిగి ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిసింది.