-
సన్నాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. జై శ్రీరామ్ క్వింటాల్కు రూ.7,800 వరకు సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం అంతంతే దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి రాష్ట్రంలో యాసంగి సీజన్లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు. నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. మార్కెట్కు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే మరో 2 ఎల్ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది. -
దేశంలో భారీగా పెరిగిన బియ్యం ధరలు!
భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి, ఒక క్వింటాల్ బియ్యం ధరల గరిష్టంగా సుమారు రూ. 1500 పెరిగినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రూ. 4500 నుంచి రూ. 5000 వరకు ఉన్న క్వింటాల్ HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 6200 నుంచి రూ. 7500కు చేరాయి. క్వింటాల్ ధరలు గతం కంటే కూడా రూ. 1000 నుంచి రూ. 15000 పెరిగింది. బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా.. వారి సాగు కూడా బాగా తగ్గడం అని సమాచారం. -
ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!
ప్రపంచంలో అతి పెద్ద బియ్యం సరఫరాదారుగా ఉన్న భారత్ పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు ఎగుమతులను నిషేధించింది. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్టంగా 50 డాలర్లు నుంచి 100 డాలర్లు ఎక్కువ ఉండవచ్చని సింగపూర్కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి వెల్లడించారు. కాగా ఈ ధరలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది మున్ముందు తెలియాల్సి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు. బియ్యం ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ గోధుమ మార్కెట్లో బలమైన లాభాలను తీసుకు వస్తోంది. ఈ కారణంగానే గోధుమ ధరలు కూడా ఈ వారంలో 10 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటి ఆధారంగా పెరిగే ఈ పంట దాదాపు ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉత్పత్తవుతుంది. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్లాండ్, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు ధరలను తెలుసుకోవడానికి సరఫరాదారులు వేచి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వియాత్నం, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: భారత్ బ్యాన్ డెసిషన్.. యూఎస్లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే.. -
రికార్డు స్థాయికి బియ్యం ధరలు.. తినలేం, కొనలేం!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం గత ఏడాది కిలోకు రూ.40 నుంచి రూ.45 పలికితే ప్రస్తుతం రూ.48 నుంచి రూ.55కు చేరాయి. డిమాండ్ కంటే ఎక్కువగా మార్కెట్కు బియ్యం నిల్వలు వస్తున్నా ధరలు మాత్రం తగ్గడంలేదు. వ్యవసాయాధారిత ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. వ్యాపారులు పన్నులు చెల్లించిన సమయంలో బియ్యం ధరలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పన్నులు రద్దయినా ధరలు పెరగడంపై వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇష్టారీతిన రిటైల్ వ్యాపారులు ► జంట నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన కుదరడంలేదు. ►గ్రేటర్ పరిధిలో దాదాపు 240 రైస్మిల్లర్లు ఉన్నారు. వీరి నుంచి రిటైల్ వ్యాపారులు తక్కువ ధరకే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ► ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాలు బియ్యానికి రూ.3,200 నుంచి రూ.3,600 పలుకుతున్నాయి. కానీ మార్కెట్కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ► ప్రస్తుతం సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాలుకు రూ.4,800 నుంచి రూ.5,500 చేరింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు 2,500 మంది రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను శాసిస్తున్నారు. చిన్నాచితకా కిరాణా వ్యాపారులు సైతం ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు. ►గత ఏడాది క్వింటాలు సన్న బియ్యం రూ.4,200 నుంచి రూ.4,500 పలకగా ప్రస్తుతం సుమారు రూ.వెయ్యి వరకు పెంచి అమ్ముతున్నారు. దిగుబడులు పెరిగినా.. ► రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరి ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి ప్రభుత్వం మిల్లర్లకు అందజేసింది. గ్రేటర్ పరిధిలోని మిల్లర్ల వద్ద లక్షన్నర మెట్రిక్ టన్నులకుపైగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ►జంటనగరాల్లో బియ్యం వినియోగం పెరుగుతోంది. రోజుకు 32 నుంచి 35 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నట్లు అంచనా. -
భగ్గుమంటున్న బియ్యం
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఫస్ట్ క్వాలిటీ ఏడాది పాత బియ్యం ధర కిలో రూ.45 లోపే ఉంది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే అంతకుముందు ఏడాది కంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా సేకరించారు. మార్కె ట్ డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం వచ్చినా ధరలు మాత్రం పెరగడం గమనార్హం. అయినా ధరలు మాత్రం నియత్రించే పౌర సరఫరాశాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. పన్నులు ఎత్తివేసినా తగ్గని ధర జీఎస్టీ రాక ముందు మిల్లర్లు, వ్యాపారులు క్వింటాల్పై 4 శాతం పన్ను చెల్లించేవారు. జీఎస్టీ అమలతో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భాగంగా బియ్యంపై కూడా వ్యాట్ను కూడా పూర్తిగా ఎత్తివేశారు. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ధాన్యం సేకరించి వ్యాపారులకు అమ్మితే గతంలో విధించిన ఒక శాతం పన్నును కూడా ప్రభుత్వం తొలగిస్తూ 2019 జీవో నంబర్ 219 జారీ చేసింది. దీంతో రైస్ మిల్లర్లు కేవలం ఒకశాతం మార్కెట్ ఫీజు మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వం మిల్లర్లకు, బియ్యం వ్యాపారులకు ఇన్ని వెసలుబాట్లు కల్పించినా ధరలు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందునే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్లో ధరల మోత గ్రేటర్ పరిధిలో అధికారులు పట్టించుకోకపోవడంతో హోల్సేల్ మార్కెట్లో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో 250 మంది రైస్మిల్లర్లు ఉన్నట్లు సమాచారం. ఏటా ఒక్కో మిల్లర్ వద్ద 40 నుంచి 50 టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్లో రోజుకు 35 నుంచి 40 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం అవుతున్నట్లు అధికారుల అంచనా. గతంలో పోలిస్తే రోజుకు 5 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం పెరిగింది. రిటైల్ వ్యాపారులకు తక్కువ ధరలకే బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు . ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాల్కు రూ.3200 నుంచి 3500 పలుకుతోంది. మార్కెట్కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులు చెప్పిందే ధర. ప్రస్తుతం పాత సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాల్కు రూ.5000 నుంచి 5500 చేరింది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 2500 మంది రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. చిన్నా చితకా కిరాణా వ్యాపారులు కూడా ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటాల్ సన్నబియ్యం ధర రూ.4200 పలుకగా ప్రస్తుతం ప్రతి క్వింటాల్పై రూ.800 వరకు పెరుగుదల కనిపించడం గమనార్హం. దీంతో జీఎస్టీ పరిధిలోంచి బియ్యాన్ని తొలగించినా కూడా సామాన్యులకు ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement