-
భూ ఆక్రమణలపై కన్నెర్ర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భూముల ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని రెండు నెలల్లోగా గుర్తించి ఆ తరువాత ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించిన తరువాత తిరిగి కబ్జాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో నిబంధనలు అనుసరించాలని అధికారులకు సూచించింది. పంచాయతీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పేరు మీద క్రమబద్ధీకరించరాదని, వాటిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాల్సిందేనంటూ జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2011లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జీవో 188 జారీ చేసి ఆక్రమణల తొలగింపునకు నిబంధనలు రూపొందించిందని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆక్రమణలపై పలు వ్యాజ్యాలు దాఖలు.. జీవో 188 జారీ అయినప్పటికీ ప్రభుత్వ భూములు, నీటి వనరులు, అటవీ, క్రీడా స్థలాలు, శ్మశానాల స్థలాలను ఆక్రమణల నుంచి అధికారులు కాపాడటం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది బుస్సా రాజేంద్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై పలు పిల్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి మారాలి... ‘జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 2011లో జీవో 188 జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ (ఆస్తుల పరిరక్షణ) రూల్స్ను తెచ్చింది. వీటి ప్రకారం పంచాయతీ భూములను మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సొంతవి, సేకరించిన భూములు 2. దానంగా, విరాళంగా, పంచాయతీలకు బదిలీ చేసిన భూములు 3. పంచాయతీకి చెందిన భూములు. ఏటా పంచాయతీ పరిధిలోని భూముల వివరాలను సేకరించి గెజిట్లో ప్రచురించాలి. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలి. ఆక్రమణల గుర్తింపు, తొలగింపు కోసం కలెక్టర్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశమై ఆక్రమణల తొలగింపు పురోగతిని సమీక్షించాలి. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా దురదృష్టవశాత్తూ అధికారులు వీటిని అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏటా పెరిగిపోతున్నాయి. హైకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను అమలు చేయడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. çపంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ముందు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయం నిర్ణయించుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని మునిసిపల్ అధికారులకు తేల్చి చెప్పింది. పంచాయతీ కార్యదర్శులంతా జీవో 188 ప్రకారం ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ భూముల నుంచి ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్దేశించింది. వక్ఫ్ భూములను ఈ జాబితాలో చేర్చలేం.. ధర్మాసనం మొదట తన ఉత్తర్వులను పంచాయతీ, మునిసిపల్, అటవీ భూములకే పరిమితం చేయగా రెవెన్యూ, దేవదాయశాఖ భూములను కూడా జత చేయాలని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ రెవెన్యూ భూములను ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చింది. దేవదాయ శాఖ భూములపై వేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వ మరో న్యాయవాది ఖాదర్ బాషా జోక్యం చేసుకుంటూ వక్ఫ్ భూములు కూడా పెద్ద సంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని కూడా ఆ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ వక్ఫ్ భూముల విషయంలో బహుళ వివాదాలుంటాయని, అందువల్ల వాటిని ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురాలేమని పేర్కొంది. -
వీళ్లు మహాముదుర్లు, స్వామికే.. శఠగోపం పెట్టారుగా!
చింతపల్లి(నల్లగొండ): విలువైన దేవుని మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవాదాయ శాఖ పర్యవేక్షణ లోపం, పూజారుల ఇష్టారాజ్యం వల్ల చింతపల్లి మండల కేంద్రంలోని గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భూములలు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ రికార్డుల్లో 110 ఎకరాలు ఉండగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 70 ఎకరాలను మాత్రమే అధికారికంగా లెక్క చూపిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం ఆధీనంలో 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతుంది. విలువైన భూములు కావడంతో కొందరు అక్రమార్కులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ తప్పుడు లెక్కలతో దేవాలయ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుస్తోంది. ఆలయానికి దేవరకొండ, గోకారం, గడియగౌరారం గ్రామాల్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించి భూములు ఉన్నాయి. అవి కూడా ఎక్కడా రికార్డుల్లో లేని పరిస్థితి. పూజారుల ఆధీనంలో.. గట్టుపతి దేవాలయం భూములు ఇక్కడి 80 ఏళ్ల నుంచి పూజారుల ఆధీనంలో ఉన్నాయి. అసలు దేవాదాయ శాఖ కమిటీ ఆధీనంలో దేవాలయ ఈ భూములు ఉండాలి. దానిపై కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది. భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భూములు కౌలు వేలం వేసి దేవాలయ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ వేలంపాట నిర్వహించకుండానే విలువైన భూములు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఇప్పటివరకు సుమారు 40 ఎకరాల వరకు భూములు మాయమైనట్లు తెలుస్తోంది. 40 ఎకరాల లెక్క తేల్చని రికార్డులు గట్టుపతి దేవాలయ భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో 110 ఎకరాలకు బదులుగా 70 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుండగా.. మిగతా 40 ఎకరాల ప్రస్తావన ఎక్కడా చూకపోవడం ఇటు దేవాదాయ శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు అద్దంపడుతోంది. సంబంధిత అధికారులు స్పందించి భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విష యం తమ దృష్టికి వచ్చింది. భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు దేవాదాయ భూములను ఆక్రమిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. భూముల వేలంపాటకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – సత్యనారాయణమూర్తి, దేవాదాయ శాఖ ఈఓ చదవండి: Hyderabad Collector L Sharman: బైక్పై వెళ్లి.. తనిఖీలు చేసి.. -
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
-
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
సాక్షి, అమరావతి: రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉప సంఘం భేటీ గురువారం జరిగింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. సీసీఎల్ఏ నీరబ్కుమార్, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ సమస్యలు తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన,సూచనలు చేయడమే లక్ష్యంగా చర్చ సాగింది. (చదవండి: పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!) 22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. -
రెవెన్యూ రికవర్రీ!
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన వారు డిఫాల్ట్ అయినప్పుడు, సంస్థలు మూతపడినప్పుడు, ప్రభుత్వ పథకాల్లో అక్రమాలకు పాల్పడ్డప్పుడు, ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కన్నా అదనంగా బకాయిలు పడినప్పుడు వాటిని రాబట్టడం కోసం నోటీసులు ఇస్తారు. నోటీసులకు స్పందించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారికి ఉన్న ఆస్తులను వేలం వేసి ఆ డబ్బులు జమ చేస్తారు. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ఈ బకాయిలు వసూలు చేయకపోవడం వల్ల ఇవి కొండంత పెరిగిపోయాయి. జిల్లాలో ఎక్కువగా డ్వామా, సినిమా థియేటర్ల నుంచి రావాల్సిన బకాయిలు, భూసేకరణలో జరిగిన అక్రమాలకు సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. డివిజన్ల వారీగా బకాయిలు ఇలా.. ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 93 మంది వ్యక్తులు, సంస్థల నుంచి రూ.122 కోట్ల 96 లక్షలు రావాల్సి ఉంది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 46 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 87 లక్షలు రావాల్సి ఉండగా, నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 38 మంది వ్యక్తుల నుంచి రూ.8 కోట్ల 22 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం సబ్డివిజన్ పరిధిలో 23 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 13 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. భూ సేకరణ అక్రమాలు అ‘ధనం’ వీటికి భూసేకరణ అక్రమాలు అదనంగా తోడయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు గిరిజనేతరులకు ఇళ్ల నిర్మాణానికి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని తాడువాయి, మంగిశెట్టిగూడెం, చల్లవారిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 1100 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కుక్కునూరు, వేలేరుపాడు నిర్వాసితులకు తొలివిడతగా ఇళ్లు నిర్మించేందుకు ఈ భూములు సేకరించారు. అయితే ఈ భూముల సేకరణలో భారీ అవినీతి కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అవినీతిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేనివి ఉన్నట్లు చూపించి రూ.కోట్ల పరిహారాన్ని నొక్కేశారు. వర్జీనియా పొగాకు బ్యారన్లు లేకపోయినా ఉన్నట్లు, వ్యవసాయ బోర్లు లేకపోయినా ఉన్నట్లు, లేని మామిడి తోటలు, కోకో, ఆయిల్పామ్, కొబ్బరి తోట తదితర పంటలు ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.కోట్లు నొక్కేశారు. దీనికి అధికారులు, సిబ్బంది కూడా తమ వంతు సహకారం అందించారు. అయితే ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించి వరుసగా మూడుసార్లు సర్వే చేశారు. ఈ సర్వేల్లో అవినీతి బయటపడటంతో వివిధ శాఖలకు సంబంధించిన సుమారు 13మందిని విధుల నుంచి తొలగించారు. సర్వేల అనంతరం చివరకు అవినీతి జరిగిందని గుర్తించి రైతులకు చెల్లించిన పరిహారం సొమ్ము రికవరీకి నడుంబిగించారు. స్పందించని రైతులు ఇందుకోసం ఏయే రైతులు అవినీతికి పాల్పడ్డారో గుర్తించి, లేనివి ఉన్నట్లు చూపించి అదనంగా పొందిన సొమ్ములు రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఇలా మూడుసార్లు రైతులకు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. అయితే అధికారులు నోటీసులు జారీ చేయడంతో కేవలం రూ. 97 లక్షలు మాత్రం రికవరీ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.16 కోట్ల పైచిలుకు సొమ్ము రైతుల నుంచి రివకరీ కావాల్సి ఉంది. తాడువాయి భూసేకరణలో అవినీతికి పాల్పడిన 51 మందిని అధికారులు గుర్తించారు. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా రైతులు స్పందించకపోవడంతో చివరకు ఐటీడీఏ పీఓ, భూసేకరణ అధికారి హరీంద్రియ ప్రసాద్, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. అయితే అధికారులు వేగంగా స్పందించకపోవడంతో అక్రమార్కులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తాజాగా జిల్లా అధికారులు ఈ బకాయిల వసూలుపై దృష్టి పెట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆర్ఆర్ యాక్టు బకాయిల వసూలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇటీవల వరదలు రావడంతో కొంత ఆలస్యమైందని, త్వరలోనే ఈ బకాయిలు అన్నీ వసూలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement