-
‘శాడిస్ట్ బాస్కు భలే బుద్ధి చెప్పింది’
ఆఫీస్ అంటే ఆహ్లాదకర వాతవరణం. స్నేహంగా మెలిగే సహచరులు. కెరియర్లో ముందుకు సాగేలా ప్రోత్సహించే బాస్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అలా కాకుండా ఈగోయిస్ట్ కొలీగ్స్, శాడిస్ట్ బాస్, మహిళల పట్ల వివక్ష ఉంటే వర్క్ ప్లేస్ అంతకన్నా నరకం ఇంకొకటి లేదు. ఇదిగో ఈ తరహా వర్క్ కల్చర్ ఉన్న మహిళా ఉద్యోగి శాడిస్ట్ బాస్తో అనుభవించిన నరకం గురించి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. అంతేకాదు బాస్ మీద రివెంజ్ తీర్చుకుని అతగాడికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ రెడ్డిట్లో.. రెస్టారెంట్లోని ఓ విభాగంలో పనిచేసే బృందంలో ఏకైక మహిళా ఉద్యోగిని నేనే. బాస్ శాడిజం చూపించే వాడు. పైగా ఇతర కొలీగ్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. మహిళా ఉద్యోగులంటే యాజమాన్యం చిన్నచూపు చూసేది. నేనే కాదు. అందుకే మా బాస్కి, యాజమాన్యానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నా. జాబ్ రిజైన్ చేశా. రిజైన్ చేసిన వారం రోజుల తర్వాత మేనేజర్కి, సిబ్బంది వినియోగించేందుకు సౌలభ్యంగా ఉన్న డేటా బేస్ పాస్వర్డ్లు మార్చాను. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం, బాస్, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలేమైందోనని జుట్టు పీక్కున్నారు. ఇదే విషయంపై నాకు ఫోన్ కూడా చేశారు. ఫోన్ స్విచ్ఛాప్ చేశా. పాస్ మారిందని తెలుసుకునేందుకు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల పాటు బిజినెస్ దెబ్బతిన్నది. నేను చేసేంది తప్పే. అయినా పని ప్రదేశంలో సరైన వాతావరణం కొరవడితే ఎలాంటి పరిస్ధితికి దారితీస్తుందో చెప్పదలుచుకున్నాను’ అంటూ రెడ్డిట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. -
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్టాపిక్గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
చిల్లర డబ్బులతో రెస్టారెంట్ బిల్ చెల్లింపు! వీడియో వైరల్
ఇక్కడొక వ్యక్తి రెస్టారెంట్ బిల్ని చిల్లర పైసలతో చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్న రెస్టారెంట్లోని వ్యక్తులంతా ఒక్కసారిగా అతని వైపు విచిత్రంగా చూస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ముంబైకి చెందిన సిద్ధేష్ లోకరే అనే వ్యక్తి తాజ్మహల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్కి వెళ్లి చిల్లర డబ్బులతో బిల్ పే చేయాలనుకుంటాడు. అనుక్నుట్లుగానే రెస్టారెంట్కి వెళ్లాడు. రెస్టారెంట్కి వెళ్లాలంటే అక్కడ ఉన్నవాళ్లు మొదటగా చూసేది మన లుక్ అందుకని లోకర్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన పిజ్జా, మాంక్టైల్ డ్రింక్ని ఆర్డర్ చేసి శుభ్రంగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్ పే చేసేందుకు అదే టేబుల్పై చిల్లర నాణేలను లెక్క పెట్టుకుంటూ వరుసగా పేర్చి ఉంచాడు. ఇంతలో సర్వర్ వస్తాడు అతను వాటిని చూసి నవ్వుతూ తీసుకుని వెళ్లిపోతాడు. చివర్లో లోకర్ అతన్ని లెక్కచూసుకోమంటే పర్వాలేదు లెక్కపెట్టుకుంటాం అని నవ్వుతూ బదులిస్తాడు. ఈ వీడియోకి మిత్రమా డాలర్తో చెల్లిస్తామా లేక మరేదైనా అనేది విషయం కాదు కేవలం బిల్ పే చేయడం ముఖ్యం అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. అంతేకాదు చివర్లో మనం ఒక రెస్టారెంట్కో లేదా ఎక్కడికైనా మనల్ని ప్రజలందరూ గమనిస్తారన్న భయంతో లేనిపోని హంగులకు పోతామే తప్ప మనం ఎలా ఉన్నామో అలా కనిపించేందుకు అస్సలు ఇష్టపడం. పైగా ఇలా చేస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఇతరులకు నచ్చినట్లు ఉంటే మనకు నచ్చిన విధంగా ఉండటం మర్చిపోతుంటాం అని ఒక చక్కని సందేశం కూడా ఇచ్చాడు. ఐతే ఈ స్టంట్ని చూసి నెటిజన్లు.. "మంచి సందేశం. మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. మనమే ఇతరులను అనుకరిస్తూ మనకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాం." ఇది నిజం అంటూ సదరు వ్యక్తిని మెచ్చుకుంటూ ఇన్స్టాలో కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: 'విజిల్ విలేజ్'! అక్కడ గ్రామస్తులు పేర్లు ఎలా ఉంటాయంటే.) -
ఫ్రిజ్లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!
Doctors amputate teen's legs, fingers: సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అంటే సాధారణంగా వాంతులవడం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. ఫుడ్ పాయిజినింగ్ కారణంగా ఒక్కొసారి కొన్ని కేసుల్లో ప్రాణంతకం కూడా కావచ్చు కానీ చాలావరకు సురక్షితంగా బయటపడతారు. కానీ ఇక్కడొక వ్యక్తికి ఫుడ్ పాయిజినింగ్ అతని జీవితాన్ని అత్యంత విషాదమయంలోకి నెట్టేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి ఫ్రిజ్లో పెట్టిన ఆహారాన్ని వేడిచేసుకుని తినడం అతనికి అలవాటు. ఎప్పటిలాగానే రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఫ్రిజ్లోంచి తీసి వేడిచేసుకుని తిన్నాడు. అయితే అతను తిన్నవెంటనే వాంతులు చేసుకుని తీవ్ర అశ్వస్థకు గురైయ్యాడు. దీంతో అతని స్నేహితుడు ఆసుపత్రితో జాయిన్ చేశాడు. ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపట్లోనే అతని బీపీ పడిపోయి పరిస్థితి క్రిటికల్ అయిపోయింది. దీంతో వైద్యులు అతనికి వైద్యా పరీక్షలు నిర్వహించారు. కానీ అతనికి ఏమైందో అసలు అర్థం కాలేదు. కాసేపటకికి అతని శరీరం దద్దుర్లుగా మారి ఎర్రగా గాయాలు ఏర్పడటం తీవ్ర నోప్పి రావడం జరిగింది. దీంతో అతన్ని హెలికాప్టర్ సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం యూఎస్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు మెనింగోకాకల్ అనే అంటు వ్యాధి వచ్చినట్లు తెలిపారు. అయితే మెనింగోకాకల్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ టీకాతో నివారించవచ్చు. మెనింగోకోకల్ వ్యాధిని యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారని డాక్టర్లు తెలిపారు. కానీ రోగికి అతని మిడిల్ స్కూల్ వయసులో మెనింగోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నాడని అయితే అతను 16 ఏళ్ల ప్రాయంలో తీసుకోవల్సిన రెండు డోసుల వ్యాక్సిన్ని తీసుకోలేదని వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కి గురవ్వడంతో కాలి వేళ్లను చేతి వేళ్లను తీసేశారు. ప్రమాదవశాత్తు ఆ ఇన్ఫెక్షన్ మెదడుకి వ్యాపించలేదు. అయితే ఆ టీనేజర్ ఇప్పుడు కోలుకున్నాడు గానీ ఆ వ్యాధి కారణంగా ఇప్పుడు చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రామ్ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్ని సంప్రదించండి. అలాగే ఏదైనా ఫ్రిజ్లో పెట్టిన ఆహారం వేడి చేసితినేటప్పుడూ కాస్త ఆలోచించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్ అయిన డాక్టర్లు!) -
హైదరాబాద్లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ!
సరిగ్గా పదేళ్ల క్రితం ఓపెన్ గాంగ్నమ్ స్టైల్ అంటూ కొరియన్ పాప్ సింగర్ సై పాడిన పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతో బీటీఎస్ గ్యాంగ్కి ఇండియాలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలకి మన దగ్గర సెపరేట్ ఫ్యాన్బేస్ ఏర్పడింది. ఇప్పుడా ఫ్యాన్స్ కోసం మన భాగ్యనగరంలో కొరియన్ రెస్టారెంట్లో వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలు, పాప్ మ్యూజిక్ తర్వాత హంగ్బేస్డ్ నటులైన బ్రూస్లీ, జాకీచాన్లకే ఇండియాలో పెద్ద ఫ్యాన్బేస్ ఏర్పడింది. వారి తర్వాత జెట్లీ, టోనీజాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్ డ్రామాలు, కొరియన్ నటులను ఇండియన్లు సొంతం చేసుకుంటున్నారు. కే డ్రామాతో పాపులరైన కొరియన్ వెబ్ సిరీస్లకు యూత్లో యమా క్రేజ్ ఉంది. కే డ్రామాలో నటులు ఉపయోగించే గార్మెంట్స్, స్టైలింగ్ ఇప్పటికే కాలేజీ అమ్మాయిల్లో పాపులర్ అవ్వగా గత ఏడాది కాలంగా ఆ నటులు తాగే డ్రింక్స్, తినే ఫుడ్ ఐటమ్స్కి ఎంటైర్ యూత్లో డిమాండ్ పెరిగింది. ఏకంగా రెస్టారెంట్ కే డ్రామాలకు ఉన్న ఫ్యాన్బేస్ని, యూత్లో ఉన్న క్రేజ్ని ఆధారం చేసుకుని హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ కొరియన్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. గత పదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న చో మిన్ యున్ అనే కొరియన్ మహిళ గోగుర్యో పేరుతో ఈ రెస్టారెంట్ని మాదాపూర్లో ప్రారంభించింది. భారీ మెనూ గోగుర్యో రెస్టారెంట్లో ఫేమస్ కొరియన్ వంటకాలైన జాప్చో, బిబిమ్బాప్, కిమ్బాప్, రమ్యున్, కిమ్చీ ప్యాన్కేక్, గ్రిల్ల్డ్ మీట్ ఇలా పలు రకాలైన 11 పేజీలతో కూడి భారీ మెనూని అందిస్తోంది చో మిన్ యున్. ఒకేసారి 80 మంది వెళ్లి ఆస్వాదించేలా ఈ రెస్టారెంట్ని తీర్చిదిద్దారు. రెస్టారెంట్ వాల్స్పై బే సూజి లాంటి కొరియన్ స్టార్స్ పోస్టర్స్ చూస్తూ స్పీకర్లలో బీటీఎస్ మ్యూజిక్ని వింటూ నోరూరించే కొరియన్ ఫుడ్ని ఆస్వాదిస్తున్నారు హైదరాబాదీలు. బిర్యానీ ఒక్కటే కాదు కాస్మోపాటిలన్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. ఆ తర్వాత సౌతిండియన్ తాలిని అందించే హోటళ్లు కోకొళ్లుగా ఉన్నాయి. వీటి తర్వాత ఇటాలియన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లు వచ్చాయి. ఆ తర్వాత రాయలసీమ రుచులు, పల్లె రుచులు, తెలంగాణ రుచులు పేరుతో దేశీ వంటకాలు కూడా ఫేమస్ అయ్యాయి. వాటా వ్యాపారం పుంజుకుంది. ఇక చైనీస్ రెస్టారెంట్లు, ఫుడ్కోర్టులు గల్లీగల్లీకి వెలిశాయి. ఐనప్పటికీ కొరియన్ క్యూజిన్ జాడలు ఇప్పటి వరకు లేవు. కేవలం యూబ్యూబ్లో బీటీఎస్, ఓటీటీలో కే డ్రామాల మూలంగా స్థానికంగా ఏర్పడిన ఫ్యాన్ బేస్ కోసమే ఇప్పుడు కొరియన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. చదవండి:ఈ ఫుడ్ డెలివరీ యాప్తో బరువు తగ్గుతారు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement