breaking news
release water
-
మరిన్ని నీళ్లు కావాలి..
♦ సాగర్ కింద అదనంగా 10.5 టీఎంసీలు కోరుతున్న ఏపీ ♦ నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టు నీటి విడుదలపై తెలంగాణ ఎంత దిగొస్తోంటే... ఏపీ అంత బెట్టు చేస్తోంది. బోర్డు సూచన మేరకు ఆవిరి, సరఫరా నష్టాలను సైతం పక్కనపెట్టి కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నా, మరింత అదనపు నీటికై పట్టుపడుతోంది.నాగార్జునసాగర్ నుంచి తమ తాగు, సాగు అవసరాలకు 10.5టీఎంసీల నీటిని కేటాయిం చాలంటూ ఏపీ కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. ఈ లేఖలపై వెంటనే స్పందించిన బోర్డు నీటి విడుదలకై చర్యలు తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది. తెలంగాణ వాదన బేఖాతరు... నిజానికి ఏపీకి దక్కాల్సిన సంపూర్ణ వాటా ఇచ్చే శామని తెలంగాణ తొలి నుంచీ చెబుతూ వస్తోంది. దీన్ని ఖాతరు చేయని ఏపీ... సాగర్ డ్యామ్ వద్ద గొడవకు దిగడంతో బోర్డు సూచన మేరకు తెలంగాణ నీటిని విడుదల చేసింది. అదీ చాలదన్నట్లు తాజాగా సాగర్ కుడి కాల్వ కింద 15.20 టీఎంసీలకు గానూ 13.89 టీఎంసీలే విడుదల చేశారని, తమకు ఇంకా 1.3 టీఎంసీలు రావాలని లేఖ రాసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నీటిని విడుదల చేయాలని కోరింది. దీంతో పాటే కృష్ణాడెల్టా కింద మరో 6.48 టీఎంసీలు కావాలం టోంది.కుడి కాల్వ కింద సైతం తమకు 3.5 టీఎంసీల కేటాయింపులున్నా.. 0.98టీఎంసీలే విడుదల చేశార ని, మరో 2.52 టీఎంసీలు కావాలని కోరుతోంది. ఇక సాగర్లో వాస్తవ నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అది 511.4 అడుగులకు చేరింది. ఇంకో అడుగు దాటితే కనిష్టానికి పడిపోతుంది. -
గోదావరిలో తగ్గిన ఇన్ఫ్లో
కొవ్వూరు: గోదావరిలో ప్రవాహ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 57,980 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రం 6 గంటలకు 54,407 క్యూసెక్కులకు తగ్గింది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 13,500 క్యూసెక్కుల నీటì ని విడిచిపెడుతున్నారు. ఆనకట్టకు ఉన్న 175 గేట్లను 0.10 మీటర్లు ఎత్తులేపి మిగిలిన 40,907 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పుడెల్టాకు బుధవారం కంటే నీటి విడుదల వెయ్యి క్యూసెక్కుల చొప్పున కుదించి 3,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సెంట్రల్ డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు ఏడు 7,300 క్యూసెక్కులను యథావిధిగా విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కులు జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువకు 7,300 క్యూసెక్కులు నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, నరసాపురం కాలువకు 2,093, జీ అండ్ వీ కాలువకు 898, అత్తిలి కాలువకు 792 క్యూసెక్కుల నీరు చొప్పున విడుదల చేస్తున్నారు. -
పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకి 5,500 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకి 1,079 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,046, నరసాపురం కాలువకి 1,808, గోస్తనీ(జీఅండ్ వీ)కి 564, అత్తిలి కాలువకి 601 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 10,800 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. -
సుంకేసుల నుంచి నిలిచిన నీటి విడుదల
నంద్యాలకు తప్పని తాగునీటి కష్టాలు నంద్యాల: సుంకేసుల రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటి విడుదల నిలిచిపోయింది. గత వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెల 9వ తేదీన సుంకేసుల డ్యాం వద్ద 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ నీటితో పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు గట్టెక్కుతాయని చైర్పర్సన్ దేశం సులోచన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. నీటిని విడుదల చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శిల్పామోహన్రెడ్డి, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే 9వ తేదీ విడుదల చేసిన నీరు 13వ తేదీ సాయంత్రం నంద్యాలకు చేరింది. ఈ నీటిలో చిన్న చెరువును సగం నింపారు. పాత, కొత్త ఎస్ఎస్ ట్యాంకులను నింపడానికి అధికారులు ఏర్పాటు చేస్తుండగా.. సుంకేసుల నుంచి నీటి సరఫరాను నిలిపి వేశారు. సుంకేసులకు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో నీటి విడుదలను నిలిపి వేశారని డీఈ షాకీర్ హుసేన్ తెలిపారు. ప్రస్తుత ం నంద్యాలలోని పాత, కొత్త ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరింది. వీటికి నీరు చేరకుంటే నంద్యాల ప్రజలు దాహం తో అల్లాడాల్సిందే. విభేదాల కారణంగా స్థానిక టీడీపీ నేతలు ప్ర‘జల’ కష్టాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
వాడీవేడిగా...
జెడ్పీ సమావేశం గరంగరం మచిలీపట్నం : మచిలీపట్నంలో మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశం గరంగరంగా సాగింది. నీరు-చెట్టు, సాగునీటి విడుదల అంశాలపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖరీఫ్కు సాగునీటి విడుదల అంశంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు లేదని, క ృష్ణాడెల్టాకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15న నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తామని చెప్పడం గమనార్హం. పులిచింతల ప్రాజెక్టులో నాలుగైదు టీఎంసీల నీరు ఉందని, ఈ నీటిని విడుదల చేస్తే 15 రోజుల పాటు సరిపోతుందని, ఆ తరువాత ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశం లేదని మంత్రి తెలిపారు. ఈ లెక్కన క ృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. చైర్పర్సన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షం నీరు-చెట్టులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు 70 శాతం మేర అవినీతికి పాల్పడ్డారని సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. దీనిపై చైర్పర్సన్ అనూరాధ స్పందిస్తూ ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అర్హత లేదని, ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో చైర్పర్సన్ తీరుపై పాలకపక్ష సభ్యులు మండిపడ్డారు. ఇద్దరు సభ్యులే ఉన్నా పాలకపక్షాన్ని నిలదీస్తారని, మాట్లాడొద్దని అనడం సరికాదని హితవు పలికారు. ప్రైవేటు పాఠశాలలను వేధించొద్దు... విద్యాశాఖపై సమీక్ష సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను నోటీసులు ఇచ్చి వేధించవద్దని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. దీనిపై జెడ్పీ ప్రతిపక్ష నేత తాతినేని పద్మావతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను సమర్థించటం సమంజసంగా లేదని విమర్శించారు. పింఛన్ల సొమ్ము దాచుకోవాలా? పింఛన్ల పంపిణీ గందరగోళంగా మారిందని, కొందరికి బ్యాంకుల ద్వారా.. మరికొందరికి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల ద్వారా ఇస్తున్నారని పెనమలూరు, గన్నవరం ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వల్లభనేని వంశీతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. నిరుపేదలకు పింఛన్లు ఇస్తుంటే ఆ సొమ్మును దాచుకోవాలని అంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పింఛనుదారు తనకు ఎంత అవసరమో అంతే నగదు తీసుకునే అవకాశముందని చెప్పారు. మిగిలిన సొమ్ము అవసరమైన సమయంలో తీసుకోవచ్చన్నారు. ఈ పద్ధతిని జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ అభినందించారని వివరించారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ వేలిముద్ర పడని వారికి పింఛను ఇవ్వటం లేదని, జిల్లాలో ఎంతమందికి ఈ రకంగా నిలిపివేశారో వివరాలు చెప్పాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ గత జెడ్పీ సమావేశం నాటికి 23 వేల మందికి పింఛన్లు వివిధ కారణాలతో నిలిచిపోయాయని, ఆ సంఖ్యను 10,400కు తీసుకువచ్చామన్నారు. అనంతరం జెడ్పీ పాలకవర్గం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ను దుశ్శాలువాలతో కార్యాలయ సిబ్బంది సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జేసీ గంధం చంద్రుడు, జేసీ-2 ఒంగోలు శేషయ్య, ట్రైనీ కలెక్టర్ సలోమి, జెడ్పీ వైస్చైర్పర్సన్ శాయన పుష్పావతి పాల్గొన్నారు. ఇసుక సీనరేజ్ నిధులు ఎప్పుడిస్తారు జిల్లాలో ఇసుక క్వారీలను కొన్నింటిని మూసివేశారని, సీనరేజ్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని జెడ్పీ ప్రతిపక్ష నేత తాతినేని పద్మావతి సమావేశం దృష్టికి తీసుకురాగా, ఇసుక విక్రయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి ఉమ బదులిచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గత ఏడెనిమిది నెలలుగా నూజివీడు పరిసర ప్రాంతాలకు ఇసుక అందించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వాగులు, వంకల నుంచి ఇసుకను విక్రయిస్తున్నారని, మన జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అడ్డుకుంటున్నారని చెప్పారు. మోపిదేవి జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు మాట్లాడుతూ బొబ్బర్లంక, మోపిదేవి రేవుల సమీపంలో సరిహద్దులు నిర్ణయించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. నూజివీడు జెడ్పీటీసీ బాణావతు రాజు మాట్లాడుతూ గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అటవీ భూములను వెనక్కి తీసుకుంటారనే అపోహ ప్రజల్లో ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉమా మాట్లాడుతూ పేదల భూములను వెనక్కి తీసుకోమని, భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకునేందుకే సర్వే జరుగుతోందని చెప్పారు. పాఠశాలల్లో సౌకర్యాలు, వసతుల సమస్యలపై ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, పదో తరగతి ఫలితాల్లో జిల్లా పదో స్థానంలో నిలవడంపై ఎమ్మెల్సీ ఏఎస్ రామక ృష్ణ సమావేశంలో ప్రస్తావించారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు తాతినేని పద్మావతి ప్రజాసమస్యలపై జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ చేస్తున్నారని జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అన్నారు. వైఎస్సార్ సీపీకి తక్కువ మంది సభ్యులే ఉన్నారని, వారికి మాట్లాడే అర్హత లేదని సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ వ్యాఖ్యానించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పాలకపక్షం వక్రమార్గంలో నడుస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిలదీయటం సహజమని చెప్పారు. -
'అనంత, చిత్తూరు జిల్లాలకు తాగునీరు విడుదల చేయండి'