breaking news
Relatives protest
-
వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
సాక్షి, విజయవాడ: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని అతడి బందువులు ఆందోళనకు దిగారు. వివరాలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వరప్రసాద్ అనే యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కరెంట్ పోయినా జనరేటర్ వేయకపోవడం వల్లే వెంటిలేటర్ పనిచేయలేదని, అందువల్లే మృతి చెందాడని బంధువుల ఆరోపించారు. నర్సులు, జూనియర్ డాక్టర్లే వైద్యం చేశారని, సీనియర్ వైద్యులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించడం వల్లే మృతి చెందాడని, ఆస్పత్రి నిర్లక్ష్యం వహించలేదంటూ సూపరింటెండెంట్ వివరించారు. -
చనిపోతే.. అంతే!
జడ్చర్ల : భవన నిర్మాణానికి సంబంధించి బండలు దించుతుండగా ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందగా యాజమాన్యం మృతదేహాన్ని గు ట్టుగా అతని స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్కు తరలిం చి చేతులు దులుపుకుంది. గురువారం ఆలస్యం గా వెలుగుచూసిన ఈ ఘటన మండలంలోని పో లేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన బిజినెస్ కళాశాలలో చోటుచేసుకుంది. స్థానికులు కొందరు సంబంధిత కళాశాల ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టడంతో ఈ విష యం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో బిజినెస్ కళాశాలను ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయగా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నా యి. పనుల్లో భాగంగా ఆదివారం అడుగు భా గంలో వేసే మార్బుల్స్ను లారీ నుంచి అన్లోడ్ చేస్తుండగా అవి ప్రమాదశాత్తు జారిపడి పశ్చిమబెంగాల్కు చెందిన గొల్జర్ రహమాన్(45) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో యాజమాన్యం వెంటనే ఎవరికీ తెలియకుండా గుట్టుగా అంబులెన్స్లో అతని స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్కు తరలించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే గురువారం రహమాన్ సోదరులు ముజియలక్, అన్వర్ కళాశాల యాజమాన్యం వద్దకు వచ్చి తమ సోదరుడి మృతికి సంబంధించి విచారించారు. దీంతో యాజమాన్యం తమకు ఎలాంటి సంబంధం లేదని, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటూ చెప్పడంతో వారు స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులను ఆశ్రయించారు. దీంతో బాధిత కుటంబానికి రూ.40 లక్షలు ఎక్స్గ్రేషియా, పిల్లలకు చదువు వసతి కల్పించాలని, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట వారు ఆందోళన చేశారు. ఎస్ఐ వెంకటనారాయణ అక్కడికి చేరుకుని విచారించారు. ఆందోళనలో ఆంబేద్కర్ సంఘం నాయకులు రా జు, అంజి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రహమాన్ను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కూచిబిహారి జిల్లా దుదీర్కుతి దేవంబాస్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈయనకు భార్య లైలిబీబీ, పిల్లలు లోవెలు హొసైన్, లబీబ్ ఇస్లాం ఉన్నారు. అసలేం జరుగుతుంది? పోలేపల్లి గ్రీన్ పార్కులో అసలేం జరుగుతుందన్న అనుమానాలు కలుగుతుంది. ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని మరణిస్తే గుట్టుగా శవాలను మాయం చేయడమేనా అన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. గతంలోనూ అనేక ప్రమాద సంఘటనలు చోటుచేసుకుని పలువురు మృత్యువాత పడినా అవి పోలీసుల ఖాతాకు చేరకుండానే కథ ముగిసిపోయింది. ప్రస్తుతం కూడా ఇదే కోవలో రహమాన్ మృతదేహాన్ని రాష్ట్రం దాటించారంటే పరిస్థితిని ఊహించవచ్చు. వాస్తవంగా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి. అక్కడ చికిత్స చేయడం లేదా మరణించారని డాక్టర్లు ధ్రువీకరించిన తర్వాత పోలీసులకు సమాచారం అందించి చట్టప్రకారంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండానే గుట్టుచప్పుడు కాకుండా తమ చేతులు దులుపుకుంటున్నారు. వాట్సప్ ద్వారా ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని కొందరు జిల్లా ఎస్పీ అనురాధ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మృతుడు, తదితర సంఘటన ఫొటోలను వాట్సప్ ద్వారా ఎస్పీకి పంపినట్లు సమాచారం. దీంతో ఎస్పీ సమగ్ర విచారణకు జడ్చర్ల పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భాస్కర్గౌడ్ జడ్చర్ల పోలీస్స్టేషన్లో విలేకరులకు తెలిపారు. అయితే అసలేం జరిగిందన్న వివరాలు వెల్లడించేందుకు సంబంధిత కళాశాల యాజమాన్యం ముందుకు రాకపోవడం గమనార్హం. -
కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
విద్యార్థి ఆత్మహత్య ఘటనపై నిరసన రామచంద్రాపురం: మెదక్ జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం రాత్రి క్యాంపస్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. తోటి విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన విద్యార్థి సూరజ్ మెదక్ జిల్లా అమీన్పూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయని క్యాంపస్లో యాజమాన్యం సూరజ్ను వేధించారు. దీంతో అతను జనవరి 29న క్యాంపస్ భవనంపై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సూరజ్ తల్లిదండ్రులు వసంత్రావు, సంగీతలు తమ కుమారుడ్ని సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సూరజ్ ఈ నెల 14న మృతి చెందాడు. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు, కళాశాల యాజమాన్యం రహస్యంగా ఉంచారు. సూరజ్ తల్లి సంగీత తన కుమారుడు ఎలా కింద పడ్డాడని ఆరా తీసేందుకు గురువారం రాత్రి ఘటన స్థలానికి రాగా.. విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఆమె నుంచి సూరజ్ మృతి వార్త తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. -
ఆస్పత్రిలో రోగి మృతి : బంధువుల ఆందోళన
నల్లగొండ : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలొదిలింది. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మునుగోడు మండల కేంద్రానికి చెందిన జయమ్మ(30) సోమవారం రాత్రి కడుపునొప్పితో నల్లగొండలోని సురక్ష ఆస్పత్రిలో చేరింది. కాగా అక్కడ చికిత్స తీసుకుంటూ మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాధితురాలు మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు మోహరించాయి.