-
మే 2న ఎంసెట్
♦ తెలంగాణలో వివిధ ఉమ్మడి {పవేశ పరీక్ష తేదీలు ఖరారు ♦ వివరాలు వెల్లడించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ♦ మే నెలాఖరుకు ఎంసెట్ ఫలితాలు ♦ జూన్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు ♦ జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు ♦ ఆలోగా వృత్తి విద్యా కోర్సుల్లో కొత్త ఫీజుల ఖరారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2న ఎంసెట్-2016 నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. జూన్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, జూలై 1 నుంచి తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను పాపిరెడ్డి ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న వృత్తి విద్యా కోర్సుల్లో కొత్త ఫీజులను కూడా ప్రవేశాల నాటికి ఖ రారు చేస్తామన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యా సంస్థల్లో ఓపెన్ కోటా సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం కల్పించాల్సి ఉన్నందున... ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఎంసెట్ రాసేలా చర్యలు చేపట్టామని వివరించారు. అందుకే ఏపీ కంటే మూడ్రోజుల ముందుగా (ఏపీ ఎంసెట్ మే 5వ తేదీ) తెలంగాణ ఎంసెట్ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే నెలాఖరుకు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. అలాగే జాతీయస్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలతో క్లాష్ కాకుండా తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 2016-17లో ప్రవేశాలకు సెట్ల తేదీలను, ఆయా పరీక్షల నిర్వహణ సంస్థలను ఖరారు చేసినట్లు వివరించారు. ఆయా సెట్స్ కన్వీనర్లను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. వారాలు, తిథిలతో సహా సమాచారం తెలంగాణలో వివిధ సెట్స్ నిర్వహణ తేదీలను వారాలు, తిథిలతో సహా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్ను (మే-2) సోమవారం దశమి రోజున నిర్వహించాలని నిర్ణయించింది. వాటితోపాటు ఇతర పరీక్షల తేదీల్లోనూ ఆయా వివరాలను వెల్లడించింది. ఆదివారం ఎక్కువగా జాతీయ స్థాయి పరీక్షలు ఉండటం, క్రిస్టియన్లకు ఆ రోజు ప్రార్థనలు ఉంటాయి క నుక ఎంసెట్ను ఆదివారం నిర్వహించవద్దని నిర్ణయించింది. ఫిబ్రవరి చివరి నాటికి అనుబంధ గుర్తింపు! ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు కూడా ఉండటంతో దీనిపై దృష్టి సారించింది. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూను ఆదేశించింది. నాణ్యత.. మెరుగైన బోధనే లక్ష్యం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, మెరుగైన బోధనే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ పక్కాగా తనిఖీలు చేస్తున్నాయన్నారు. గత ఏడాది కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేసుకున్నాయని, వచ్చే విద్యా ఏడాది నాటికి మరిన్ని కాలేజీలు మూత పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపైనా దృష్టి సారించామని, సంక్రాంతి తరువాత టాస్క్ఫోర్స్ కమిటీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు వసూలు చేసే ఫీజులను ఖరారు చేసేందుకు కాలేజీలు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ గడువును ఇక పెంచేది లేదని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కాలేజీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం, కొత్త డిగ్రీ సిలబస్ను అమలు చేస్తామన్నారు. -
మద్యంపై ఉన్న ధ్యాస.. విద్యపై లేదు
ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం ఇదే తీరు కొనసాగితే మరో ఉద్యమమే అధిక ఫీజు వసూళ్లపై హెచ్ఎస్పీఏ మండిపాటు శ్రీనగర్కాలనీ: పైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు విక్రాంత్, ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, ఆశిష్లు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏడేళ్లుగా 225 శాతం ఫీజులు పెరిగాయని చెప్పారు. పాఠశాల యాజమన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థికభారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల వసూళ్లపై మంత్రి కడియం శ్రీహరికి, అధికారులకు నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యమని ఆరోపించారు. మద్యంపై ఉన్న ధ్యాస విద్యావ్యవస్థపై ఉంటే... మూడు రోజుల్లో సమగ్ర చట్టాలను రూపొందించవ్చని అభిప్రాయపడ్డారు. మద్యం విధివిధానాలపై చర్చలు, సమావేశాలు జరుపుతున్న ప్రభుత్వం.. విద్యా చట్టాల విధానాల్ని మార్చలేక పోతోందని మండిపడ్డారు. తమిళనాడు, మహారాష్ట్ర తరహా విద్యా చట్టాన్ని రూపొందించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఫీజుల నియంత్రణ చేపట్టకపోతే మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా ప్రతి పాఠశాలలో అసోసియేషన్గా ఏర్పడి ఫీజుల నియంత్రణపై పోరాడాలని పిలుపు నిచ్చారు. ఆ చిత్తశుద్ధి ఏది..? దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీఓ నెంబర్ 91ని సమగ్రంగా అమలు చేస్తూ చిత్తశుద్ధితో ఫీజుల నియంత్రణ చేపట్టారని ప్రశంసించారు. ఆయన మరణానంతరం జీఓను తుంగలో తొక్కారని, మూడేళ్లలో కోల్పోయిన ఫీజులను ముక్కుపిండి వసూలు చేశారని ధ్వజమెత్తారు. దీంతో ప్రస్తుతం చదువు కొనుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఐదు శాతానికి మించి ఫీజులు పెంచకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా... 20, 30 శాతం పెంచేశారని మండిపడ్డారు. ఫలితంగా తల్లిదండ్రులు వ్యక్తిగత రుణాలు తీసుకుని పిల్లల ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రవి, కమల్, సాయిరాజ్ పాల్గొన్నారు. చట్టబద్ధత అవసరం విద్యావ్యవస్థలో చట్టబద్దత అవసరం. నేటి విద్యావ్యస్థ వ్యాపారంగా తయారైంది. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర భారాన్ని మోపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టం తీసుకువచ్చి ఏడేళ్లు అవుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వాలు భాద్యత వహించి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. - విక్రాంత్, హెచ్ఎస్పీఏ అధ్యక్షుడు ప్రభుత్వాలు మారినా ఫలితం లేదు... ప్రభుత్వాలు మారినా విద్యావ్యస్థలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇష్టం వచ్చినట్లు ఫీజులు దండుకుంటున్నారు. వైఎస్సార్ హయాంలో జీఓ 91 సమగ్రంగా అమలు పరిచి ఫీజుల నియంత్రణను చేపట్టారు. రాజకీయం రంగులు మారుతుందే తప్ప విద్యావ్యస్థ, విధానాల్లో మార్పులు రావడం లేదు. - సుబ్రహ్మణ్యం, హెచ్ఎస్పీఏ సభ్యులు
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
Advertisement