breaking news
reethu
-
'కూతురు ప్రేమంటే ఏంటో ఈ వీడియో చూస్తే చాలు'
జబర్దస్త్ నటి రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనలైంది రీతూ. నువ్వు లేని లోకంలో ఉండలేక పోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. తండ్రితో కలిసి చేసిన రీల్స్ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన సందేశం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు మేమంతా ఉన్నాం.. ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీతూ చౌదరి తన ఇన్స్టాలో రాస్తూ.. 'డాడీ.. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు. నువ్వు లేని లోకాన్ని ఊహించలేకపోతున్నా. నాపై నీ ప్రేమను ఇంకెవరూ చూపించలేరు. నేను అలిగితే బతిమాలుతావు. నాకు చిరాకు, కోపం పడినా మళ్లీ నవ్విస్తావ్. ఎవరైనా నన్ను ఒకమాట అంటే తిట్టేవాడివి. అలాంటి నన్ను వదిలి ఎలా వెళ్లిపోయావు. నాకు నువ్వే అన్నం తినిపించేది. నన్ను మోటివేట్ చేసేది. నువ్వు, నేను కలిసి రీల్స్ చేసేది. నువ్వు తిరిగిరా డాడీ.. నువ్వు చెప్పినట్లు వింటాను. నీ కూతురును పులి అన్నావ్. మళ్లీ పులిని ఎలా వదిలి వెళ్లిపోయావ్. అమ్మా, అన్న నిన్ను తలుచుకుంటూనే ఉన్నారు. ప్లీజ్ రా డాడీ.' అంటూ వీడియో పోస్ట్ చేసింది. -
నాన్నా..‘ఎస్ వికెన్ డూ ఇట్’!
డెహ్రాడూన్: వాళ్లిద్దరూ విభిన్న భావజాలం కలిగిన పార్టీలకు చెందిన వారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒకే లక్ష్యంతో పోటీకి దిగారు. మాజీ సీఎంలైన తమ తండ్రులకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తండ్రులు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఎన్నికల బరిలో దిగారు. వారే కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె అనుపమా రావత్. బీజేపీ మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి. బీసీ ఖండూరి 2012 ఎన్నికల్లో కొత్ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న రీతూ ఖండూరి మాట్లాడుతూ ‘అప్పట్లో మా నాన్న గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో పోటీ చేసి నేను గెలిచి చూపిస్తా. మా పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది’’ అని అన్నారు. ఇక హరీశ్ రావత్ 2017 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి హరిద్వార్ (రూరల్) నుంచి ఓటమిపాలయ్యారు. రావత్ కుమార్తె అనుపమా గత ఏడేళ్లుగా హరిద్వార్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ‘‘హరిద్వార్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటివరకు నెగ్గలేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే మా నాన్నను ఓడించి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సారి గెలుపు నాదే’’ అని అనుపమ ధీమాగా చెప్పారు. మొత్తానికి ఈ ఇద్దరు కుమార్తెలు తండ్రుల ఓటమికి ప్రతీకారంగా అవే నియోజకవర్గాలను ఎంచుకొని పోటీకి దిగడం అందరినీ ఆకర్షిస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సూపర్ సర్పంచ్
ఊరి సర్పంచ్కి పవర్ ఉంటుంది.పవరుంటే.. ఊరికి కరెంటొస్తుంది.మంచినీళ్లొస్తాయి. మంచి రోడ్లు పడతాయి.శుభ్రమైన మరుగుదొడ్లు వస్తాయి.అయితే రీతూ జైస్వాల్ ఇవన్నీ చేశాకేసర్పంచ్ అయ్యారు!సర్పంచ్ అవాలని చేయలేదు.‘ఇదా ఊరు!’ అని సర్ప్రైజ్ అయి చేశారు.అందుకే ఆమె సూపర్ సర్పంచ్. ‘‘నేను కలలు కన్న భారతదేశ నిర్మాణం కోసం నేను ఎంతగానైనా శ్రమిస్తాను. ఈ విధి నిర్వహణలో నాకు ఎదురైన అడ్డంకులను అధిగమించే వరకు శ్రమించగలిగిన మానసిక శక్తి నాలో ఉంది. అది నా తల్లిదండ్రుల పెంపకంలో నాకు అబ్బిన నైజం. నా వంతు బాధ్యతగా మా ఊరిని బాగు చేస్తాను’’. ఈ మాటలు అన్నది రీతూ జైస్వాల్. ఆమె బిహార్ రాష్ట్రం, సీతామర్హి జిల్లా, సింగ్వాహిని గ్రామ ముఖి... అంటే గ్రామ సర్పంచ్ అన్నమాట. ఆమె ఇంత స్థిరంగా ఈ మాటలు చెప్పడానికి కారణం... ‘ఊరిని బాగు చేయడం ఆమె వల్ల అయ్యే పని కాదంటూ వచ్చిన కొందరి అభిప్రాయాలు. ఆమెను అలా అన్న వాళ్లు అలాంటి అభిప్రాయం వెలిబుచ్చడంలో ఎటువంటి కుయుక్తీ లేదు, కుసంస్కారమూ లేదు. ఉన్నదంతా నిస్పృహ మాత్రమే. ‘ఎవరు వచ్చి, ఎంత చేసినా ఈ గ్రామాల రూపురేఖలు మారవు’ అనే నిరాశ మాత్రమే. నగరంలో పుట్టి పెరిగిన యువతి, సంపన్న కుటుంబంలో పుట్టిన యువతి, ఐఏఎస్ అధికారి భార్యగా సకల సౌకర్యాలతో జీవిస్తున్న యువతి... ఓ కుగ్రామంలో ఉండగలుగుతుందా అనే సందేహం వాళ్లది. గ్రామాన్ని బాగు చేయాలనే ఆమె ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలిగారు కానీ, ఆమె చివరి వరకు నిలబడగలుగుతుందనే ఆశ మాత్ర వాళ్లకు లేకపోయింది. అయితే ఆ నిస్పృహలను తుడిచేసి... సింగ్వాహిని గ్రామ ముఖచిత్రాన్ని మార్చేశారు రీతూ జైస్వాల్. పుట్టింది హాజీపూర్లో రీతూ జైస్వాల్ పుట్టింది బిహార్లోని హాజీపూర్లో. వారిది వ్యాపార కుటుంబం. బిహార్లో.. రాజధాని పట్నా తర్వాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హాజీపూర్. హాజీపూర్లోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో చదివారామె. ఎకనమిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చదువులో తెలివైన అమ్మాయి. అభ్యుదయ భావాలున్న అమ్మాయి. ‘ఆల్ గర్ల్స్ టీమ్’కు నాయకత్వం వహించి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనేవారు. పేదవాళ్లు నివసించే కాలనీల్లోని వాళ్లకు దుస్తులు పంచాలని నిర్ణయించింది ఆల్ గర్ల్స్ టీమ్. అప్పుడు రీతూ వాళ్లమ్మకు తెలియకుండా ఆమె చీరలు తెచ్చి పంచేశారు. ఆ సంఘటన గుర్తు చేస్తే ఇప్పటికీ పెద్దగా నవ్వుతారు రీతూ. అప్పుడు వాళ్ల నాన్న ‘మీ అమ్మ చేయలేని పని నువ్వు చేశావు’ అని కూతుర్ని ప్రశంసించారట. ఇలాంటి చురుకైన అమ్మాయికి ఐఏఎస్ వరుణ్ని తెచ్చారు నాన్న. వాళ్ల పెళ్లి 1996లో జరిగింది. కొత్త దంపతులు సొంత ఊరికి వెళ్లారు. భర్త అరుణ్కుమార్ పూర్వికుల ఊరది. అదే బిహార్లోని సింగ్వాహిని గ్రామం. ప్రస్తుతం... రీతూ కార్యక్షేత్రం. నీళ్లు తాగలేకపోయింది కొత్త కోడలికి అత్తగారింటి బంధువులంతా సాదరంగా ఆహ్వానం పలికారు. ఆమె ఆ గ్రామంలోనే కాదు, అసలు గ్రామంలో అడుగుపెట్టడమే తొలిసారి. విందు భోజనాలు మొదలయ్యాయి. భోజనం వడ్డించి గ్లాసులో నీళ్లు పెట్టారు. నీటిలో నుంచి గ్లాసు అడుగు కనిపించడం లేదు. అదేదో లేత పసుపు రంగు జ్యూస్ కావచ్చు అనుకున్నారామె మొదట. తాగడానికి నీళ్లు కావాలని అడిగితే.. ‘ఇవిగో’ అంటూ ఆ గ్లాసును చూపించారు. సింగ్వాహిని గ్రామంలో నీళ్లు అలాగే ఉంటాయని అరుణ్కుమార్కు తెలుసు కాబట్టి అతడికి ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కానీ పరిశుభ్రమైన నీటిని ఫిల్టర్లో వడపోసి మరీ తాగుతూ పెరిగిన అమ్మాయికి మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం కంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉండకపోవచ్చు. కోడలికి శుభ్రమైన నీరు తాగే అలవాటు ఉందని తెలిసినా అత్తింటి వాళ్లు చేయగలిగిందేమీ లేదు. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లు వాటర్ ప్లాంట్లు అందుబాటులో లేవు. క్యాన్లలో నీటిని తెచ్చుకునే సౌకర్యమూ లేదు. దేశంలో మంచినీటి వ్యాపారం మొదలైనప్పటికీ మారుమూల గ్రామాలకు చేరని రోజులు. ఆ చేదు జ్ఞాపకంతోనే భర్తతోపాటు ఢిల్లీకి చేరారామె. ఊరు మారనేలేదు ఢిల్లీలో సంపన్నులు నివసించే ప్రదేశాల్లో ఖేల్గావ్ ఒకటి. రీతూ దంపతుల నివాసం కూడా అక్కడే. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆర్యన్, కూతురు అవని. పిల్లలిద్దరూ టీనేజ్లోకి వచ్చారు. ఓసారి పిల్లలకు నానమ్మ వాళ్ల ఊరిని చూపించాలని తీసుకెళ్లారు. ఈ ప్రయాణం 2014లో. ఊరిలో ఏ మార్పూ కనిపించలేదు. మురికి నీటినే తాగుతున్నారు, బహిరంగ విసర్జన అత్యంత సాధారణమైన విషయం అక్కడ. కరెంటు కూడా సరిగా లేదు. ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని అప్పుడనుకున్నారామె. ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని భర్తతో చెప్పారు. తనకు చేయాలని ఉన్నా చేయలేని పనిని తన భార్య చేస్తానని ముందుకు రావడంతో ఆయన రీతూకి మద్దతుగా నిలిచారు. తర్వాత అత్తమామలను అడిగారామె. ‘మాకు అలవాటై పోయింది కానీ, ఈ ఊరిలో మీరు ఉండలేరు, మీరు హాయిగా ఢిల్లీలోనే జీవించండి’ అన్నారు వాళ్లు. ‘ఉన్నఫళాన ముందడుకు వేయకు, మరోసారి ఆలోచించుకో’ అన్నారు పుట్టింటి వాళ్లు. ‘ఇన్నేళ్లు మిమ్మల్ని పెంచాను, ఇక ఊరి కోసం కొన్నాళ్లు పని చేస్తాను’ అని పిల్లల్ని అడిగారు. ఆ తర్వాత సింగ్వాహినికి ప్రయాణమయ్యారు. లైటాపడానికి నోటితో ఊదింది! ‘‘ఊరి కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష మాత్రమే ఉంటే సరిపోదు. దానికోసం మనకు చేతనైన ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి. అందుకోసం ఊరిలో అన్ని వీధులూ, నాలుగు మూలలా తిరిగి చూశాను. శ్రామిక వాడల్లో స్త్రీలతో మాట్లాడాను. వాళ్లకేం కావాలో తెలుసుకోవడానికి వాళ్లను ఇంటికి పిలిచేదాన్ని. వాళ్లు చెప్పినవన్నీ రాసుకునేదాన్ని. అందులో నుంచి ఏయే డిపార్ట్మెంట్లతో మాట్లాడాల్సిన వాటిని విడిగా లిస్ట్ అవుట్ చేసుకునే దాన్ని. అలా ఆ మహిళలు నాతో చాలాసేపు మా ఇంట్లోనే ఉండేవాళ్లు. వాళ్లేం తింటున్నారనే సంగతి నుంచి ప్రభుత్వ పథకాలు వాళ్లకు ఎంత వరకు చేరుతున్నాయనే వివరాలు కూడా నాకు తెలుస్తుండేవి. నేను ఏ మాత్రం ఊహించని షాక్ ఏమిటంటే.. ఓ రోజు ఇంట్లో మేము కూర్చున్న గది కాకుండా మరో గదిలో మూలన వెలుగుతున్న స్టాండ్ లైట్ను ఆపేయమని ఒకామెతో చెప్పాను. ఆమె నోటితో ఊదింది. వాళ్లకు కరెంటు లేకపోవడం కాదు నన్ను ఆశ్చర్యపరిచింది, కరెంటు లైట్ వేయడానికి ఆపేయడానికి స్విచ్ ఉంటుందని కూడా తెలియకపోవడం నన్ను కలచి వేసింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా అని కూడా అనిపించింది’’ అన్నది రీతూ ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదనగా. ఊరిని ఏకం చేసింది బిహార్ను తరచూ వరదలు అతలాకుతలం చేస్తుంటాయి. గత ఏడాది వరదలు రాష్ట్రంలో వందలాది ప్రాణాలను హరించాయి. కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆ వరదలు సింగ్వాహిని గ్రామాన్ని కూడా కదిలించి వేశాయి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల కోసం ఎవరైనా ప్రభుత్వం వైపే చూస్తారు. రీతూ జైస్వాల్ ప్రభుత్వ అధికారుల బృందం వచ్చే వరకు ఎదురు చూడకుండా కార్యరంగంలో దిగారు. దారి తప్పి వచ్చిన వాళ్లకు షెల్టర్ ఏర్పాటు చేశారు. వాళ్లను ఊరి అతిథులుగా ఆదరించాలని చెప్పి ఊరి వాళ్లను ఏకం చేసి వాళ్లకు సహాయం చేసే బాధ్యత పురమాయించారు. ప్రతి ఇంటి నుంచి ఆ ఇంటి వాళ్లతో పాటు మరొకరికి భోజనం వండాలి. ఆ భోజనం ఊరి అతిథుల కోసం. కొందరు యువకులతో సర్వీస్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఆ సర్వీస్ టీమ్లోని యువకులు ఇంటింటికీ వెళ్లి అతిథి భోజనాన్ని సేకరించి షెల్టర్లో ఉన్న వాళ్లకు అందించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూడడం, ప్రభుత్వమే చేయాలని ఆశించడం, సరిగ్గా చేయలేదని ఆరోపించడం కాదు. మనం ఏం చేయగలమో అంత మేర చేయడానికి సిద్ధం కావాలి’’ అని చెప్పారామె. ఆదర్శ సారథ్యం రీతూ జైస్వాల్ ‘ఉచ్ఛ శిక్షిత్ ఆదర్శ్ యువ సర్పంచ్ పురస్కార్ 2016, చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ 2018’ అవార్డులు అందుకున్నారు. వీటితోపాటు ఆమె... బిహార్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ సర్పంచ్ అండ్ పంచాయత్ సెక్రటరీస్’ ప్రోగ్రామ్ కు ఎంపిక చేసిన ఐదుగురు ప్యానలిస్టుల్లో రీతూ ఒకరు. పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ రాంచిలో నిర్వహించిన ‘ఎల్పీజీ, కేటలిస్ట్ ఆఫ్ సోషల్ చేంజ్–2’ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పట్నాలో ‘బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో నమోదు కాకుండా ఉండిపోతున్న పరిస్థితులు – పెరుగుతున్న నేరాల సంఖ్య’ అంశం మీద జరిగిన సదస్సులో ప్రసంగించారు. కల నెరవేరింది ‘‘ఊరికి మొదటగా సురక్షితమైన తాగు నీరు కావాలి, మంచి రోడ్లు కావాలి, టాయిలెట్లు కావాలి. వీటిని సాధించడం ఎలాగో తెలియదు కానీ, సాధించగలననే నమ్మకంతో ఈదడం నేర్చుకోకనే ఈ సముద్రంలో దూకేశాను. ఊరి సమస్యల జాబితా పట్టుకుని సీతామర్హి కలెక్టర్ను కలిశాను. ప్రతిసారీ ఊరి వాళ్లను కనీసం నలుగురైదుగురిని అయినా నాతోపాటు తీసుకెళ్లేదాన్ని. బయటి నుంచి వచ్చిన నేను చెప్పడం కంటే సమస్యను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్లు చెబితేనే సమస్య తీవ్రత అర్థమవుతుంది. కలెక్టర్ సహకారంతో పాతిక హ్యాండ్ పంపులు ఒక్కొక్కటి 250 అడుగుల లోతులో వేశాం. గ్రామంలో రెండు వేల రెండు వందల టాయిలెట్లు కట్టించాం. ప్రధానమైన రోడ్లు పూర్తయ్యాయి. చిన్న రోడ్ల నిర్మాణం జరుగుతోందిప్పుడు. ఈ ఐదేళ్లలో ఊరి ముఖచిత్రం మారిపోయింది. 2016లో పంచాయితీకి ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామస్థులు పట్టుపట్టడంతో సర్పంచ్గా నామినేషన్ వేశాను. ఊరి వాళ్లు నాతో గ్రామానికి పనిచేయించుకున్నట్లే ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించుకున్నారు. అప్పటి నుంచి నా బాధ్యత పెరిగింది. ఢిల్లీకి– సింగ్ వాహినికి మధ్య దూరం వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉంటుంది. 2014 నుంచి పదహారు మధ్యలో లెక్కలేనన్ని సార్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు నెలలో ఎక్కువ రోజులు సింగ్వాహినిలోనే ఉంటున్నాను. ఢిల్లీ నుంచి మా ఊరికి చక్కటి రోడ్ల మీద వస్తుంటే నా ప్రయాణాలు వృథా కాలేదనిపిస్తుంటుంది. ఊరంటే ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలా ఉంది మా ఊరు. నా కోరిక తీరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు 42 ఏళ్ల రీతూ జైస్వాల్.– వాకా మంజులారెడ్డి -
నగేష్ నారదాసి 'బూమ్ బూమ్' స్టిల్స్