breaking news
red scandal smugler
-
‘ఎర్ర’ కేసులో నేడో, రేపో కడపకు ముఖేష్ బదాని?
జిల్లాలోని‘ పచ్చ’ నేతల్లో గుబులు వలపన్ని బదానీని అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం క్రైం( కడప అర్బన్ ) : అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ ఆదేశాల మేరకు జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నేడో, రేపో జిల్లాకు తీసుకురానున్నారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్గా పేరొందాడు. జిల్లాలోని కొందరు ‘పచ్చ’ నేతలతో నేరుగా సంబంధాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ముఖేష్ బదానీని హర్యానాలో అరెస్టు చేసిన పోలీసులు జిల్లాకు తెస్తున్నారని తెలియగానే వారిలో వణుకు పుడుతోంది. ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని జిల్లాలోని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సోమ లేదా మంగళ వారాల్లో జిల్లాకు తీసుకొచ్చి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. -
ఆపరేషన్ రెడ్లో పోలీసుల తీరు భేష్
► బెంగాల్, చెన్నై కేసుల్లో షణ్ముగం కింగ్ పిన్ ► రూ.23 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం ► విలేకరులతో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్): ‘పశ్చిమబెంగాల్, భూటాన్ సరిహద్దులో ఓ స్మగ్లర్ను పట్టుకుని ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకోవడం, మరో చోట దుంగలను పట్టుకుని స్మగ్లర్లను అరెస్టు చేయడంతో ఆపరేషన్ రెడ్ అంతమై పోదు. ఇది ఆరంభం మాత్రమే. మా దాడులు, దర్యాప్తులు, వేట కొనసాగుతూనే ఉంటుంది.’ అని జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పది రోజుల క్రితం చెన్నైకు చెందిన బాలును అరెస్టుతో స్మగ్లర్ల గుట్టు బయటపడిందన్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన సౌందర్రాజన్ను అరెస్టు చేయడం, అక్కడ గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిచ్చిన సమాచారంతో చెన్నైకు చెందిన షణ్ముగం అనే కింగ్పిన్ను పట్టుకుని రెడ్హిల్స్, మింజూరు, సిప్కో, గాంధీనగర్, అలియాభట్ ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో షణ్ముగం, సౌందర్రాజన్, శరవణన్, ఆనందన్, కర్ణ, రవి, అప్పన్రాజ్ అనే ఏడుగురు పేరు మోసిన స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. ఈ ఏడుగురిని నుంచి 500 ఎర్రచందనం దుంగలు, ఎనిమిది దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, రూ.80 వేల నగదు, అయిదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు లావీదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్దారణ అయ్యిందని ఎస్పీ తెలిపారు. అయితే నిందితులు ఏయే రూపంలో ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులకు నగదు పంపించారనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఎక్కడ ఎలా నగదు ఇచ్చి పుచ్చుకున్నారనే దానిపై డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ)తో కలిసి విచారిస్తామన్నారు. పోలీసులకు రివార్డులు... చెన్నై, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులు, దుంగల స్వాధీనంలో జిల్లాకు చెందిన 60 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. ఓఎస్డీ రత్న నుంచి డీఎస్పీలు గిరిధర్, గిరిధర్రావు, రామకృష్ణ, సీఐలు చంద్రశేఖర్, మహేష్, నర్సింహులు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందచేశారు.