breaking news
Real heros
-
ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం
యాషెస్ ఐదో టెస్ట్ సందర్భంగా.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భావోద్వేగ క్షణాలు కనిపించాయి. బాండీ బీచ్ హీరోలకు మైదానంలో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తన ప్రాణాలను పణంగా పెట్టి అనేక మంది ప్రాణాలను రక్షించిన బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్ అహ్మద్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో (SCG) బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్-అహ్మద్, ఇతరులకు ఘనమైన స్వాగతం లభించింది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఈ రియల్ హీరోకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అహ్మద్తో పాటు ఘటనలో ఇద్దరు చిన్నారులను కాపాడి గాయపడ్డ చాయా డాడోన్ కూడా వచ్చింది. ఆమె కాలికి బుల్లెట్ గాయం కావడంతో స్ట్రెచ్చర్ సాయంతో వచ్చారు. అలాగే ఘటన సమయంలో తక్షణమే స్పందించిన(ఫస్ట్రెస్పాండర్స్) వైద్యులు, పోలీసు అధికారులు అందరినీ ప్రత్యేకంగా గౌరవించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్లు ఇంగ్లండ్ ప్లేయర్స్తో కలిసి బౌండరీ వద్ద నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ వీరులంతా మైదానంలోకి వచ్చిన సమయంలో అంతా లేచి నిలబడ్డారు. చప్పట్లతో స్టేడియం మొత్తం మారుమోగించారు. బాండీ బీచ్ ఘటనలో మరణించిన 15 మంది బాధితుల పేర్లను.. మిమ్మల్ని మరువబోం (forever in our hearts)అనే పదాలతో ప్రదర్శించారు. ఆ సమయంలో ప్లేయర్లు సహా పలువురు కంటతడి పెట్టారు.The SCG rises as one to acknowledge the first responders and community heroes who bravely acted during the Bondi attack 🙏 pic.twitter.com/HUl7M34Lcx— 7Cricket (@7Cricket) January 3, 2026గ్రౌండ్ మధ్యలోకి వచ్చాక తన గుండెలపై చేయి ఉంచుకుని.. ఆపై పైకి ప్రదర్శించాడు. ఆ సమయంలో స్టేడియంలో చప్పట్లు మరింత బిగ్గరగా వినిపించాయి. జాతీయ గీతం ఆలాపన జరిగాక.. క్రికెట్ పెద్దలు, ఆటగాళ్లు ఆ వీరులతో చేతులు కలిపారు. అహ్మద్ను ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా ప్రత్యేకంగా అభినందించడం అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది.సిరియాలో పట్టి.. ఆస్ట్రేలియాకు వలస వచ్చిన అహ్మద్ అల్ అహ్మద్(43).. డిసెంబర్ 14న సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి ఘటనలో సూపర్ హీరోగా నిలిచారు. లంచ్ చేస్తున్న సమయంలో తుపాకుల మోత విన్న ఆయన.. ధైర్యం చేసి ముందుకు దూకారు. కాల్పులు జరుపుతున్న సాజిద్ అక్రమ్పైకి దూకి గన్ లాక్కుని నిలువరించారు. ఆ సమయంలో మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ జరిపిన కాల్పుల్లో కాలికి, భుజానికి తూటాలు తగిలి అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటికే భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది. సకాలంలో చికిత్స అందడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ హీరో కోసం జరిపిన ఫండ్ రైజింగ్కు అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అహ్మద్ను పరామర్శించారు. స్థానికురాలైన చాయా డాడోన్ కాల్పులు జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలకు అడ్డుగా నిలబడింది. దీంతో ఆమె కాలికి గాయాలయ్యాయి. ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియా ప్రభుత్వం వీరులుగా గుర్తించింది. -
26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబర్26న జరిగిన ఉగ్రదాడికి నేటికి సరిగ్గా 12 ఏళ్లు. పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కాల్పుల ధాటికి వేల మంది గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ఎఫ్ఐఏ జాబితాలో ముంబై ఉగ్రవాదులు) రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణకాండకు పాల్పడిన పదిమంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చగా, ఉగ్రవాది కసబ్ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) తుకారాం ఓంబుల్లు అమరులయ్యారు. ముంబై పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు అమరులకు నివాళులు అర్పించారు. ముంబై పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీఎం ఉద్దవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ నివాళులు అర్పించారు. (ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్ ) -
కేరళ వరదలు : రియల్ హీరోలు
-
రీలే కాదు.. రియల్ హీరోలు కూడా..
సాక్షి, చెన్నై: వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలను ప్రకటించిన తమిళ నటీనటులు శనివారం స్వయంగా సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళ నటులు విశాల్, ధనుష్, కార్తీ, సిద్ధార్థ్, కోవై సరళ, ఖుష్బూ తదితరులు వివిధ ప్రాంతాల్లో సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు తమ తరఫున ఆహార పొట్లాలను, మంచి నీటి పాకెట్లను అందించారు. హీరో విశాల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది బాధితులకు ఆహారాన్ని అందించారు. బాధితులతో మమేకం అయ్యి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాడు. కార్తీ కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడు. నటీమణులు ఖుష్బూ, కోవై సరళలు తమ వంతుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హీరో సిద్ధార్థ్ ఒక టీమ్నే తయారు చేసుకుని వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ట్వీటర్ ద్వారా వలంటీర్లతో అనుసంధానమై పనిచేస్తున్నాడు. వీలైన వారు ఆహార పొట్లాలను, నీళ్ల బాటిళ్లను తెచ్చి బిగ్ ఎఫ్ఎమ్ ఆఫీసులో అందజేయాలని, అక్కడి వరకూ రాలేని వాళ్లు ట్వీటర్ ద్వారా సమాచారం అందిస్తే తమ వాళ్లే వాహనాల్లో వచ్చి వాటిని సేకరిస్తారని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ‘మా’ 5 లక్షల విరాళం: ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు చెన్నై తల్లి లాంటిది. అలాంటి చెన్నై నగర ప్రజల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికే మా బిడ్డల్లాంటి హీరోలు స్పందించి తమకు తోచిన సాయాన్ని ప్రక టించారు. అందుకే ‘మా’ అసోసి యేషన్ తరపున కూడా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాం’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. -
హైదరాబాద్కు ‘పవర్ రేంజర్స్’...
‘పవర్ రేంజర్స్’.. ఈ నెల హైదరాబాద్ నగరంలో రియల్ హీరోలు వీళ్లే.. కరాటే కిక్లు మెుదలుకొని తక్షణ ఆత్మరక్షణ విన్యాసాల వరకు.. అద్భుతమైన ప్రదర్శనతో అలరించేందుకు వస్తున్నారు ‘పవర్ రేంజర్స్’. బోలెడంత ఫన్... బోలెడంత అడ్వెంచర్తో ‘సిటీ’జనులను అలరించనున్నారు. ఇజ్జత్నగర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అక్టోబర్ 11, 12 తేదీల్లో ఏర్పాటవుతున్న ‘కామిక్ కాన్’ కార్యక్రవుంలో ‘పవర్ రేంజర్స్’ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.


