breaking news
RCM church
-
బెజవాడలో అర్థరాత్రి చర్చి కూల్చివేత
విజయవాడ: విజయవాడ వన్టౌన్లోని ప్రసిద్ధ ఆర్సీఎంకు చెందిన సెయింట్ పీటర్స్ కేథడ్రిల్ చర్చిను ఆదివారం అర్థరాత్రి సమయంలో అధికారులు కూల్చి వేశారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందంటూ భారీ యంత్రాలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చర్చి వద్దకు అధికారులు చేరుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న చర్చిని కూల్చవద్దంటూ క్రైస్తవులు అధికారులను వేడుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ నాయకులు ఎస్కే అసీఫ్, బొల్ల విజయ్కుమార్ తదితరులు వారికి మద్దతుగా నిలిచారు. చర్చిని కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులను వెనక్కి నెట్టి చర్చిని ధ్వంసం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను చూసి క్రైస్తవ సోదరులు ఆయనకు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
చర్చి తొలగింపు: విజయవాడలో ఉద్రిక్తత
-
చర్చి ఫాదర్ ను చితక బాదిన అగంతకులు
ఓ చర్చి ఫాదర్ను కిడ్నాప్ చేసి చితకబాది తరువాత విడుదల చేసిన సంఘటన ఖాజీపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. కడపలోని ఆర్సీఎం చర్చి బిషప్ ప్రసాద్ సోమవారం కరుణగిరి తిరునాళ్లకు హాజరయ్యారు. ఆయన తిరిగి వస్తుండగా ఖాజీపేట సమీపంలో చిల్లకం వద్ద సోమవారం అర్ధరాత్రి అగంతకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం ఆయన్ని బాగా చితకబాది తెల్లవారు జామును వదిలేశారు. తీవ్రంగా గాయపడిన బిషప్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.