-
పాడి రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా మరోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున.. కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. ఈ పెంపు రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు ఆదివారం నుంచి వర్తించనుంది. తద్వారా 65 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ తరఫున రాయలసీమలో కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇటీవలే సబర్కాంత్ యూనియన్ పాల సేకరణ ధరలను పెంచింది. తాజాగా కైరా యూనియన్ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా.. తాజా పెంపుతో కలిపి ఏడు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. కైరా యూనియన్ ప్రస్తుతం లీటర్కు గరిష్టంగా గేదె పాలకు రూ.84.26, ఆవు పాలకు రూ.42.27 చొప్పున చెల్లిస్తోంది. తాజా పెంపుతో లీటర్కు గరిష్టంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రాయసీమ జిల్లాల పరిధిలోని పాడి రైతులకు కైరా యూనియన్ చెల్లించనుంది. 30 నెలల్లో 8.50 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.96 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,549 గ్రామాలకు విస్తరించింది. 2116 ఆర్బీకేల పరిధిలోని 76వేల మంది నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది. 8.50 కోట్ల లీటర్ల పాలను సేకరించగా.. పాడి రైతులకు రూ.378.26 కోట్లు చెల్లించారు. లీటర్పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా.. అంతకు మించి ప్రస్తుతం లీటర్కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవు పాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.3,395.18 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ వాయుగుండం సోమవారం రాత్రికి శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 530, భారత్లోని కరైకల్కు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని, అనంతరం మలుపు తిరిగి క్రమంగా దక్షిణ నైరుతి వైపు పయనిస్తుందని, బుధవారం మధ్యాహ్నానికి శ్రీలంక వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
అమూల్ పాలసేకరణ ధర పెంపు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో పాలసేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవలే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాలసేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటరు గేదెపాలపై రూ.2.47, ఆవుపాలపై రూ.1.63 చొప్పున పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రానుంది. జగనన్న పాలవెల్లువ కింద అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగోసారి పాలసేకరణ ధర పెంచగా, రాయలసీమ జిల్లాల్లో నేటినుంచి అమలు చేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 3.5 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.30.50 నుంచి రూ.32.13కు పెంచింది. లీటరు గేదెపాలకు (ఫ్యాట్ 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతం) చెల్లిస్తున్న ధరను రూ.42.50 నుంచి రూ.44.97కు పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5కు పెంచారు. హ్యాండ్లింగ్ చార్జీల కింద లీటరు ఆవుపాలకు (ఫ్యాట్ 4 శాతం ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం) రూ.1.24, గేదెపాలకు (ఫ్యాట్ 8 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9.2 శాతం) రూ.1.64 చొప్పున సొసైటీలకు చెల్లించనున్నారు. అమూల్ దాణాపై 50 కిలోల బస్తాకు రూ.10 చొప్పున ఆయా సొసైటీ కార్యదర్శులకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఫలితంగా వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని 44 వేలమంది రైతులతోపాటు 3,768 మహిళా పాడిరైతు సంఘాలు లబ్ధిపొందనున్నాయి. అమూల్ రాకతో అదనపు లబ్ధి జగనన్న పాలవెల్లువ పథకాన్ని ఇటీవలే తిరుపతి జిల్లాకు విస్తరించారు. ప్రస్తుతం 17 జిల్లాల్లో 1,644 ఆర్బీకేల పరిధిలోని 2,856 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలవుతోంది. 2,47,958 మంది మహిళా పాడిరైతుల నుంచి రోజూ 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గడిచిన 24 నెలల్లో 5.12 కోట్ల లీటర్ల పాలు సేకరించారు. పాలుపోసిన పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రూ.219.57 కోట్లు చెల్లించారు. లీటరుపై రూ.4 అదనంగా లబ్ధిచేకూర్చేలా కృషిచేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ కంటే మిన్నగా లీటరు గేదెపాలపై రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 వరకు అదనంగా లబ్ధిచేకూర్చారు. ప్రైవేటు డెయిరీలు ఇస్తున్న రేట్లతో పోలిస్తే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న గ్రామాల్లోని రైతులు రూ.25 కోట్ల వరకు అదనంగా లబ్ధిపొందారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడి ధరలను పెంచాల్సి వచ్చింది. మూడేళ్లలో వరుసగా నాలుగుసార్లు పెంచడంతో అమూల్తో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం లీటరుపై రూ.15 వరకు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా జగనన్న పాలవెల్లువ పథకం కింద పాలుసేకరిస్తున్న గ్రామాల్లోనే కాదు.. ప్రైవేటు డెయిరీలకు పాలుపోస్తున్న రైతులకు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో లబ్ధికలిగింది. ఆయా డెయిరీల పరిధిలోని రైతులు మూడేళ్లలో రూ.2,354.22 కోట్ల మేర లబ్ధిపొందగలిగారు. ఇప్పటికే అమూల్ తరఫున పాలు సేకరిస్తున్న సబర్కాంత్, బనస్కాంత్ యూనియన్లు పాలసేకరణ ధర పెంచగా, తాజాగా గురువారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పాలుసేకరిస్తున్న కైరా యూనియన్ కూడా నాలుగోసారి పెంచింది. జగనన్న పాలవెల్లువ పథకాన్ని డిసెంబర్ కల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేదిశగా ముందుకెళుతున్నారు. -
సీమ జిల్లాల్లో సోలార్ పవర్ భేష్!
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలైన వైఎస్సార్, కర్నూలు, అనంతపురంలలో సౌర విద్యుత్ ఉత్పత్తి లాభసాటని ఉత్పత్తిదారులు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంధన ఎగుమతి విధానం’ (ఎక్స్పోర్ట్ పాలసీ) వారిని మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తోపాటు పలు దేశీయ, విదేశీ కంపెనీలు సీమ జిల్లాలపై దృష్టి పెట్టాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పై మూడు జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరిగే వీలుంది. ఇటీవల అధ్యయనాలను బట్టి ఆ జిల్లాల్లో సోలార్ రేడియేషన్ ఉదయం త్వరగా వస్తుందని, సాయంత్రం పొద్దుపోయే వరకూ ఉంటోందని తేలింది. ట్రాకింగ్ (సూర్యుడు ఎటువైపు తిరిగితే అటు ప్యానల్ తిరిగేలా) సిస్టమ్ అమర్చుకుంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం.. రాయలసీమ జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నవి కొన్నే. ఇప్పుడు ట్రాకింగ్తోపాటు తేలికగా రేడియేషన్ను తెచ్చే మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ వాట్స్ (దాదాపు 350 వాట్స్) ఉండే ప్యానల్స్ ఉన్నాయి. తక్కువ ప్రదేశంలోనే వీటిని ఎక్కువగా అమర్చుకోవచ్చు. తద్వారా గతంలో కంటే ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. సాధారణంగా ఒక మెగావాట్కు 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తే కేవలం 4 ఎకరాల భూమితో సరిపెట్టే వీలుందని అధికారులు అంటున్నారు. పైగా ప్రస్తుతం వస్తున్న 22 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను 25కు తీసుకెళ్లే వీలుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్ల కోసం గుర్తించిన భూముల వివరాలు.. ఎక్స్పోర్ట్ పాలసీతో అపార అవకాశాలు.. ► ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల కోసం దాదాపు లక్ష ఎకరాలను గుర్తించింది. ఇందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ► రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఆయా సంస్థలు మరే ఇతర రాష్ట్రాల్లోనైనా అమ్ముకోవచ్చు. దీన్నే ఎక్స్పోర్ట్ పాలసీ అంటారు. విద్యుత్ను చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) లైన్లు వాడుకునే ఏర్పాట్లు చేస్తోంది. ► రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు 25 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వనుంది. ప్రతి ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. -
సీమలో సైకిల్కు పంక్చరే..!
సాక్షి, నెట్వర్క్ : వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సరికొత్త రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక శాతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవటం.. అడుగడుగునా అవినీతి తాండవించడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. విలువలకు వలువలు ఊడదీసి అనైతిక రాజకీయాలు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలను సహించేది లేదని.. విలువలతో కూడిన రాజకీయాలకు, విశ్వసనీయతకు ఓటేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. క్లీన్ స్వీప్ దిశగా ‘వైఎస్సార్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డ వైఎస్సార్ కడప జిల్లా. సౌమ్యుడు, అందరికీ తలలో నాలుకగా ఉండే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎక్కడ ఎలాంటి అరాచకాలకు పాల్పడుతుందోనన్న భయం అంతటా నెలకొంది. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన ఈ జిల్లా 2014 ఎన్నికల్లో ఒక్కచోట తప్ప 9 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేసింది. చంద్రబాబు వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టిన తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, తాగునీటి సమస్యను పరిష్కరించడంలోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలోను ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పులివెందుల, బద్వేలు, రాజంపేట, కడప, రైల్వే కోడూరు, రాయచోటి, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుతోపాటు కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల్లో గెలుపు వైఎస్సార్ సీపీదేనని టీడీపీ శ్రేణులు సైతం బాహాటంగానే చెబుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందులలో ఈసారి గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆ నియోజకవర్గానికి చెందిన ఎం.జోసఫ్ నర్మగర్భంగా చెబుతున్నారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు సైతం ఆయన చెప్పినదానికి తగ్గట్టుగానే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ కంచుకోటల్లో ఒకటైన ఈ జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లూ విస్మరించి.. ఎన్నికలకు ముందు తానేదో చేసినట్టు చెప్పుకోవడాన్ని కడప నగరానికి చెందిన కె.రవికుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రశ్నించారు. వైఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నది ఆయన వాదన. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డి పార్టీ ఫిరాయించిన తీరును జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ తప్పుబట్టారు. ‘నీతిగా ఉండాల్సిన పని లేదా?’ అని ప్రశ్నించింది. ‘మారినోడు మారినట్టు ఉండకుండా ఇప్పుడు రాంసుబ్బారెడ్డితో కలిపి మరో తప్పు చేశాడు. వాళ్లి ద్దరూ కలిస్తే సరిపోతుందా. వారి వర్గాలు కలవాల్సిన పని లేదా?’ అని సాక్షాత్తు ఓ పోలీసు అధికారి ప్రశ్నించడం గమనార్హం. ఈసారి ఏమైనా కనీసం రెండు సీట్లలోనైనా వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలన్న చంద్రబాబు పాచిక పారే అవకాశమే కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ జిల్లా పెట్టని కోటగా నిలిచినందునే చంద్రబాబు వివక్ష చూపారని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో విస్తారమైన ఖనిజ సంపద ఉన్నా.. ఎలాంటి కొత్త పరిశ్రమలు రాలేదు. రాయచోటి, బద్వేలులో ఫ్లోరైడ్ సమస్య పీడిస్తోంది. ఇలాంటి అంశాలను ప్రభు త్వం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు నిల దీస్తున్నారు. అందుకే ఈ జిల్లాలో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతోంది. వైఎస్సార్ సీపీ మొత్తం పది సీట్లనూ కైవశం చేసుకునే దిశగా ఓటరు తీర్పు ఉంది. జిల్లాలో ఫ్యాన్ గుర్తు క్లీన్స్వీప్ చేయడం తథ్యమని రాయచోటికి చెందిన కె.నాగిరెడ్డి అనే టీ కొట్టు యజమాని చెప్పారు. ‘అనంత’ అభిమానం అనంతపురం జిల్లా శింగనమల, రాప్తాడు, పుట్టపర్తి, కదిరి, గుంతకల్లు, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి హోరున వీస్తోంది. రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, అనంతపురం, ధర్మవరం, ఉరవకొండ, హిందూపురం, తాడిపత్రి నియోజకవర్గాల టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి సినీ నటుడు బాలకృష్ణ వ్యవహార శైలితో స్థానికులు విసిగిపోయా రని, ఈసారి ఆయనకు కనువిప్పు కలిగిస్తారని ప్రైవేటు ఉద్యోగి ఆర్.వెంకటస్వామి వ్యాఖ్యానించారు. అనంతపురానికి చెందిన చిరు వ్యాపారి చిన్నం వెంకటసూరి మాట్లాడుతూ.. పేదోళ్లను పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇక ఉండకూడదని, రాజన్న రాజ్యం తిరిగి రావాలి’ అని వ్యాఖ్యానిం చారు. పెనుకొండకు చెందిన వెంకారెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. జిల్లాలో ముందెన్నడూ లేనివిధంగా కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్విన కాలువల్లోనే ప్రస్తుతం నీళ్లు వస్తున్నాయని, అందుకే ఈసారి రైతులంతా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. మంత్రిగా ఉన్న ఓ నాయకురాలి కీలక అనుచురులు ఎందరో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రజలకు రోత పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలు మంచి ఊపుతెచ్చాయి. నియోజకవర్గాల వారీ సమస్యలను ఆయన ప్రస్తావించి.. ఇవేవీ పరిష్కరించనప్పుడు వీళ్లకు మళ్లీ ఛాన్స్ ఎందుకివ్వాలంటూ వేస్తున్న ప్రశ్నలు ప్రజల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు విషయంలో కులాలు, మతాలు, పార్టీలనే భేదం ఉండదని జగన్ ఇస్తున్న హామీపై జనానికి నమ్మకం కలగటంతో ఈసారి మా ఓటు ఫ్యానుకే అంటున్నారు. పడిపోయిన టీడీపీ గ్రాఫ్ 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలలో 8 వైఎస్సార్ సీపీ, 6 టీడీపీ గెలుచుకున్నాయి. ఈసారి టీడీపీ గ్రాఫ్ మరింతగా దిగజారింది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ వైఎస్సార్ సీపీ హవా కనిపి స్తోంది. జిల్లా ప్రజల్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చంద్రబాబు ఎత్తులు ఫలించే పరిస్థితి లేదని గ్రామాల్లో వెల్లువెత్తుతున్న నిరసనను బట్టి అర్థమవుతోంది. 2014తో పోలిస్తే ఈసారి టీడీపీ బాగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నది. జిల్లాలో 1,800కు పైగా పైగా చెరువుల్ని పూడ్చివేయించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. చంద్రబాబు పాలనలో రైతులు ఇక్కట్లు పాలయ్యారని చంద్రగిరికి చెందిన జగన్నాథనాయుడు చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీని గెలిపిస్తే మేలు కలుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. సొంత జిల్లాలోనూ సీఎంకు ఎదురీతే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ సైకిల్కు ఎదురుగాలి వీస్తోంది. ఆయన మనస్తత్వం, వ్యక్తిత్వం తెలిసిన ప్రజలు ఆయన తీరును ఈసడించుకుంటున్నారు. ‘ఈసారి ఎన్నికల్లో ఆయన పాచికలేవీ పారవు’ అని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ తెలిపారు. కనిపించని ప్రవాహమేదో చాపకింద నీరులా వ్యాపించిందని, అదే వైఎస్సార్ సీపీకి అత్యధిక సీట్లు తెచ్చిపెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడు అందరి చూపు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉంది’ అని పూతలపట్టుకు చెందిన న్యాయ విద్యార్థి నరసింహులు చెప్పారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు పవన్ కళ్యాణ్, కేఏ పాల్ను రంగంలోకి దించినా అది సక్సెస్ కావటం లేదు. ఈసారి వైఎస్సార్ సీపీకి ఒక చాన్స్ ఇవ్వాలన్నదే ప్రజలందరి అభిప్రాయం’ అని మదనపల్లికి చెందిన కిరణ్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement