breaking news
Ravishankara Prasad
-
వాట్సాప్, ఫేస్బుక్లను నిషేధించండి
న్యూఢిల్లీ: వాట్సాప్, ఫేస్బుక్పై నిషేధం విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) కేంద్రాన్ని కోరింది. వాట్సాప్ యూజర్ల యొక్క వ్యక్తిగత డేటా, చెల్లింపు లావాదేవీలు, కాంటాక్ట్స్, లొకేషన్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడాన్ని సీఐఐటి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను దేశంలో అమలు చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు పంపిన లేఖలో సీఐఐటి పేర్కొంది.(వాట్సాప్తో బతుకు బహిరంగమేనా..?) ప్రస్తుతం దేశంలో 200 మిలియన్లకు పైగా ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారు. ఒక సంస్థ ప్రతి యూజర్ డేటాను యాక్సెస్ చేయటం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది అని సీఐఐటి పేర్కొంది. "ఉప్పును మాత్రమే అమ్మడానికి భారతదేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత దేశాన్ని ఆక్రమించిన రోజులను ఇది గుర్తుచేస్తుంది. అయితే, ప్రస్తుత సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం మొదలైన వాటి వెన్నెముకను నాశనం చేయడానికి ఇది వారికీ చాలా కీలకమైన డేటా. వాట్సాప్, ఫేస్బుక్లను వినియోగించినందుకు యూజర్లు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా ఇప్పుడు వినియోగదారుల డేటాను తస్కరించడం వారి యొక్క కుటిలత్వాన్ని బయటపెట్టింది. ఈ నిర్ణయంతో భారతదేశం యొక్క వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది"అని సీఐఐటి కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది. "వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు వ్యక్తి యొక్క గోప్యతను ఆక్రమించడం, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని సీఐఐటి కోరింది" అని సిఐఐటి జాతీయ అధ్యక్షుడు బిసి భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. -
‘బొగ్గు’ ఫైళ్ల మిస్సింగ్ వెనుక కుట్ర: బీజేపీ
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడానికి వెనుక కుట్ర, కుమ్మక్కు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. 2006-09 మధ్య బొగ్గు శాఖ నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ను రక్షించడానికే వాటిని మాయం చేశారని విమర్శించింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన ఉప నాయకుడు రవి శంకర్ ప్రసాద్ సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మాయమైన బొగ్గు శాఖ ఫైళ్ల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ఆ ఫైళ్లన్నీ 2006-09 మధ్య కాలానివి. కాంగ్రెస్ నాయకులు చేసిన అన్ని రాజకీయ సిఫార్సులతో ఉన్న కీలక ఫైళ్లన్నీ కనిపించడం లేదు. 157 ప్రైవేటు కంపెనీలకు చెందిన రికార్డులూ కనిపించడం లేదు’’ అని ప్రసాద్ అన్నారు. ఇందులో కుట్ర ఉందని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులు మొదట చేసే పని ఆధారాలను, సాక్ష్యాలనూ మాయం చేయడమేనని గుర్తుచేశారు. ఫైళ్ల మిస్సింగ్పై బొగ్గు శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ ఇంతవరకు పార్లమెంటులో ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆయన కచ్చితంగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.