-
ముగిసిన జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు
హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) అంత్యక్రియలు శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. నగరంలోని రామస్వామి నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానం వరకు ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఆయన కుమారుడు శ్రీనివాస్ మహాప్రస్థానంలోని విద్యుత్ దహన వాటికలో తండ్రి భౌతిక కాయాన్ని దహనం చేశారు. అంతకుముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ఆర్డీఓ చంద్రకళ, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ రామయ్య, జస్టిస్ రామస్వామి కూతుళ్లు జ్యోతి, డాక్టర్ జయ, బంధువులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
జస్టిస్ కె.రామస్వామి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా ముగ్గరు పిల్లలున్నారు. భార్య శ్యామలాదేవి గతంలోనే కన్నుమూశారు. కుమారుడు శ్రీనివాస్ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. మొదటి కుమార్తె జ్యోతి న్యూయార్క్లో ఎస్బీఐ ఏజీఎంగా... రెండో కుమార్తె జయ ఉస్మానియాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. న్యూయార్క్లో ఉన్న కుమార్తె గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. న్యాయవర్గాల్లో జస్టిస్ రామస్వామికి ఎంతో గొప్ప పేరుంది. న్యాయమూర్తుల సంతాపం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ రిటైర్డ్ జస్టిస్ రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదాద్చారు. న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రచౌహన్, జస్టిస్ రాజశేఖర్రెడ్డి, జస్టిస్ సంజయ్కుమార్, జస్టిస్ కోదండరాం, జస్టిస్ అమర్నాథ్గౌడ్, సుప్రీంకోర్టు జస్టిస్ సయ్యద్ షా మహ్మద్ ఖాద్రీలు, రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు కూడా జస్టిస్ రామస్వామి భౌతికాయం వద్ద నివాళులర్పించారు. భీమవరం నుంచి ఢిల్లీ వరకు 1932 జూలై 13న జన్మించిన జస్టిస్ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి నైపుణ్యం సాధించిన ఆయన 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు.1981–82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 1982 సెప్టెంబర్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్ నుంచి ఇంటర్నేషనల్ జూరిస్ట్స్ ఆర్గనైజేషన్ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989 అక్టోబర్ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు. -
జస్టిస్ కె.పున్నయ్య జీవితం ఆదర్శప్రాయం
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి స్వర్గీయ డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గొప్ప మానవతామూర్తి అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి కొనియాడారు. పున్నయ్య తన జీవితాన్ని విలువలతో కూడిన ప్రజాసేవకే అంకితం చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభ గురువారం నాంపల్లి పబ్లిక్గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. డాక్టర్ జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య సంస్మరణ సభా నిర్వహణ కమిటీ– హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జస్టిస్ కె.రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పున్నయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పున్నయ్య హైకోర్టు న్యాయమూర్తిగా అనేక ప్రగతిశీల తీర్పులను వెలువరించారని పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ.. శాసనసభ్యుడిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, మేధావిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ హోదాల్లో పనిచేసి పున్నయ్య తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారని కొనియాడారు. పున్నయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు మాట్లాడుతూ.. దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పున్నయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బి.దానం, డాక్టర్ బి.ప్రసాదరావు, డాక్టర్ ఎ.విద్యాసాగర్, టి.వి.దేవదత్, సుంకపాక దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
శశికళ పుష్ప పెళ్లి జరిగేనా?
టీ.నగర్: అన్నాడీఎంకే నుంచి తొలగించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప (41) తన భర్త లింగేశ్వర తిలకన్తో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఆయనతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శశికళ పుష్ప ఢిల్లీలోగల ప్రభుత్వ బంగ్లాలో నివశిస్తున్నారు. ఇలావుండగా శశికళ పుష్పకు, ఆమె వద్ద న్యాయ సలహాదారుగా ఉన్న రామస్వామికి ఈనెల 26న వివాహం జరగనున్నట్లు వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాఉండగా ఎంపీ శశికళ పుష్ప వివాహం చేసుకోనున్న రామస్వామి తనను మోసగించినట్లు యువతి సత్యప్రియ ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తర్వాత కన్నీటితో విలేకరులకు వివరాలు తెలిపింది. ఢిల్లీలో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న రామస్వామికి తనకు 2014లో వివాహం జరిగిందని, వరకట్నంగా 90 సవర్ల బంగారు నగలు, సారె ఇచ్చినట్లు తెలిపారు. ఢిల్లీకి తీసుకువెళ్లి కుటుంబం నడిపిన రామస్వామి అదనపు కట్నం కోరుతూ వేధించాడని, తనను కోట్నం తేవాలని పుట్టింటికి పంపివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం తనను మోసగించి రెండో వివాహానికి సిద్ధపడినట్లు తెలిపింది. ఈ వివాహాన్ని అడ్డుకుని తనను భర్తతో కలపాలని కోరింది. దీనిపై సత్యప్రియ ఇచ్చిన ఫిర్యాదును మదురై కలెక్టర్ వీరరాఘవరావు పోలీసు కమిషనర్కు పంపారు. ఆయన ఉత్తర్వుల మేరుకు పోలీసులు ఢిల్లీలో ఉన్న రామస్వామి వద్ద విచారణ జరిపేందుకు నిర్ణయించారు. దీంతో వచ్చే 26న శశికళ పుష్ప పెళ్లి జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రామసామిపై కేసు:ఎంపీ శశికళ పుష్ప వ్యవహారంలో రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు కోర్టు ఉత్తర్వులిచ్చింది. భర్త మోసం గురించి మదురై లీగల్ సెల్లో సత్యప్రియ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన లీగల్ సెల్ రామస్వామిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడింది. -
రచ్చకెక్కిన వివాదాస్పద ఎంపీ పెళ్లి
టీ.నగర్: వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే వివాదాస్పద ఎంపీ శశికళ పుష్ప రామస్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న వీరి వివాహం ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామస్వామి మొదటి భార్య తెరమీదకు వచ్చారు. మదురై మహాలింగ పట్టికి చెందిన తనకు, రామస్వామితో 2014లో వివాహం జరిగిందని మంగళవారం విలేకర్లకు వెల్లడించింది. అందుకు తగిన ఆధారాలను, తన బిడ్డతో పాటు ఉన్న చిత్రాన్ని చూపింది. దీని గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement