-
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ దివాలా ప్రక్రియ ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నిర్మాణ కంపెనీ బీజీ షిర్కే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. 2018 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఈ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో స్వగృహ కార్పొరేషన్ లేనందున ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి విచారణ జరిపారు. షిర్కే కంపెనీ తరఫున న్యాయవాది డి.వి.సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జవహర్నగర్లో రూ.786 కోట్లతో 6,216 ప్లాట్లతో 37 బ్లాకులు నిర్మించేందుకు తమ కంపెనీతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ 2009లో ఒప్పందం చేసుకుందని తెలిపారు. కొంతకాలం బిల్లులు చెల్లించిన కార్పొరేషన్ ఆ తర్వాత బిల్లులు చెల్లించడం మానేసిందన్నారు. అనంతరం 37 బ్లాకులను 17 బ్లాకులకు పరిమితం చేసిందని వివరించారు. 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని, 2018 మార్చి 31 నాటికి తమకు రూ.334.76 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని వివరించారు. స్వగృహ కార్పొరేషన్ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. షిర్కే కంపెనీ ఫిబ్రవరి 22న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చైర్మన్కు లేఖ రాసిందన్నారు. చెల్లింపులకు సంబంధించి వివిధ శాఖలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారుల సమావేశం జరగలేదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, ఇందుకు కొంతసమయం పడుతుందని తెలిపారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, అధికారులు సమావేశం నిర్వహించుకోవాలని, ఆ సమావేశం వివరాలను, అందులో తీసుకున్న నిర్ణయాలను తమ ముందుంచాలని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
వడ్డీ కాసుల భారం
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారుల కక్కుర్తితో నిలువునా మునిగిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్ల భారం పడుతోంది. ప్రతినెలా దీని అప్పులకే రూ.1.4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయినా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం నష్టాలను మరింత పెంచేస్తోంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. బండ్లగూడలో 2,600 అపార్ట్మెంట్లు, పోచారంలో 2,200 అపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అమ్ముడుపోగా మిగతావి అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి ఏపీలో దీన్ని పర్యవేక్షించిన కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇళ్ల నిర్మాణ వస్తువుల ధరలు పెరిగాయని, కూలీ రేట్లు పెరిగాయంటూ భారీగా నిధులు నొక్కేశారు. దాదాపు రూ.150 కోట్లు కొల్లగొట్టారు. నాటి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో అధికారుల ఆటలు సాగాయి. ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో ఒక్కసారిగా ఆ ఇళ్ల ధరలు విపరీతంగా పెంచారు. దీంతో జనం ఇళ్లను కొనేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఆ ఇళ్లు అలాగే మిగిలిపోయాయి. రూ.200 కోట్ల అప్పులు..: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులపై రూ.200 కోట్ల బ్యాంకు అప్పు ఉన్నట్లు తేలింది. దీనిపై 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అయితే ఆ ఇళ్ల ధర తగ్గించి మార్కెట్ ధర ప్రకారం అమ్మితే కొనుగోళ్లు పెరుగుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. వాటిని చవకగా ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంకా తక్కువ ధరకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అంత తక్కువకు అమ్మితే భారీ నష్టం వస్తుందని అధికారులు చెప్పినా ప్రభుత్వం చవక ధరలనే ఖరారు చేసింది. అయినా కానీ ఆ ధర మరింత తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఎటూ తేలక పెండింగులో పడిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా అప్పులపై వడ్డీ రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. తాజాగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రూ.4.24 కోట్ల వడ్డీ విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘స్వగృహ’ కొంప కూల్చుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి ఉన్నారనే కారణంతో వివిధ విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం తొలగిస్తోంది.. కానీ అప్పుల్లో మునిగి దివాలా తీసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మాత్రం ఇందుకు భిన్నం. రెండేళ్లుగా ఒక్క ఫ్లాట్ను కూడా అమ్మని ‘స్వగృహ’లో యథేచ్ఛగా సిబ్బంది నియామకం జరుగుతూనే ఉంది. జీతాలు చెల్లించే పరిస్థితి లేక ఖాళీ స్థలాలు అమ్ముకుంటున్న సంస్థను ఈ కొత్త కొలువులు పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఈ వ్యవహారానికి కారణం ప్రజాప్రతినిధులే. తమ అనుచరులకు వారు ‘స్వగృహ’లో ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు. ఈ కార్పొరేషన్లో ఇప్పటికే ఉన్న ఉద్యోగులకే పనీ లేదు. దానికితోడు కొత్తగా వస్తున్న వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక.. ఏదో ఓ పేరుతో పోస్టు ఇస్తున్నారు. వీరి జీతాల కోసం పెద్ద మొత్తంలో సొమ్ము వృథా అవుతోంది. కనీసం ఒక్కరోజు కూడా ఫీల్డ్కు వెళ్లే పనిలేకున్నా కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లుగా చెలామణి అవుతున్నారు. సిఫారసు చేసిన ప్రజాప్రతినిధి స్థాయిని బట్టి ఈ ‘కొత్త’ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ విభాగంలో పనిచేసి పదవీవిరమణ పొందిన కొందరికి నెలకు రూ.18 వేల నుంచి రూ.25 వేలు చెల్లిస్తున్నారు. ఫోన్ బిల్లు, పెట్రోలు భత్యం కూడా ఇవ్వడం గమనార్హం. అమ్మకాలు నిలిపేశాక మార్కెటింగ్లో కొలువులు: గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కొత్త ధరలు ఖరారు చేసే ఉద్దేశంతో ఇళ్ల అమ్మకాలు నిలిపివేయాలని నాటి ఎండీ ఆదేశించారు. ఇది జరిగి రెండున్నరేళ్లు గడిచింది. అయితే ఇళ్ల అమ్మకం వద్దనుకున్నప్పుడు మార్కెటింగ్ విభాగంలో సిబ్బంది నియామకం ఎందుకో అధికారులకే తెలియాలి. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన ఓ ఎంపీ, నల్లగొండకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీల సిఫారసుతో ముగ్గురికి ‘స్వగృహ’లో ఉద్యోగాలిచ్చారు. -
అమ్మకానికి ‘స్వగృహ’ భూములు
ప్రాజెక్టుకు తెరదించే దిశగా వడివడిగా అడుగులు స్థలాలమ్మి ఖజానాకు నిధులు సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం ఈలోగా అధికారుల ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 528 ఎకరాలు సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే విలాసవంతమైన ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కథ కంచికి చేరబోతోంది. ఈ కార్పొరేషన్కు మంగళం పాడే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దీనిపై తుది నిర్ణయం వెల్లడించనప్పటికీ కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలు మాత్రం దీనిని స్పష్టం చేస్తున్నాయి. స్వగృహ పనులు ఎక్కడా జరపవద్దని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న అధికారులు నిర్మాణాలు పోగా మిగిలిన ఖాళీ భూముల వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాజీవ్ స్వగృహపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అందులో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవలే రూ. లక్ష కోట్లకుపైగా మొత్తంతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయ సమీకరణలో భాగంగా ప్రభుత్వం భూములను అమ్మాలని నిర్ణయిం చింది. ఇదే కోవలో స్వగృహ కార్పొరేషన్కు ఖాళీగా ఉన్న భూములను విక్రయించాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కొన్ని ఖాళీ భూములను అమ్మిన అధికారులు... అలా వచ్చిన మొత్తాన్ని స్వగృహ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెచ్చించారు. కానీ, ఈసారి అమ్మగా వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాకే జమ చేయనున్నారు. హైదరాబాద్ శివారులో 90 ఎకరాలు... స్వగృహ ప్రాజెక్టుల నిర్మాణం కోసమని రాజధానికి నలువైపులా గతంలో భారీగా భూములను ఆ కార్పొరేషన్ సేకరించింది. ఇందులో నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్కేసర్ వైపు పోచారం, జవహర్నగర్, గాజులరామారంలలో నిర్మాణాలు జరిపింది. బహదూర్పల్లి, బాచుపల్లిల్లో పనులు ప్రారంభించలేదు. జవహర్నగర్లో నిర్మాణ స్థలం పోను ఇంకా దాదాపు 12 ఎకరాల స్థలం ఉంది. గాజుల రామారంలో 10 ఎకరాల స్థలంలో జీప్లస్ 14 పద్ధతిలో మూడు బ్లాకులు, పాక్షికంగా మరో రెండు బ్లాకులు నిర్మించారు. ఇది పోను మరో 10 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. బహదూర్పల్లిలో 40 ఎకరాలు, బాచుపల్లిలో 28 ఎకరాల మేర పూర్తి ఖాళీగా ఉంది. బాచుపల్లి భూములపై కోర్టు వివాదాలున్నాయి. వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో 438 ఎకరాలు... నిజామాబాద్లో 100 ఎకరాలు భూమి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇందులో 50 ఎకరాలను స్వయంగా స్వగృహ కార్పొరేషన్ పరిహారం చెల్లించి సేకరించడం విశేషం. నగర వెలుపల శాటిలైట్ టౌన్షిప్స్ అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా పటాన్చెరు సమీపంలోని లక్డారం గ్రామంలో స్వగృహ ఏకం గా 250 ఎకరాలను సమీకరించుకుంది. కానీ, ఇక్కడ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టకపోవడంతో అదంతా ఖాళీగా ఉంది. కరీంనగర్లో 60 ఎకరాల భూమి ఉండగా అందులో 30 ఎకరాల్లో 40 వ్యక్తిగత ఇళ్ల నమూనాలో పనులు మొదలుపెట్టారు. పునాది దశలోనే వాటిని నిలిపివేశారు. మిగతా 30 ఎకరాలు ఖాళీగా ఉంది. వరంగల్ హంటర్రోడ్డులో కూడా పనులు ప్రారంభించలేదు. ఖమ్మంలో 250 ఇళ్లను నిర్మించారు. కానీ, దరఖాస్తులు లేకపోవడంతో అవి దుమ్మకొట్టుకుపోతున్నాయి. వీటిని గంపగుత్తగా అమ్మాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటిని అమ్మితే దాదాపు రూ.80 కోట్లు సమకూరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎంతొచ్చినా అమ్మేద్దాం..!
‘స్వగృహ’ ఇళ్లు, భూముల ధరలు తగ్గించి అమ్మాలని సర్కారు నిర్ణయం బేరసారాలకూ వెసులుబాటు.. ‘వచ్చిందే చాలు’ తరహాలో అమ్మకం సాక్షి, హైదరాబాద్: పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఇళ్లు, భూములను వదిలించుకునేందుకు సిద్ధమైంది. ‘వచ్చిందే చాలు’ తరహాలో అపార్ట్మెంట్లు, సొంత భూములను ఎంతొచ్చినా అమ్మేయాలని నిర్ణయించింది. ఇంతకాలం నిర్ధారిత ధరలకే వాటిని అమ్మాలనే పద్ధతిలో ముందుకుసాగినా.. కొనేవారు లేకపోవడంతో కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు కొనేవారుంటే చాలు ఎంతొచ్చినా అమ్మేద్దాం.. అనే నిర్ణయానికి వచ్చి ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందుంచింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే అంది. కార్పొరేషన్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ధరలను ఆధారం చేసుకుని స్వగృహ ఇళ్లు, భూముల ధరలను నిర్ణయించే అధికారాన్ని కార్పొరేషన్ ఎండీకి కట్టబెట్టింది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అప్పటికప్పుడు వాటి ధరలను నిర్ధారించే అవకాశం ఇక కార్పొరేషన్ పరిధిలోకే రావటంతో, ప్రజలు బేరసారాలాడే వీలు చిక్కింది. దీంతో అమ్మకాలు కూడా వేగంగా సాగి ఆదాయం సమకూరుతుందనేది ప్రభుత్వ ఆలోచన. వాటితో కేటగిరీ ఒకటి పరిధిలోని పదకొండు ప్రాజెక్టుల్లో పనులు పూర్తి చేయటానికి వీలు చిక్కటమే కాకుండా, బ్యాంకు అప్పులు తీర్చేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు రూ. 246 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement