-
రెడ్ డైరీలో రాజస్తాన్ ప్రభుత్వ అక్రమాలు
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల రహస్యాలన్నీ రెడ్ డైరీలో ఉన్నాయని, దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. గంగాపూర్లో శనివారం జరిగిన ‘సహకార కిసాన్ సమ్మేళన్’ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే కొందరు నినాదాలు ప్రారంభించారు. వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘నినాదాలు చేసేందుకు కొందరిని పంపించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని గెహ్లాట్కు చెప్పాలనుకుంటున్నా. ఆయనకు సిగ్గుంటే, రెడ్ డైరీ వ్యవహారంపై రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి ఉండేవారు’అని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ‘రెడ్ డైరీ’దొరికింది. దాన్లో సీఎం గెహ్లాట్ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ ఉన్నట్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేంద్ర గూధా చేసిన ఆరోపణలను అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్లో కాంగ్రెస్ సర్కార్కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఐదేళ్లూ అధికారంలో మేమే ఉంటాం’
జైపూర్: రాజస్తాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందని రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వమే 5వ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతుందా అని బికనీర్లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోకుండానే కూలదోసేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. అప్పటి కంటే కాంగ్రెస్ మరింత పటిష్టమైనందున, బీజేపీ యత్నాలు సఫలం కాబోవన్నారు. ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్కు ఊహించని షాక్! -
ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుందా..!
లక్నో : రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో ఏప్రిల్ 26న దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనను అణచివేసేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. ఐదుగురు కీచకులు ఓ మహిళపై అకృత్యానికి పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధిత కుంటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ నిందితులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, ఘటన వివరాలను సుమోటాగా స్వీకరించి సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. (చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!) ఇక రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు జరుగుతుండగా.. మరోపక్క పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ఎన్నికల కమిషన్కు ఇవేవీ కనిపించవా అని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం ఈసీని ప్రశ్నించారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అసభ్యంగా మాట్లాడే పొలిటీషన్స్ వ్యాఖ్యల్ని సుమోటాగా స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అంబేద్కర్ పేరుతో పుట్టుకొచ్చిన కొన్ని సేవా సంస్థలు కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని బీఎస్పీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. -
12ఏళ్లుగా ఆందోళన: వారి డిమాండ్ ఎందుకు నెరవేరలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ రంగాల్లో తమకూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గత ఐదు రోజులుగా రాజస్థాన్లోని మలర్నా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ? గుజ్జర్లకు తప్పకుండా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజ్జర్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? 2006 నుంచి, అంటే పన్నెండేళ్లుగా గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా వారి డిమాండ్ ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదు? ఎస్టీల్లాగా తమకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2006లో కరౌలి ప్రాంతంలోని రైలు పట్టాలపై పదవీ విరమణ చేసిన సైనికుడు కిరోరి సింగ్ భైన్సాలా నాయకత్వాన గుజ్జర్లు ఆందోళన చేశారు. అప్పుడు ఎలాంటి ఫలితం రాలేదు. వారు ఆ మరుసటి సంవత్సరం కూడా రైలు పట్టాలపై ఆందోళన చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో 26 మంది గుజ్జర్లు చనిపోయారు. అప్పుడు గుజ్జర్ల డిమాండ్ను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ జస్రాజ్ చోప్రా ఆధ్వర్యాన ఓ కమిటీని వేసింది. ఇతర వెనకబడిన వర్గాల వారికి కేటాయించిన 21 శాతం రిజర్వేషన్ల కారణంగా గుజ్జర్లు లబ్ధి పొందుతున్నందున వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదని తేల్చింది. ఎస్టీల కింద రిజర్వేషన్లు కల్పించడం కుదరకపోతే ప్రత్యేక వెనకబడిన తరగతుల కేటగిరీ కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ భైన్సాలా మళ్లీ 2008 రైలు రోకో ఆందోళన చేపట్టారు. అప్పుడు కూడా అది హింసాత్మకంగా మారడంతో ఓ పోలీసు సహా 36 మంది మరణించారు. 2010లో ఇదే అశోక్ గెహ్లాట్, బైన్సాలాతో చర్చలు జరిపి గుజ్జర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతానికి చేరుకోవడంతో అంతకుమించి ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ గుజ్జర్లు 2015లో మరోసారి రైలు రోకో ఆందోళన చేపట్టారు. దాంతో అప్పటి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక వెనకబడిన తరగతుల చట్టాన్ని తీసుకొచ్చింది. రిజర్వేషన్లు అప్పటికే యాభై శాతం ఉన్నాయన్న కారణంగా ఆ చట్టాన్ని రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారిని మెప్పించేందుకు 2017లో వసుంధర రాజె ప్రభుత్వం ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచుతూ చట్టం తెచ్చింది. దాన్నీ హైకోర్టు కొట్టివేసింది. మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సచిన్ పైలట్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. గుజ్జర్లతోపాటు మరికొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 20 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలంటూ గెహ్లాట్ ప్రభుత్వానికి భైన్సాలా అల్టిమేటం జారీ చేశారు. 20 రోజుల గడువు కాలం పూర్తవడంతో ఐదు రోజుల క్రితం గుజ్జర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు మించిపోయినప్పటికీ దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పుడు తమ డిమాండ్ను మాత్రం ఎందుకు నెరవేర్చలేదని ‘గుజ్జార్ అరక్షన్ సంఘర్ష్ సమితి’ ప్రధాన కార్యదర్శి షైలేంద్ర సింగ్ ప్రశ్నిస్తున్నారు. గుజ్జర్ల విషయంతో తామేమి చేయలేమని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని గెహ్లాట్ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొందని బీజేపీ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా ప్రస్తుతం గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement