-
ఎదురులేని రైల్వేస్
సాక్షి, హైదరాబాద్ : బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో రైల్వేస్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆంధ్రతో మంగళవారం జరిగిన మ్యాచ్లో రైల్వేస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ హిమబిందు (107 బంతుల్లో 53; 7 ఫోర్లు), సుధారాణి (35 బంతుల్లో 28; 1ఫోర్, 2 సిక్స్లు), పుష్పలత (22) రాణించారు. రైల్వేస్ బౌలర్లలో సుకన్య (2/19), పూనమ్ యాదవ్ (2/30) ఆకట్టుకున్నారు. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ మరో 8 ఓవర్లు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెల్వేస్ తరఫున కెప్టెన్ మిథాలీ రాజ్ (22; 3 ఫోర్లు), తిరుష్ కామిని (39; 5 ఫోర్లు), పూనమ్ రౌత్ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో మల్లిక (2/44) ఆకట్టుకుంది. ఓటమితో ముగిసిన హైదరాబాద్ పోరు ఐదు జట్లున్న ఎలైట్ ‘ఎ’ గ్రూప్లోనే ఉన్న హైదరాబాద్ తమ నాలుగు మ్యాచ్లను పూర్తి చేసుకుంది. హిమాచల్ప్రదేశ్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ గౌహర్ సుల్తానా తొలుత బ్యాటింగ్ చేసే నిర్ణయం తీసుకుంది. స్నేహ (41 బంతుల్లో 35; 7 ఫోర్లు), మహేష్ కావ్య (33, 3 ఫోర్లు), స్రవంతి నాయుడు (31, 4 ఫోర్లు) రాణించడంతో.. హైదరాబాద్ భారీ స్కోరు చేస్తుందనిపించినా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో 202 పరుగులకే పరిమితమైంది. ప్రత్యర్థి బౌలర్లలో ఎన్ ఎస్ చౌహాన్ (2/22), హర్లీన్ డియోల్ (2/31) ఆకట్టుకున్నారు. అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 49.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హర్లీన్ డియోల్ (107 బంతుల్లో 79; 7 ఫోర్లు), నీనా చౌదరి (43), కెప్టెన్ సుష్మ (30) రాణించారు. గౌహర్ సుల్తానా (3/34) రాణించినా ఫలితం లేకపోయింది. ఒక విజయం, మూడు పరాజయాలతో హైదరాబాద్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. -
ఐఆర్టీసీ ప్రత్యేక రైల్లో మంటలు, తప్పిన ప్రమాదం
విజయవాడ: 2013 సంవత్సరానికి స్వస్తి చెప్పబోతున్న తరుణంలో రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలు చేదు జ్ఞాపకాలనే చెప్పుకోవాలి. వోల్వో బస్సు దుర్ఘటన, బొకారొ ఎక్స్ ప్రెస్, నాందెడ్ ఎక్స్ప్రెస్ రైలుప్రమాద ఘటనలు మరవకముందే మరో రైలు అగ్నిప్రమాదం ఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. ఐఆర్టీసీ ప్రత్యేక రైలులోని ప్యాంటీక్రార్లో ఒక్కసారిగా పొగలు వచ్చినట్టు తెలిసింది. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర అందోళనకు గురైయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో రైలుకు ప్రమాదం తప్పినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement