-
పుష్కరాలకు రైల్వే బాదుడు
టిక్కెట్ స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.20 అదనపు భారం సాక్షి, విజయవాడ/రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రయాణికులపై ‘పుష్కరమేళా సర్చార్జి’ పేరుతో ప్రత్యేక బాదుడుకు రైల్వే సిద్ధమైంది. జూలై 14 నుంచి 25 వరకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని 7 స్టేషన్లకు ప్రయాణించేవారిపై ఈ సర్చార్జి వసూలు చేయనున్నట్లు విజయవాడ డివిజన్ సీనియర్ పీఆర్వో మైఖేల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి , గోదావరి, కొవ్వూరు స్టేషన్లు, తెలంగాణలో మంచిర్యాల, బాసర, భద్రాచలం రోడ్, రామగుండం స్టేషన్లు గమ్యంగా ప్రయాణించేవారికి ఈ సర్చార్జి పడుతుంది. సెకండ్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్ప్రెస్) టికెట్కు రూ.5, స్లీపర్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్ప్రెస్)కు రూ.5, ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్ టికెట్కు రూ.10, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్కు రూ.20 చొప్పున చెల్లించాలి. రూ.15 చార్జీ దాటిన టికెట్పైనే ఈ సర్చార్జి వసూలు చేస్తారు. ఈ స్టేషన్లలో ఇప్పటికే టికెట్లు జారీ చేసి ఉంటే సర్చార్జిని రైలులో టీటీఈలు వసూలుచేస్తారు. గత పుష్కరాలకూ ఇలాగే జరిగితే ప్రజలనుంచి నిరసనవ్యక్తమైంది. దీంతో రద్దుచేశారు. -
రైల్వే చార్జీలు తగ్గే ప్రసక్తి లేదు!
రైల్వే చార్జీలు తగ్గించే ప్రసక్తే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. చార్జీల మోత భరించాల్సిందేనన్నారు. ఇప్పటికే రైలు టిక్కెట్ల ధరలు, ఇతరమైనవి చాలా తక్కువగా ఉన్నాయని, అంతకంటే తగ్గించలేమని చెప్పారు. ఫిబ్రవరి 26న పార్లమెంటులో రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానమిచ్చారు. పరిమిత వనరులతో పాటు అనేక సబ్సిడీలు భరిస్తున్న కారణంగా తమ శాఖకు ఆదాయం రాకపోగా మరింత భారం మోయాల్సి వస్తున్నదన్నారు. రైల్వే బడ్జెట్ను బ్యాలెన్స్ చేయాల్సినవసరం ఉందని చెప్పారు. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాల అభివద్ధి కోసం, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టుబడులను ఎఫ్డీఐలను 100 శాతం అంగీకరిస్తామన్నారు. రైల్వే రక్షణ దళానికి (ఆర్పీఎఫ్) మరిన్ని అధికారాలు కట్టబెట్టే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు. -
రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన లేదు: మనోజ్
లక్నో: రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన ఇప్పటికైతే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అన్ని విషయాలు బడ్జెట్ సమయంలోనే తెలుస్తాయన్నారు. శనివారమిక్కడ లక్నో-కత్గోడం ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే బడ్జెట్లో రైల్వే చార్జీలు పెంచుతారా అంటూ విలేకరులు సిన్హాను ప్రశ్నించగా.. ‘‘ఇప్పటికైతే ఆ ప్రతిపాదన లేదు. బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చించడం సబబు కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి’’ అని పేర్కొన్నారు. . రైల్వేను ప్రైవేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. -
పెట్రో బాంబు
ఆదిలాబాద్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం పెట్రో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజి ల్ ధరలు పెంచి వినియోగదారు ల నడ్డి విరిచింది. ఇటీవల రైల్వే చార్జీలు పెంచిన కేంద్రం పది రోజుల్లోనే పెట్రో చార్జీలు పెంచడంతో జనం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలు సో మవారం అర్ధరాత్రి నుంచే అ మలుల్లోకి వచ్చాయి. ఈ చార్జీల పెంపుతో నిత్యావసర సరుకుల, వాహన చార్జీల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన డీజిల్ ధరతో ఆర్టీసీపై పెనుభారం పడనుంది. వినియోగదారునిపై అదనపు భారం జిల్లాలో దాదాపు 100పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ రోజుకు 80 వేల లీటర్ల విక్రయం జరుగుతుంది. డీజిల్ రోజుకు 2.20 లక్షల లీటర్ల అమ్మకం జరుగుతుంది. పెరగక ముందు పెట్రోల్ ధర రూ.78.88 ఉండగా, రూ.1.69 పైసలు పెరగడంతో రూ.80.57కు చేరింది. కాగా రోజుకు వినియోగదారునిపై రూ. 1.52 లక్షల అదనపు భారం పడనుంది. అదేవిధంగా డీజిల్ జిల్లాలో 2.20 లక్షల విక్రయం జరుగుతుంది. పెరగ ముందు డీజిల్ ధర రూ.63.50 ఉండగా 50 పైసలు పెరగడంతో రూ.63.02 పైసలకు చేరింది. రోజుకు వాహనాదారుపై రూ.1.10 లక్షల భారం పడనుంది. పెట్రోల్పై నెలకు రూ.45.60 లక్షలు, డీజిల్పై రూ.33 లక్షల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతుంది. ఈ ప్రభావం సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలపై పడనుంది. ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. -
నేటినుంచి... రైల్వే ‘చార్జ్’
పెరిగిన రైల్వే చార్జీలు {పయాణికులపై రూ.230 కోట్ల భారం అదనపు చార్జీలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ సరకు రవాణా పైనా భారం రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలపై ప్రభావం ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇప్పటికే చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచిన చార్జీలు అమలులోకి రానున్నాయి. దీంతో విజయవాడ రైల్వే డివిజన్ ప్రయాణికులపై సాలీనా రూ.100 కోట్ల భారం పడనుంది. విజయవాడ : రైల్వే చార్జీలు అమలులోకి వచ్చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చార్జీలు అమలు చేసేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. రైల్వే చార్జీలను 14.2 శాతం పెంచుతూ ఇటీవల నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. చార్జీల పెంపుపై ప్రయాణికులు పెదవి విరుస్తుండగా, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. డివిజన్ పరిధిలో రూ.100 కోట్ల ఆదాయం... 2013-14 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్కు రూ.3,280 కోట్ల ఆదాయం వచ్చింది. డివిజన్లో 102 మిలియన్ల మంది ప్రయాణికులు రైల్వేశాఖ సేవలను వినియోగించుకున్నారు. వీరి ద్వారా రైల్వే శాఖకు రూ.661 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా ఆదాయం మరో రూ.100 కోట్లు పెరగనుంది. ప్రయాణికుల నుంచి సుమారుగా రూ.760 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనాలు వేస్తున్నారు. సరకు రవాణాపై రూ.6.5 శాతం మేర చార్జీలు పెంచారు. విజయవాడ డివిజన్ నుంచి ఎరువులు, బొగ్గు, ఆయిల్స్ రవాణా ఎక్కువగా జరుగుతుంది. డివిజన్ పరిధిలో సరకు రవాణా ద్వారా మరో రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కన ఒక్క విజయవాడ డివిజన్ పైనే సుమారు రూ.230 కోట్ల భారం పడనుంది. సరకు రవాణా చార్జీలు పెంచడం వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అదనపు చార్జీలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు... ముందుగా తీసుకున్న టికెట్లకు అదనపు రేటు చెల్లించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఈ సొమ్మును రైలులో టిక్కెట్ కలెక్టర్కు చెల్లించవచ్చు. ప్రయాణికుల సౌకర్యాం కోసం పెరిగిన చార్జీలను ముందుగానే చెల్లించేందుకు అధికారులు రైల్వే స్టేషన్లో కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ ఈస్ట్, వెస్ట్, మెయిన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ అదనపు చార్జీలను వసూలుచేసే కౌంటర్లు ఏర్పాటయ్యాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement