radioactive bomb
-
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించిన చైనా
బీజింగ్: రెండో ప్రపంచయుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతోపాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెల్సిందే. అయితే ఇప్పుడు అలా అణుబాంబులను ప్రయోగిస్తే రేడియోధార్మికత ముప్పుతోపాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారముంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో రేడియోధార్మికత వెలువర్చని, అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్–న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ను చైనా పరీక్షించిందని ‘సౌత్చైనా మార్నింగ్ పోస్ట్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ చైనా తన సైనికసత్తాను చాటడం గమనార్హం. ఈ వివరాలు ‘ప్రోజెక్టైల్స్, రాకెట్స్, మిస్సైల్స్, గైడెన్స్’ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి. శుద్ధ ఇంధన సాంకేతికతతో.. చైనా ప్రభుత్వ షిప్బిల్డింగ్ కార్పొరేషన్లోని ‘705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారుచేసింది. అణుబాంబు మాదిరికాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్ను ఈ బాంబులో వాడారు. రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నిషియం హైడ్రైడ్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. దాన్నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి భయంకర ట్రైనైట్రోటోలిన్(టీఎన్టీ) బాంబు పేలినదానికంటే 15 రెట్లు అధిక వినాశనం కల్గిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకన్లలోనే 1,000 డిగ్రీ సెల్సియస్కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రు దేశ ఆయుధాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకన్లలోనే ధ్వంసమవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోపాస్కల్ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. నిశ్శబ్దంగా తయారీ ఈ ఏడాది తొలినాళ్ల నుంచే మెగీ్నషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్సులో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకు కేవలం కొన్ని గ్రాముల మెగ్నిషియం హైడ్రైడ్ను మాత్రమే తయారుచేయగలం. అదికూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్లలోనే తయారుచేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడటం గమనార్హం. -
భారత్పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..!
జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కంటే శక్తిమంతమైన 'డర్టీ బాంబు' ఉగ్రవాదుల చేతిల్లోకి వెళితే.. దానిని ఉగ్రవాదులు మన దేశంపై ప్రయోగిస్తే.. ఇది సామాన్య ప్రజల్నే కాదు భద్రతా సంస్థలను తొలుస్తున్న ప్రశ్న. పోఖ్రాన్ అణుపరీక్షల వార్షిక దినోత్సవం సందర్భంగా ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లాబోరేటరీ చీఫ్ కేఎస్ ప్రదీప్ కుమార్ 'డర్టీ బాంబు' చుట్టూ ఉన్న అపోహాలను, అపనమ్మకాలను క్లియర్ చేశారు. అలాంటి బాంబులను ముందే పసిగట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఇందుకు దేశవ్యాప్తంగా తగినంత నెట్వర్క్ ఉందని ఆయన వివరించారు. భారత అణు అత్యవసర సన్నద్ధత విభాగంగా బార్క్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డర్టీ బాంబు గురించి ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని వివరాలివి. 'డర్టీ బాంబు' గురించి ఇటీవల చాలా భయాలు వినిపిస్తున్నాయి. అసలు డర్టీ బాంబు అంటే ఏమిటి? జవాబు: డర్టీ అంటే మురికి. మీరు వేసుకున్న దుస్తులు మురికిగా అయ్యావనుకోండి. మీరు అసౌకర్యానికి గురవుతారు. బట్టలు మురికి కావడం వల్ల మీరు చనిపోరు కానీ మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడే చాన్స్ ఉంది. కాబట్టి మీరు బట్టలు మార్చుకుంటారు. అదేవిధంగా 'డర్టీబాంబు' మీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశముంది. ఇతర బాంబుల్లాంటి పేలుడు ప్రభావాలు దీనిలోనూ ఉంటాయి. దీనికితోడు 'రేడియోయాక్టివ్ మెటిరియల్'ను ఇందులో నింపడం వల్ల ఇది పేలినప్పుడు రేడియో తరంగాలు వ్యాప్తి చెందుతాయి. దీంతో మీ శరీరం, మీరు వేసుకున్న దుస్తులూ విషపూరితమయ్యే అవకాశముంటుంది. దీనివల్ల నేరుగా గాయాలు కావడం, చనిపోవడం లాంటివి జరుగకపోయినా.. రేడియో తరంగాల ప్రభావమనేది ఆందోళన కలిగించే విషయమే. దీని ప్రభావానికి లోనుకాకపోయినా దీనిబారిన పడినట్టు ప్రజలు భీతిల్లే అవకాశముంది. ఇది సమాజంలో గందరగోళాన్ని రేపుతుంది. ఇక, డర్టీ బాంబును ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించలేదు. రేడియోయాక్టివ్ సిసీయం-137, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ వినియోగించి దీనిని తయారుచేయాలని కొందరు ప్రయత్నించినట్టు ప్రస్తావనలు వచ్చాయి. అంతేకానీ, భారత్లో దీనిని ఎప్పుడూ వినియోగించలేదు. ప్రస్తుతం ఈ రేడియోయాక్టివ్ సోర్సెస్కు ప్రపంచవ్యాప్తంగా రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. శాస్త్రవేత్తలతోపాటు, భద్రతా సంస్థలు వీటిని వినియోగించి ప్రయోగాలు చేస్తుండటంతో ఇవి చెడ్డవారి చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగమయ్యే అవకాశముందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. డర్టీబాంబులను పసిగట్టగలిగే సామర్థ్యం భారత్కు ఉందా? జవాబు: బార్క్ ఇందుకోసం ఎన్నో వ్యవస్థలను రూపొందించింది. ఎరియల్ గమ్మా స్పెక్టోమెట్రీ సిస్టమ్స్ లాంటి ఎన్నో వ్యవస్థలను మేం అభివృద్ధి చేశాం. అలాంటి తరహా రేడియో తరంగాలను అన్వేషించేందుకు ఇవి ఉపయోగపడతాయి. 'డర్టీబాంబు'ల్లాంటివాటిని బార్క్ పరికరాలు సులువుగా పసిగడతాయి. ఇలాంటి వాటిని భవనాల్లో దాచిపెట్టినా.. రక్షణగా ఏవైనా అడ్డుపెట్టినా.. వాటిని దాటి మా పరికరాలు గుర్తిస్తాయి.


