breaking news
Rabia Sidhu
-
మా నాన్న గెలిచే వరకు నో మ్యారేజ్.. రబియా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చంఢీగడ్: పంజాబ్ కాంగ్రెస్లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చదవండి: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం! ఇదిలా ఉండగా శుక్రవారం అమత్ సర్(ఈస్ట్)లో ప్రచారంలో పాల్గొన్న సిద్దూ కూతురు రబియా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అభ్యర్థి చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చన్నీ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.133 కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. తన తండ్రి సిద్దూ 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. పంజాబ్ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
గ్లామరస్ రబియా దూకుడు, పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
చండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్దూ మరోసారి సంచలనంగా మారింది. ఇటీవల ఒక మీటింగ్లో తళుక్కున మెరిసిన రబియా తాజాగా చేసిన హడావిడి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పూర్తి పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా సందడి చేస్తూ తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి బజ్ క్రియేట్ చేశారు. పీపీసీసీ పనుల్లో సిద్ధూ బిజీబిజీగా ఉంటే ఆయన కుమార్తె రబియా రాజకీయంగా దూసుకుపోతారనే ఊహాగానాల మధ్య పూర్తి రంగంలోకి దిగిపోయింది. సిద్దూ అసెంబ్లీ నియోజకవర్గం అమృత్సర్ ఈస్ట్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, ఆమె సుడిగాలి పర్యటన స్థానికులను ఆకట్టుకుంది. అంతేకాదు ఆయా పనుల కొనసాగింపుపై కూడా హామీలను గుప్పించడం విశేషంగా నిలిచింది. వార్తలను గతంలో రుబియా ఖండించినప్పటికీ..ఇటీవల కేవలం పది రోజుల వ్యవధిలోనే వివిధ కార్యక్రమాలతో చూపిస్తున్న రబియా దూకుడు పోలిటిక్స్లోకి ఎంట్రీ ఖాయం అనే ఊహాగానాల్ని తెరపైకితెచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనుందా అనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి. అయితే తాను రాజకీయాల్లో చేరబోతున్నానన్న వార్తలను రబియా ఖండించింది. పంజాబ్ సంక్షోభంలో కూరుకుపోయిన తన తండ్రి తరపున తాను పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన రోడ్లు, పార్కులు, అభివృద్ధి పనులను ముఖ్యంగా రూ .33 లక్షల విలువైన పార్కుల సుందరీకరణ, పనులను చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు సిద్ధూకి, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకి మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ సిద్దూ 13 పాయింట్ల ఎజెండాతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలంటూ అక్టోబర్ 15న రాసిన నాలుగు పేజల లేఖ ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి : Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత కాగా 2012 లో శిరోమణి అకాలీదళ్-బీజేపీ పార్టీ టిక్కెట్పై పోటీ చేసి సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ అసెంబ్లీ సీటును గెలుచుకోగా, 2009లో కాంగ్రెస్ టికెట్పై సిద్ధూ అదే స్థానాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రబియా సిద్దూ ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు.