breaking news
q
-
సంజీవ్ గుప్తాకు గొల్లపూడి పురస్కారం
హిందీ చిత్రం ‘క్యూ’ దర్శకుడు సంజీవ్ గుప్తాను 2014 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం వరించింది. ఆగస్టు 12న చెన్నైలో ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని జ్యూరీ సభ్యులు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ తొలి చిత్రదర్శకునికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. -
ఆ నిజాన్ని ఎలా చూపించారో?
‘‘ఈ కథలో ఓ నిజం ఉంది. ఆ నిజాన్ని దర్శకుడు ఎలా చూపించి ఉంటారో చూడాలని ఆసక్తిగా ఉంది. పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకని, తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా జంటగా ఎస్.ఎస్. నందా వి. సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో లండన్ గణేశ్ నిర్మించిన చిత్రం ‘క్యూ’. చిత్రదర్శకుడు స్వరపరచిన పాటలను తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో యం.యం. శ్రీలేఖ, బంటి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గత ఇరవయ్యేళ్లల్లో తెలుగులో ఏడు చిత్రాలు చేశాను. ఆ తర్వాత కన్నడ చిత్రాలతో బిజీ కావడంతో తెలుగుకి దూరమయ్యాను. ఇప్పుడీ ‘క్యూ’తో తెలుగులోకి రీ-ఎంటర్ అవుతున్నా. తెలుగు, తమిళ భాషల్లో 25 రోజుల్లో ఈ హారర్ ఎంటర్టైనర్ని పూర్తి చేశాం. ఇందులో ధన్రాజ్ది చాలా ముఖ్య పాత్ర’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. ‘పడమటి సంధ్యా రాగం’ అని మరో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
ఉల్లి రైతుల కన్నీరు
రైతులను దగా చేస్తున్న కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మాయాజాలంతో ధర అంతంత మాత్రమే నష్టాలను మూటగట్టుకుంటున్న ఉల్లి రైతులు కర్నూలు(అగ్రికల్చర్): గిట్టుబాటు ధర రాక ఉల్లి రైతులు క న్నీరు పెట్టుకుంటున్నారు. ఖరీఫ్లో జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మామూలుగా అయితే 60 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. అనావృష్టి వల్ల ప్రస్తుతం 25 నుంచి క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీనికితోడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలం వల్ల ధర పెరగకపోగా మరింత తగ్గుతోంది. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అనామత్తో నష్టాలు.. కర్నూలు మార్కెట్లో ఉల్లిని వేలంపాట ద్వారా కొనాల్సి ఉంది. అరుుతే వ్యాపారులు అనామత్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వేలంపాట ద్వారా ధర రూ.1000 ఆపైన లభిస్తే అనామత్పైన రూ.800 నుంచి రూ.900 ధరకే కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. రైతులు కూడా రోజుల తరబడి మార్కెట్లో ఉండలేక ఏదో ఒక ధరకు అమ్ముకుని నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానిక రైతులు తాడేపల్లి గూడేనికి తరులుతున్నారు. ధరలో వ్యత్యాసం.. కర్నూలు మార్కెట్కు రోజుకు 50 లారీల ఉల్లి వస్తుంటే, తాడేపల్లి గూడెం మార్కెట్కు 60 లారీల ఉల్లి జిల్లా నుంచి వెళుతోంది. అక్కడ క్వింటాఉల్లికి రూ.1800 నుంచి రూ.2000 వరకు అత్యధిక ధర లభిస్తోంది. మధ్యస్తంగా రూ.1400 నుంచి రూ.1500 వరకు లభిస్తోంది. అదేకర్నూలులో అత్యధిక ధర రూ.1125 ఉండగా, మధ్యస్తంగా రూ.600 నుంచి రూ.800 వరకు పోతోంది. అదనపు చార్జీలతో మోసం రైతు 50 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్కు వేస్తే క్లీనింగ్ పేరుతో రెండు క్వింటాళ్ల ఉల్లిని తీసేస్తున్నారు. పైగా కమీషన్ ఏజెంట్లు క్లీనింగ్ చార్జీలను కూడా రైతులపై వేస్తుండడంతో మరింత నష్టపోతున్నారు. తాడేపల్లి గూడెంలో ఉల్లికి క్లీనింగ్ లేదు. లారీల్లో ఉల్లిని తీసుకుపోతే అక్కడక్కడ నాలుగు ప్యాకెట్లు తీసి కింద పోసి వేలంపాట ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇక్కడ మాత్రం మొత్తం క్లీన్ చేసిన తర్వాతే కొంటారు. ఇలా చేయడం వల్ల కోత, కుప్ప, క్లీనింగ్ చార్జీలు రైతులపై అదనంగా పడుతున్నాయి. అదేవిధంగా లోడింగ్, సంచులకు నింపి కాటాపై పెట్టేందుకు చార్జీలను వ్యాపారి భరించాలి. కమీషన్ ఏజెంట్లు మాత్రం ఇవి కూడా రైతుల నుంచి వసూలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతులు తాము తెచ్చిన సరుకును అమ్ముకున్న తర్వాత కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కమిటీ జారీ చేసిన తక్ పట్టీలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో రైతు తెచ్చిన సరుకు, ఎన్ని క్వింటాళ్లు అమ్మారు, ధర ఎంత, కూలీ, హమాలీ చార్జీలన్నీ నమోదు చేసి ఇవ్వాలి. కానీ 50 శాతం కమీషన్ ఏజెంట్లు తక్ పట్టీలు ఇవ్వకుండా కాగితాలపై వివరాలు రాసి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే కమీషన్ ఏజెంట్లు జీరో వ్యాపారానికి పాల్పడుతూ ఇటు ప్రభుత్వానికి, అటు రైతులను మోసం చేస్తున్నారు. ఇటు వ్యాపారుల మాయాజాలం, అటు కమీషన్ ఏజెంట్ల దగా వల్ల ఉల్లి రైతులు నష్టాలపాలవుతున్నాడు.