purushottam
-
అత్యవసర మార్గం లేకే సహాయక చర్యల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సొరంగాల నిర్మాణంలో అత్యవసర మార్గాలను నిర్మిస్తారని.. కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్కు అది లేకపోవడమే ఇటీవల జరిగిన ప్రమాదంలో 8 మంది ఆచూకీ దొరకకపోవడానికి కారణమని జాతీయ స్థాయిలో టన్నెల్ ప్రమాదాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గురువారం ఎస్ఎల్బీసీ క్యాంపు సైట్ వద్దకు చేరుకున్న ఆర్మీ వెస్టర్న్ కమాండెంట్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) మాజీ అదనపు డీజీ కె.పి. పురుషోత్తం ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.భూగర్భంలో 43 కి.మీ. పొడవున నీటిని సరఫరా చేసే సొరంగం దేశంలోకెల్లా ఎస్ఎల్బీసీ ఒక్కటేనన్నారు. నేషనల్ హైవేలు, రైల్వేలైన్లు, సముద్రమార్గాలను భూగర్భంలో నిర్మించినప్పటికీ నీటి సరఫరా కోసం అంతదూరంపాటు చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదని వారు అభిప్రాయపడ్డారు.టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) టెక్నాలజీతో సాగే నిర్మాణం మంచిదే అయినప్పటికీ.. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం నొక్కి చెప్పిందన్నారు. ప్రమాదంలో కార్మికులు, ఇంజనీర్లపై మట్టిపెళ్లల శిథిలాలు పడి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు గల్లంతైన చోట జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఒకట్రెండు రోజుల్లో ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తుని ఘటనపై అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి క్లారిటీ
-
కథ.. స్క్రీన్ప్లే.. దర్శకత్వం: పురుషోత్తం
ఇచ్ఛాపురం రూరల్: ఒక సాదాసీదా ఉద్దానం కుర్రా డు. సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు. ఎలాగైనా తనో సినిమా తీయాలని కలలు గన్నాడు. స్టూడియో ల చుట్టూ తిరిగాడు. అనుభవం వచ్చింది గానీ అవకాశం రాలేదు. తనే సినిమా నిర్మించాలని కువైట్ వెళ్లి డబ్బులు కూడబెట్టాడు. సొంతూరిలో జరుగుతున్న కథను తన చిత్రానికి ఇతివృత్తంగా తీసుకున్నాడు. తెలిసిన వాళ్లను నటులుగా తీసుకుని గంటన్నర సినిమాను చిత్రీకరించేశాడు. తన ప్రతిభను చూడండంటూ థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించాడు. ఇదేమీ రాబోయే కొత్త సినిమా కథ కాదు. పరిమిత వనరులతో సినిమా తీసిన కుర్రాడి స్టోరీ. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పురుషోత్తం అన్న టైటిట్ కార్డు వెనుక దాగి ఉన్న విషయాలను తెలుసుకుందాం. ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రామా నికి చెందిన పురుషోత్తం మజ్జి బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాలపై చిన్నప్పటి నుంచే విపరీతమైన ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే హైదరాబాద్ వెళ్లాడు. స్టూడియోల చుట్టూ తిరిగాడు. కానీ సినిమా అవకాశం అంత సులభంగా రాదని తొందరగానే గ్రహించాడు. సొంతంగా సినిమా తీయాలని నిశ్చయించు కుని స్నేహితులకు చెబితే అంతా నవి్వన వారే గానీ ప్రోత్సహించలేదు. అయినా పట్టు విడవలేదు. సిని మా తీయడానికి డబ్బులు సంపాదించాలని కువైట్ వెళ్లాడు. అక్కడ డబ్బులు కూడబెట్టాడు. సినిమా తీయాలన్న తపనే గానీ అప్పటి వరకు కథ ఏమీ అనుకోలేదు. ఆ క్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సామాజిక సేవలు అందిస్తున్న స్పెషల్ గయ్స్ ఫౌండేషన్ గురించి అతనికి తెలిసి.. ఆ కథనే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఎస్జీఎఫ్ కార్యకర్తను సంప్రదించి అన్ని విషయాలను సేకరించిన రెండేళ్ల పాటు కష్టపడి 180 పేజీల కథను సిద్ధం చేశాడు. 2020లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో స్వగ్రామానికి చేరుకున్నాడు. రూ.రెండు లక్షలతో సినిమా.. కథ సిద్ధమయ్యాక.. సాంకేతిక వర్గం కోసం అన్వేష ణ ప్రారంభించాడు. ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న స్నేహితుడు అభిరాం బిసాయిని కెమెరామెన్గా పెట్టుకున్నాడు. 2020 సెపె్టంబర్ నెలలో తను తీయబోయే సినిమాకు నటులు కావాలంటూ సోషల్ మీ డియాలో చేసిన ప్రకటనకు స్పందన నామమాత్రంగానే వచ్చింది. అయినా వచ్చిన వారినే నటులుగా పెట్టుకున్నాడు. ఉద్దానం పల్లెల్లోనే షూటింగ్ చేశా డు. రెండేళ్ల పాటు ఆటుపోట్లు ఎదుర్కొని సినిమా పూర్తి చేసి ఈ నెల 12న విడుదల చేశాడు. ఓ నలు గురు స్నేహితులు ఓ సేవా సంస్థగా ఏర్పడి అత్యవసర సమయాల్లో రక్తదానం, అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఆర్థిక సాయం, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆదుకోవడం, నిరుపేద విద్యార్థులను చదివించడం వంటి సామాజిక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రధానంగా ప్రతినాయకుడు చివరకు సామాజిక కార్యకర్తగా మారేలా చిత్రాన్ని రూపొందించాడు. వారం పాటు ఉచిత ప్రదర్శన సామాజిక అంశాలపై తీసిన ఈ చిత్రాన్ని వారం రోజుల పాటు కవిటి మహాలక్ష్మీ సినిమా హాల్ల్లో ప్రదర్శించారు. సుమారు రూ.రెండు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని చూసిన ప్రతి పది మంది వ్యక్తుల్లో ఒక్కరు తోటి వారికి సాయపడాలన్న ఆలోచన వస్తుందనే ఆలోచనతో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పురుషోత్తం తెలిపాడు. సగంలో ఆపేద్దాం అనుకున్నాం.. సినిమా రంగంలో ఏ మా త్రం అనుభవం లేకపోయినా, ధైర్యంతో ముందడుగు వేశాను. ఏడాది పాటు సినిమా షూటింగ్ సమయంలో కొంత మంది నటులు మధ్యలో వైదొలగడం, ఆర్థికంగా ఇబ్బంది పడటంతో సినిమాను మధ్యలో నిలిపివేద్దాం అనుకున్నాను. డబ్బులు కోసం ఏ ఒక్కరి దగ్గర చేయి చాచలేదు. కష్టమో, నష్టమో సినిమా పూర్తి చేసి నా టాలెంట్ను నిరూపించుకోవాలని అనుకు న్నాను. ఎవరైనా పెట్టుబడి పెడితే ఇదే చిత్రం పార్ట్–2 తీయాలనుకుంటున్నాను. ఈ చిత్రా న్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – పురుషోత్తం మజ్జి, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం -
నగరిలో టీడీపీ నేత నిర్వాకం బట్టబయలు
సాక్షి, చిత్తూరు : నగరిలో ఓ టీడీపీ నేత నిర్వాకం బట్టబయలైంది. టీడీపీ నేత పురుషోత్తం నాయుడు లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచాడు. నగరి సమీపంలోని ఎస్వీపురంలో గత మూడు రోజులుగా భౌతికదూరం పాటించకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. పురుషోత్తం నాయుడుతో పాటు పదుల సంఖ్యలో జనాలు గుమిగూడి విందు భోజనాలతో జల్సాలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రెడ్ జోన్లో నగరి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా భౌతిక దూరం పాటించకుండా విందు భోజనాలు చేయడం గమనార్హం. (కరోనా: సింగరేణి రూ. 40 కోట్ల భారీ విరాళం ) పురుషోత్తం నాయుడు తాను బిర్యానీ తింటూ ఇతరులకు పెడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా టీడీపీ తరపున ఎంపీటీసీగా పురుషోత్తం నాయుడు నామినేషన్ దాఖలు చేశాడు. (ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?) -
వికేంద్రీకరణపై విద్యార్థులతో అవగాహన సదస్సు
-
స్నేహితుడి ఇంట్లో నిర్వాకం.. సినీ డైరెక్టర్ అరెస్ట్
బెంగళూరు(బనశంకరి): స్నేహితుడి ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ డైరెక్టర్ అడిషన్స్ పేరుతో అమ్మాయిల అడ్డాగా మార్చేశాడు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కత్రిగుప్పె కట్టింగ్షాప్ సినిమా డైరెక్టర్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సినీ డైరెక్టర్ ప్రఖ్యాత్ తన స్నేహితుడైన పురుషోత్తానికి చెందిన ఇంటిని కొంతకాలం కిందట అద్దెకు తీసుకున్నాడు. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను ఇంటికి తీసుకువస్తూ తన ఇష్టరీతిన వ్యవహరించి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాడు. అమ్మాయిను తీసుకొచ్చి అక్కడ గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడని భావించిన అతడి స్నేహితుడు పురుషోత్తం... ఇంటిని ఖాళీచేయాలని పద్ధతి మార్చుకోవాలని ప్రఖ్యాత్కు సూచించాడు. దీంతో డైరెక్టర్ కొంతమంది రౌడీలతో పురుషోత్తంను బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రఖ్యాత్ను అరెస్ట్ చేశారు. -
నగరవాసుల సమస్యలకు సర్కార్దే బాధ్యత
-
ఆప్’ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా
,హైదరాబాద్ : ఆమ్ ఆద్మీపార్టీ అసెంబ్లీ నియోజక వ ర్గాల అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఇక్కడ విడుదల చేసింది. తెలంగాణలో 31 మంది, సీమాంధ్రలో 29 మంది అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జీ పురుషోత్తం తెలిపారు. తెలంగాణ అభ్యర్థులు: రుక్మిణి భానోతు-నాంపల్లి, కరణం అంబికా కృష్ణ-సనత్నగర్, దున్యాలాల్ త్రిపాఠి నీరాలా-జూబ్లిహిల్స్,అనితారావు కిలారు-సికింద్రాబాద్, ఎం.జైపాల్రెడ్డి-కుత్బుల్లాపూర్, ఎం.జయరాజ్-కంటోన్మెంట్, అరిగింటి శారద-కూకట్పల్లి, చంద్రసుప్రియా-మల్కజ్గిరి, మట్టా సురేష్కుమార్-శేర్లింగంపల్లి, వీసీహెచ్ ప్రమీల-రాజేంద్రనగర్, వెంకటేష్గౌడ్ -మహేశ్వరం, క్రిష్ణా వై- పరిగి, పి.మధుసూదన్-చేవెళ్ల, శ్రీధర్-మలక్పేట్, కిరణ్కుమార్-పరకాల, మురళీకృష్ణ- స్టేషన్ఘన్పూర్, సుదర్శన్భరత్-పాలకుర్తి, సయ్యద్ అహ్మద్ ఫరూఖ్-కరీంనగర్, ఎం.విజయ్ ఆనంద్-రామగుండం , మహ్మద్ అసద్-ఖమ్మం, కాసాని శ్రీనివాస్-పాలేరు, మోడే హనుమా-ఇల్లెందు, అర్జుల శశికుమార్రెడ్డి-జనగాం, బోడ చంద్రప్రకాష్-ఇబ్రహీంపట్నం, రాంచంద్రారెడ్డి-ఆలేరు, డాక్టర్ షేక్ అన్సారీ- నల్లగొండ, డేగల జనార్థన్-సూర్యా పేట్, లావూరి క్రాంతికుమార్-నాగార్జునసాగర్, రామకృష్ణ-కోదాడ, కె.నాగేశ్వరరావు-దేవరకొండ, చింతల వెంకటేశ్వ ర్లు- అచ్చంపేట్. -
ఇంటర్ స్కూల్ హాకీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వి.పురుషోత్తం స్మారక ఇంటర్ స్కూల్ హాకీ టోర్నమెంట్ మంగళవారం జింఖానా మైదానంలో ప్రారంభమైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) సహకారంతో హాకీ హైదరాబాద్ (హెచ్హెచ్) ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతుంది. హెచ్హెచ్ ఏర్పాటయ్యాక అధికారికంగా నిర్వహిస్తున్న తొలి టోర్నీ ఇదే కావడం విశేషం. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా టోర్నీని ప్రారంభించారు. ట్రిపుల్ ఒలింపియన్, హెచ్హెచ్ కార్యదర్శి ఎన్.ముకేశ్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. బాలుర విభాగంలో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో 12 జట్లు పోటీ పడుతుండగా, బాలికల విభాగంలో లీగ్ ప్రాతిపదికగా 5 జట్లు తలపడుతున్నాయి. ఇందులో రాణించిన ఆటగాళ్లను జాతీయ స్థాయిలో జరిగే కె.డి. సింగ్బాబు అండర్-14 టోర్నీకి ఎంపిక చేస్తారు.