-
కార్పొరేషన్పై విద్యుత్ భారం
- ఏటా రూ.150 కోట్లకు పైగా చెల్లింపు - నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా రూ. 100 కోట్లు పింప్రి: విద్యుత్ ఆదా చేయడంలో పుణే కార్పొరేషన్ విఫలమవుతోంది. బిల్లుల రూపంలో ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా చెల్లిస్తోంది. సౌర విద్యుత్ కిట్లను అమర్చుకుంటే 5 శాతం సబ్సిడీ ఇస్తామన్న కార్పొరేషన్ సొంతంగా ఆ ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించడం లేదు. కార్పొరేషన్ ప్రజలకు నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా 95 నుంచి 100 కోట్లు, వీధి దీపాల ఖర్చు, కార్పొరేషన్ కార్యాలయాలకు 50 కోట్లు కార్పొరేషన్ చెల్లిస్తోంది. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే కార్పొరేషన్కు విద్యుత్ను మహావితరన్ అందింస్తోంది. అయినా బిల్లు మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం, పాలకుల ఉదాసీనతే కారణం దేశంలో ఎనమిదో పెద్ద నగరంగా పేరుగాంచిన పుణే మిగిలిన ఏడు నగరాల మాదిరి సౌర విద్యుత్పై దృష్టి సారించలేకపోతోంది. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఉదాసీనతే ఇందుకు కారణమని తెలుస్తోంది. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయాలలో అధికారులు లేకున్నప్పటికీ విద్యుత్ దీపాలు, ఏసీలు, ఫ్యాన్లు రోజంతా దుబారాగా తిరుగుతున్నాయి. వీధి దీపాలు, వీధుల్లో నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా నగరంలోని మూడు లక్షలకు పైగా ఉన్న విద్యుత్ దీపాలను సోలార్గా మార్చి, దశలవారిగా అన్ని అవసరాలకు సోలార్ను వినియోగించుకుంటే కార్పొరేషన్కు విద్యుత్ భారం తగ్గుతుంది. -
యువత కోసం ‘హలో..మై ఫ్రండ్..’!
పింప్రి, న్యూస్లైన్: యువతకు మార్గనిర్దేశనం చేయడానికి దేశంలో మొట్టమొదటిసారిగా పుణే కార్పొరేషన్ ‘హలో! మై ఫ్రెండ్’ హెల్ప్ లైన్ను ప్రారంభించింది. విద్య, సాంకేతిక, ఉద్యోగ తదితర అంశాల గురించి విపులంగా వివరించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ హెల్ప్లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కార్పొరేషన్ ఉప మేయర్ ఆబా బాగుల్ తెలిపారు. నేటి యువతకు అనేక విషయాలపై సరైన అవగాహన లేక ఇబ్బందిపడుతున్నారని, వారందరి సందేహాలను తీర్చడానికి హలో మై ఫ్రెండ్ టోల్ ఫ్రీ నంబర్ 18002336850ను ఉపయోగించుకోవాల్సిందిగా అధికారి కోరారు. -
ములా, ముఠా నదులకు మహర్దశ
పింప్రి, న్యూస్లైన్ : ములా, ముఠా నదులకు మహర్దశ పట్టనుంది. పుణే నగరం నడిబొడ్డున మురికి కాలువలుగా మారిన ఈ నదుల ఆధునికీకరణకు పుణే కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందుకోసం 715 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది. మురికి నీటి కాలువలుగా పారుతున్న ఈ రెండు నదుల రూపురేఖలు మారనున్నాయి. నిధుల సమీకరణ ఇలా.. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ రివర్ కన్జర్వేషన్ డెరైక్టరేట్ (ఎన్ఆర్సీడీ)కు నివేదించింది. ఈ ప్రణాళిక రూపుదిద్దుకోవడానికి కేంద్రం 50 శాతం నిధులు, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం నిధులను పూణే కార్పొరేషన్ సమకూర్చాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాను పుణే కార్పోరేషన్ సమకూర్చుకుంటుంది. ఈ విషయాన్ని కేంద్రానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది. 25న జాయ్కో కంపెనీ సర్వే ఈ నిధుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం జపాన్కు చెందిన జాయ్కో కంపెనీకి పంపించింది. మొత్తం నిధుల్లో 85 శాతం నిధులను ఇవ్వడానికి ఆ కంపెనీ సిద్ధమైందని కార్పొరేషన్కు చెందిన అధికారి పేర్కొన్నారు. దీనికి సంబంధించి నదుల పరిసరాలను సర్వేను జరపడానికి కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం ఈ నెల 25వ తేదీన నగరానికి రానున్నారని తెలిపారు. అనంతరం నిధులను అందించే విషయంపై ఆ కంపెనీ తుది నిర్ణయం తీసుకొంటుంది. వచ్చే సంవత్సరం మార్చి నుంచి నదుల ఆధునికీకరణ పనులు జరుగనున్నాయని తెలిపారు. -
పాపం ప్రభుత్వానిదే!
* పుణే కార్పొరేషన్ విన్నపాలను పట్టించుకోని సర్కార్ * నగరంలోని మౌలిక వసతుల కల్పనకూ నిధుల లేమి పింప్రి, న్యూస్లైన్: కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పుణే కార్పొరేషన్ చేసిన విన్నపాలను, రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చేసిన ఏ అభ్యర్థనకూ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాలిన్ గ్రామంలో జరిగిన దుర్ఘటనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ముంబై, చెంబూర్, ఇగత్పురి వంటి ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇలా ఏటా మరణాలు సంభవిస్తున్నా ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు. పుణే నగర నడిబొడ్డున ముళా, ముఠా నదులు ప్రవహిస్తున్నాయి. వరదలు రావడం, ఈ నదులు పొంగడం, ప్రాణ నష్టం సంభవించడం ప్రతి వర్షాకాలంలో జరుగుతోంది. దీంతో ఈ నదుల వరద నియంత్రణ, నదుల లోతు తెలిపే హెచ్చరిక బోర్డుల ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో గత సంవత్సరం యెరవాడాలో వర్షానికి కొండచరియలు విరిగిపడి రాంనగర్లోని గుడిసెలు నేలమట్టమైన విషయంపై పుణే కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏర్పాటు చేయాల్సిన ఫెన్సింగ్తోపాటు కొండ ప్రాంత పరిసరాలు, అటవీశాఖకు చెందిన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి అనుమతులు కోరింది. అందుకు 3 కోట్ల రూపాయల నిధులు సమకూర్చాలని అక్టోబరు 22, 2013లో రెవెన్యూ, అటవీ శాఖ కార్యదర్శులకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు జవాబు రాలేదు. ముళా, ముఠా నదుల విషయంగా హెచ్చరిక బోర్డులను, ప్రజల్లో జాగృతి కల్పిండానికి, నగరంలోని 12 కాలువల మ్యానిరూటింగ్ సిస్టమ్ను తయారు చేయడానికి అధికారులకు, సిబ్బందికి శిక్షణ అందించడానికిగాను 1.5 కోట్ల రూపాయలను అందించాల్సిందిగా కార్పొరేషన్కు 2012లో పునరావాస విభాగానికి ఉత్తరాలు పంపినా స్పందన లేదు. నగరంలో అత్యవసర పనుల గురించి జూన్, 2014న ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని అత్యవసరంగా చేపట్టవలసిన పనుల నివేదికను ఉపముఖ్యమంత్రి చేతికి అందించామని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారి తెలిపారు. వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదనే విషయం మరోసారి స్పష్టమైంది. -
యథేచ్ఛగా ప్లాస్టిక్ సంచుల వినియోగం
పింప్రి, న్యూస్లైన్ : ప్లాస్టిక్ సంచులపై పుణే కార్పొరేషన్ సంపూర్ణ నిషేధం విధించినా, అమలు మాత్రం సాధ్యం కావడం లేదు. వీటిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదట్లో ప్రకటనలు చేసి న అధికారులు తదనంతరం తనిఖీలు నిర్వహిం చడం మానేశారు. దుకాణాల్లో క్యారీ బ్యాగులను తనిఖీ చేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం కార్పొరేషన్కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వర కు దొంగచాటుగా చెలామణి అవుతున్న క్యారీ బ్యాగులు ఇక మీదట విచ్చలవిడిగా వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా డ్రైనేజీలు ప్లాస్టిక్ సం చులతో నిండిపోతాయి నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. పుణేలో ప్రతి రోజు రెండువేల టన్నుల చెత్త పోగవుతోంది. చెత్తలో అధికంగా ప్లాస్టిక్ బ్యాగులు ఉండడం వల్ల వ్యర్థాలను వేరుచేయడం ఇబ్బందిగా మారిందని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. నిలిచిఅపోయిన తనిఖీలు ప్రస్తుతం కార్పొరేషన్ వద్ద సిబ్బంది కొరత వల్ల ప్లాస్టిక్ సంచుల తనిఖీలకు వెళ్లడం లేదు. 50 మైక్రాన్లల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించారు. వీటిని ఉపయోగించిన వారి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సుమారు రూ.12 లక్షలు వసూలు చేసింది. సిబ్బంది కొరత వల్ల నాలుగు నెలలుగా తనిఖీలు నిలిపి వేయడంలో వసూళ్లు కూడా తగ్గిపోయాయి. జనవరిలో 1,994 సంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్ సంచు లు ఉపయోగించినట్టు తేలింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement