breaking news
pshyco attack
-
మతి స్థిమితం లేని వ్యక్తి వీరంగం
శామీర్పేట్: మతి స్థిమితం లేని వ్యక్తి శామీర్పేటలో బీభత్సం సృష్టించాడు. నల్సార్ దారిలో వచ్చిపోయే వాహనాలతో పాటు ప్రయాణీకులపై రాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘోరక్పూర్ జిల్లా, బడ్గావా గ్రామానికి చెందిన బంటికుమార్ బతుకుదెరువు నిమిత్తం స్నేహితులతో కలిసి వారం రోజుల క్రితం మండల పరిధిలోని పూడురు గ్రామానికి వలస వచ్చి స్థానిక రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం అతను శామీర్పేట గ్రామపరిధిలోని నల్సార్ దారిలో నిలబడి వాహనాలతో పాటు ప్రయాణికులపై రాళ్లతో దాడికి దిగాడు. ఈ దాడిలో మజీద్పూర్ గ్రామానికి చెందిన రాము, పూడూరు గ్రామానికి చెందిన పోచయ్య, మల్లేష్లతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 5 మందికి స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ టిప్పర్, ఒక బ్రిజా కారు, మరో ఇన్నోవా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. శామీర్పేట ఎస్ఐ అబ్దుల్ రజాక్ సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రేమోన్మాదం
సాక్షి, చెన్నై : ప్రేమోన్మాదం మరోమారు కోరలు చాచింది. పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ కిరాతక ప్రియుడు ప్రియురాలి గొంతుకోసి హతమార్చాడు. తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. రాష్ట్రంలో ఇటీవల ఒన్సైడ్ ప్రేమకు బలి అవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, ప్రేమించి చెట్టాపట్టలు వేసుకుని తిరిగి, చివరకు పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియురాళ్లు ఉన్మాద ప్రియుల చేతిలో బలవుతున్నారు. ఇక, ప్రేమ పేరుతో వేధించడం, తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ప్రేమోన్మాదులుగా మారే యువత సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇటీవల ప్రేమ పేరుతో బలైన వారు కొందరయితే, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకుని పరువు హత్యలకు గురైన వారు మరెందరో. ఈ పరిస్థితుల్లో ప్రేమికులుగా చెట్టా పట్టలు వేసుకుని తిరిగి, చివరకు పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో ఉన్మాదిగా మారిన ప్రియుడు తన ప్రియురాలి గొంతుకోసి హతమార్చడం తిరువొత్తియూరులో కలకలం రేపింది. ఉన్మాదిగా.. చెన్నై తిరువొత్తియూరు గాంధీనగర్కు చెందిన వేణుగోపాల్ పెయింటర్. ఈయన కుమార్తె భారతి బీఎడ్ పూర్తిచేసింది. ప్రస్తుతం ఇంటికి సమీపంలోని ఓ మోటార్ సైకిల్ షోరూమ్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నారు. కాంచీపురం జిల్లా వెల్ల కోట్టైకి చెందిన సెల్వన్ కుమారుడు బాలాజీ తరచూ తిరువొత్తియూరుకు వచ్చే సమయంలో భారతిని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె పనిచేస్తున్న షోరూమ్కు తరచూ వెళ్లి వస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. చెట్టా పట్టలు వేసుకుని తిరుగుతున్న ఈ ప్రేమ జంట వ్యవహారం పెద్దల దృష్టికి చేరింది. తొలుత పెద్దలు నిరాకరించారు. తదుపరి అంగీకరించారు. అయితే, బాలాజీ ఓ రోజు మద్యం సేవిస్తూ భారతి కంటపడడం వారి ప్రేమకు బ్రేక్ పడేలా చేసింది. దీంతో ఆ యువతి బాలాజీని దూరం పెట్టే పనిలో ఆమె నిమగ్నం అయింది. ఇది బాలాజీని ఆగ్రహానికి గురిచేసింది. తరచూ మద్యం సేవించి భారతితో గొడవ పడడం మొదలెట్టాడు. ఈ వ్యవహారం ఇంటివరకు చేరడంతో భారతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అదే సమయంలో తమ కుమార్తెను చేసుకోదలచితే వ్యసనాల్ని మానుకుని, తమ మతం స్వీకరించాలని మెలిక పెట్టినట్టు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన బాలాజీ ఉన్మాదిగా మారాడు. తనకు దక్కని భారతి మరొకరికి దక్కకూడదని హతమార్చేందుకు సిద్ధం అయ్యాడు. ఆదివారం రాత్రి మద్యానికి చిత్తై వచ్చిన బాలాజీ తిరువొత్తి యూరులోని ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తనకు ఎదురు పడ్డ భారతి గొంతుకోసి అక్కడి నుంచి ఉడాయించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతిని కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక అర్ధరాత్రి సమయలో భారతి మరణించింది. భారతి తండ్రి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో తిరువొత్తి యూరు పోలీసులు రంగంలోకి బాలాజీ కోసం గాలించడం మొదలెట్టారు. వేకువజామున పోలీసు స్టేషన్కు వచ్చిన ఆ యువకుడు తానే బాలాజీ అని పేర్కొని స్పృహ తప్పాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా, క్రిమి సంహారక మందు సేవించినట్టు వైద్యులు తేల్చారు. దీంతో అతడికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. భారతి మరణ సమాచారంతో తానూ ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నంలో విషం తాగినట్టు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించడంతో పాటు మతం మారాలన్న డిమాండ్ కారణంగానే గొంతు కోశానని బాలాజీ పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. -
సైకో దాడి: కార్మికుడి మృతి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన నంది పైపుల ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన ఓ సైకో అక్కడ నిద్రిస్తున్న ఓ కార్మికుడిపై దాడి చేసి హతమార్చాడు. ఇది గుర్తించిన తోటి కార్మికులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఫ్యాక్టరీలో రోజువారి కూలీగా పని చేస్తున్న రాజేశ్వర్(50) అనే కార్మికుడిపై సైకో అశోక్ బండరాయితో దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలైన రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ హరినాథ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సైకోను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి