breaking news
Protective tariff
-
రక్షణాత్మక వాణిజ్యం వృద్ధికి విఘాతం
హాంకాంగ్: వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వృద్ధికి విఘాతంగా మారతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు విడనాడాలని హెచ్చరించారు. అమెరికా–చైనాల మధ్య ‘వాణిజ్య యుద్ధ’ భయాల నేపథ్యంలో ఆమె ఇక్కడ ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు... ► ప్రపంచ వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య విధానాలే సరైనవి. ఇందుకు విరుద్ధమైన బాటను దేశాలు విడనాడాలి. ఏ రూపంలోనూ వాణిజ్య రక్షణాత్మక విధానాలు అనుసరించకూడదు. ►తగిన వాణిజ్య విధానాలు లేనందువల్లే వాణిజ్య లోటు ఏర్పడ్డానికి కారణమన్న అభిప్రాయం తప్పు. (అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ఈ తరహా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ►ఒక విషయం గుర్తుంచుకోవాలి. బహుళ వాణిజ్య విధాన వ్యవస్థే ప్రపంచం మార్పునకు కారణం. అత్యంత పేదరికంలో జీవిస్తున్న ప్రజల పేదరికాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అధిక వేతనాలతో లక్షలాది ఉద్యోగాలను ప్రపంచవ్యాప్తంగా సృష్టించడానికి ఈ వ్యవస్థ దోహదపడింది. ►వ్యవస్థలో లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి తప్ప, దీనిని మొత్తంగానే తప్పుపట్టడం తగదు. ►కొత్త సాంకేతికత, ఇందుకు సంబంధించి విద్య, శిక్షణల్లో పెట్టుబడుల పెంపుతో వృద్ధిని మరింత పెంపొందించడానికి వీలు కలుగుతుంది. ఇందుకు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ►ప్రపంచ వాణిజ్య వృద్ధి పట్ల మేము పూర్తి ఆశావహంతో ఉన్నాము. 2018, 2019లో 3.9 శాతం వృద్ధి నమోదవుతుందన్నది జనవరిలో ఐఎంఎఫ్ వేసిన అంచనా. ►అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం తాజా వృద్ధి రికవరీ ధోరణి బాగుంది. చైనా, భారత్, జపాన్లో కూడా పటిష్ట వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. -
ఉక్కు ఉత్పత్తుల దిగుమతిపై 20% రక్షణాత్మక సుంకం
తక్షణం అమల్లోకి - 200 రోజుల పాటు వర్తింపు - దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకే - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని కేటగిరీల ఉక్కు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం రక్షణాత్మక సుంకం విధించింది. చౌక ధరల్లో ఉక్కు ఉత్పత్తుల దిగుమతులు వెల్లువెత్తుతుండటంతో దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సుంకం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు. ఈ సుంకం 200 రోజుల పాటు అమల్లో ఉంటుందని వివరించారు. ఈ సుంకం పెంపు కారణంగా దేశీయ ఉక్కు రంగానికి లాభకరమని, ఈ లాభం స్వల్పకాలానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రక్షణాత్మక సుంకం అన్ని దేశాల దిగుమతులకు వర్తిస్తుంది. దిగుమతి సుంకం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న దేశాలకు వర్తించదు. చౌక ధరల ఉత్పత్తుల నుంచి దేశీయ పరిశ్రమను కాపాడు కోవడానికి నిర్దేశిత గడువు వరకూ రక్షణాత్మక సుంకాలు విధించడం వంటి తాత్కాలిక చర్యలు తీసుకోవచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. మరోవైపు చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో ఆ దేశం నుంచి ఉక్కు, ఇనుము ఉత్పత్తుల ధరలు తగ్గి దిగుమతులు పెరిగాయి. దీంతో గత నెలలో ప్రభుత్వం బేస్ మెటల్స్ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని 2.5% పెంచింది.