-
ఉద్భవించిన ‘తెలంగాణ సోనా’
సాక్షి, హైదరాబాద్: ధాన్య భాండాగారంగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం మరో అద్భుతమైన వరి వంగడం సాగుకు వేదిక కానుంది. నాటుపెట్టిన స్వల్పకాలంలోనే పంట దిగుబడి వచ్చే ఈ సన్న రకం ధాన్యం పేరు ‘తెలంగాణ సోనా’. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వరి రకం సాంబమసూరి కన్నా సన్నరకమే కాక.. దానికంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిస్తుంది. ఎంటీయూ– 1010 రకాన్ని ఆడమొక్కగా, జేజీఎల్–3855 (కరీంనగర్ సాంబ) రకాన్ని మగమొక్కగా సంకరంచేసి రూపొందించిన ఈ వంగడంలో పిండి పదార్థాలు కూడా చాలా తక్కువని తేలింది. అందుకే దీన్ని ‘షుగర్ ఫ్రీ రైస్’ అని అంటున్నారు. ఇప్పుడు ఈ స్వల్పకాలిక సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రచిస్తోంది. స్వల్పకాలిక దిగుబడులు ఇచ్చే వంగడాల ఉత్పత్తిలో భాగంగా ‘తెలంగాణ సోనా’ ఉద్భవించింది. ఇది సాంబమసూరి కన్నా సన్నగింజ పంట. మార్కెట్లో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. సాంబమసూరి అగ్గితెగులు, దోమపోటు, ఆకు ఎండు తెగుళ్ల బారినపడుతుంది. వాటిని తట్టుకోలేదు. కానీ, తెలంగాణ సోనా అగ్గి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ఆలస్యంగా నాటడం వల్ల దోమపోటును తప్పించుకుంటుంది. దీంతో పురుగుమందులపై ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ మేలు కలుగుతుంది. సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే ఇందులో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల దీన్ని ‘షుగర్ ఫ్రీ రైస్’అనీ పిలుస్తున్నారు. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోని అన్ని వ్యవసాయ వాతావరణ మండలాల్లో ‘తెలంగాణ సోనా’రకం సాగుకు అనుకూలమే. సాంబ మసూరి కన్నా దాదాపు 50 శాతం తక్కువ ఖర్చుతో, 20–30 శాతం ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. సాంబమసూరి (బీపీటీ–5204) స్థానంలో దీన్ని సాగుచేయవచ్చు. దీన్ని చౌడు నేలల్లో సాగు చేయకూడదు. 125 రోజుల పంట కాల పరిమితితో, ఆలస్యంగా నారు పోసుకోవడానికి అనుకూలమైన రకం. వానాకాలంలో ఆలస్యంగా విత్తుకునే రకం కనుక పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకోవచ్చు. సాంబమసూరి పంటకాలం 150 రోజులు. తెలంగాణ సోనా సాగు కాలం 125 రోజులే. కాటన్ దొర సన్నాలతో సమానమైన అధిక దిగుబడినిస్తుంది. హెక్టారుకు 7 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. 100 కిలోల ధాన్యానికి 68–70 కిలోల బియ్యం వస్తుంది. ఇది 100 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. గాలికి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంట యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మే ఆఖరి వారంలో నాటువేస్తే 150 రోజుల్లోనూ, జూన్ మొదటి, రెండో వారాల్లో నారుపోస్తే 130–140 రోజుల్లోనూ పంట వస్తుంది. జూలై రెండో వారం తరవాత నారుపోస్తే 120 రోజుల్లో, ఆగస్ట్లో పోస్తే 100 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. వానాకాలంలో తప్పనిసరిగా జూలైలో మాత్రమే నారుపోసుకోవాలి. యాసంగిలోనూ ఇదే తరహాలో పంట వస్తుంది. నవంబర్ 15 ప్రాంతంలో నారుపోస్తే పంటకాలం 150 రోజులు. డిసెంబర్ 15 ప్రాంతంలో పోస్తే పంటకాలం 120రోజులు. జనవరిలో నారుపోస్తే 100 రోజుల్లో వస్తుంది. యాసంగిలో నవంబర్ 15 – డిసెంబర్ 7లోపు నారు పోయాలి. స్వల్పకాలిక రకాలే మేలు వాస్తవానికి, వానాకాలంతో పోలిస్తే యాసంగిలోనే వరి ఎక్కువ దిగుబడి వస్తుంది. యాసంగిలో అధిక సూర్యరశ్మి, తక్కువ చీడపీడలు, అనుకూల వాతావరణం ఉండడం ఇందుకు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలంలో తక్కువ సూర్యరశ్మి, తుపానుల తాకిడి, చీడపీడల ఉ«ధృతి ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు తక్కువొస్తాయనేది వారి విశ్లేషణ. దీంతో వాతావరణ మార్పులు, చీడపీడలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరిలో మధ్య, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలకు (150 రోజుల కాలపరిమితి గల పంట) ఎక్కువ నీరు, ఎక్కువ విద్యుత్ అవసరం. అంతేకాక పచ్చిరొట్ట పంటలువేసి భూమిలో కలియదున్నే సమయం ఉండదు. ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నార్లుపోసి, నాట్లు పెట్టడం వల్ల చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక, పూత సమయంలో వచ్చే చలి వల్ల తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గిపోతాయి. దీంతో స్వల్పకాలిక రకాలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగంతో పాటు సాగుఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవచ్చు. సాగులో దిగుబడులకు రెండు పద్ధతులుంటాయని, అందులో 50 శాతం సేద్యపు పద్ధతులపై దిగుబడులు ఆధారపడి ఉంటే, మరో 50 శాతం ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ సోనాలాంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా యాజమాన్య పద్ధతులతో తక్కువ కాలంలో మంచి దిగుబడులు సాధించవచ్చంటున్నారు. అందుకే తెలంగాణ రైతన్నను ఈ వానాకాలం నుంచే ‘తెలంగాణ సోనా’సాగు దిశగా ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లుచేస్తోంది. -
ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు
గ్రీన్హౌస్కు నిధుల పరిమితి లేదు వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడి అగ్రికల్చర్ వర్సిటీలో సుస్థిర వ్యవసాయంపై వర్కషాపు సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వ్యవసాయంపై ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో పరిశోధనలు నిర్వహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం వ్యవసాయవర్సిటీలో సుస్థిర సేద్యంపై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడుతూ రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలనేది సర్కారు ఉద్దేశమని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఉచితంగా స్టాల్స్ ఇచ్చి విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. గ్రీన్హౌస్కు నిధులెన్నైనా ఇస్తాం.. గ్రీన్హౌస్ (పాలీహౌస్)ను రాష్ట్రవ్యాప్తంగా అమ లు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో దానిని వెయ్యి ఎకరాలకే పరిమితం చేయబోమని పోచారం తెలిపారు. ఎన్ని ఎకరాలకైనా నిధులిస్తామని పేర్కొన్నారు. రైతు యూనిట్గా బీమా పాలసీ ఉండాలని ఇటీవల ఢిల్లీ సమావేశంలో పేర్కొన్నట్లు వివరించారు. వ్యవసాయశాఖలోని మూడు వర్సిటీలకు త్వర లో పాలకమండళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సాగు ఎక్కువ.. అధికారులు తక్కువ: చిన్న, సన్నకారు అట్టడుగు రైతులకు అండగా ఉం డేందుకు సుస్థిరసేద్యాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సదస్సులో మాట్లాడుతూ తెలంగాణలో 40 లక్షల ఎకరాలలో వ్యవసాయం సాగవుతు న్నా కేవలం 6 వేల మంది అధికారులు ఉండడంతో రైతులకు సరైన సమాచారం అందడం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి, ప్రకృతి వ్యవసాయశాఖ శాస్త్రవేత్త సుభాశ్ పాలేకర్ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement