-
తాగునీటి కోసం ఆందోళన
సర్పంచ్ ఇంటి ఎదుట మహిళల నిరసన రెండు నెలలుగా నీరు సరఫరా కాకపోవడంతో ఆగ్రహం వర్ధన్నపేట : రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన మíßహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. మండలంలోని ఇల్లంద ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలకు రెండు నెలలుగా నీటి సరఫరా కావడం లేదు. వేసవి రావడంతో సమస్య జఠిలం కాగా, ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో సర్పంచ్ రాయపురం కుమారస్వామి ఇంటికి చేరుకున్నారు. తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కాలనీకి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
ప్రతిఇంటికి సురక్షిత మంచినీరు
పుల్కల్/పెద్దశంకరంపేట: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. 2017 మార్చిలోగా 275 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ముందుగు సాగుతున్నామని చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట శివారులో జరుగుత్ను భగీరథ పనుల పరిశీలన, పెద్దశంకరంపేట మండలం జంబికుంట నుంచి నిజామాబాద్ జిల్లాకు నిర్మిస్తున్న తాగునీటి పైప్లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.75 లక్షల కిలోమీటర్ల మే పైప్లైన్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో 26 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. రూ.1,350 కోట్లతో సింగూరు- జూకల్, రూ.1400 కోట్లతో శ్రీరాంసాగర్- కామారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. సింగూర్-జూకల్ ప్రాజెక్టును నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. జూకల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు బోధన్ ప్రాంతానికి ఈ పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు రెండు ప్యాకేజీల ద్వారా రూ. 1000 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు ఉన్నారు. -
హమ్మయ్య దాహం తీరింది!
హార్సిలీహిల్స్కు 2 కొత్త బోర్ల నుంచి ప్రారంభమైన పంపింగ్ బి.కొత్తకోట: మండలంలోని హర్సిలీహిల్స్లో రెండేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. ఇటీవల వేసిన 2 కొత్తబోర్ల నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. దీంతో కొంత దాహం తీరినట్లయింది. ఆదివారం కొత్తబోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో నీటిని సంపులకు పంపింగ్ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సమ స్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. హార్సిలీ కొండకు 7 దశల్లో నీటిని కురబలకోట మండలం గాలేటివారిపల్లె నుంచి పం పింగ్ చేస్తున్నారు. ఈ పైప్లైన్ బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మాణం చేసిం ది. ఈ ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన 7 బోర్లున్నాయి. రెండేళ్లుగా ఆరు బోర్ల నుంచి నీటి పంపింగ్ లేకుండాపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రైతుల నుంచి నాలుగు బోర్లను లీజుకు తీసుకున్నారు. అయినా నీటి స మస్య తీరలేదు. నీటి సమస్య కారణంగా 10 అతిథి గృహాలను పర్యాటకులకు కేటాయించకుండా నిలిపివేయాల్సి వచ్చింది. రోజుకు లక్ష లీటర్ల కొరత తీరింది నిన్నటి వరకు హార్సిలీకొండకు రోజుకు లక్షల నీటి కొరత ఉండేది. ఆదివారం నుంచి ఆ కొరత నుంచి బయపడ్డారు. కొండపై రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉంది. అయితే బోర్లు ఎండిపోవడంతో వేసవికి ముందు రోజుకు కేవలం 40 వేల లీటర్లు, ఇటీవల వరకు 25 వేల లీటర్ల నీళ్లే లభ్యమయ్యేది. ఈ నీరు పర్యాటక శాఖకే సరిపోకపోవడంతో స్థానికులకు, ఇతర శాఖలకు అం దించే వీలులేకపోయింది. ఒక ట్యాంకర్ నీటిని రూ.2 వేలతో కొనుగోలు చేశారు. పర్యాటక శాఖకు నీటినిల్వల కోసం నిర్మించిన 2.4 లక్షల లీటర్ల సామర్థ్యమున్న రెండు సంపులు ఎండిపోయాయి. ప్రస్తుతం కొత్తగా వేసిన 2 బోర్ల నుంచి నాలుగించుల నీళ్లు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు రోజుకు లక్ష లీటర్ల నీటి లభ్యత మొదలైంది. అయితే లక్ష లీటర్ల వినియోగం తగ్గించి 80 వేల లీటర్లే పంపింగ్ అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. సంపులకు నీటిని నింపేసి, మిగిలిన పంపింగ్ నీటిని అందరికీ సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మారిన నీటి ధరలు కొండపై నీటి వినియోగంపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి లీటర్కు 3పైసలు ఉండగా 10పైసలు పెంచారు. గృహ అవసరాలకు వినియోగించే నీటికి 2 పైసల నుంచి 5 పైసలకు పెంచారు. పెరిగిన ఈ ధరతో పర్యాటక శాఖకు కొంతమేరకు ఆదాయం సమకూరనుంది. -
నీటి కష్టాలు తీరుస్తా
‘‘జిల్లాలో నీటి సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పొలాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. చెరువుల్లో చుక్కనీరు లేకుండా పోయింది. భూగర్భజలాలు అడుగంటాయి. అయినా అధైర్యపడొద్దు. ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా పడమటి మండలాలకు నీటిని తీసుకొస్తా. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ను నిర్మిస్తా. నీటిసమస్యే లేకుండా చూస్తా’’ అంటూ సీఎం చంద్రబాబు బుధవారం రేణిగుంట మండలం ఆర్.మల్లవరం వద్ద జరిగిన సభలో హామీ ఇచ్చారు. - ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా మదనపల్లెకు నీళ్లు - నీరు-చెట్టు ద్వారా భూగర్భ జలాల పెంపు - రెండేళ్లలో గాలేరు- నగరిని పూర్తిచేస్తా - అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతా - అధికారులపై తీవ్ర ఆగ్రహం - సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన వైనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో తాగునీటి సమస్య ఉందని, దాని పరిష్కారం కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన బుధవారం రేణిగుంట మండలం ఆర్ మల్లవరంలో స్థానిక సర్పంచ్ మునిశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా పుంగనూరు, మదనపల్లెకు నీటిని తీసుకు వస్తామన్నారు. స్వర్ణముఖి, సోమశిల లింకు కెనాల్ను నిర్మిస్తామన్నారు. జీఎన్ఎస్ఎస్ పనులను రెండేళ్లల్లో పూర్తి చేసి, నగరికి నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రముఖ విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశామన్నారు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్లు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఆర్ మల్లవరం గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపాలన్నారు. పట్టిసీమ, పోలవరం నీరు, రాయలసీమకు తెచ్చేవరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని చెప్పారు. సీఎం ప్రసంగిస్తుండగానే... ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే సగం మందికి పైగా మహిళలు వెళ్లిపోయారు. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు సభకు వచ్చిన మహిళల నుంచి లేదు లేదు అని సమాధానం రావడంతో సీఎం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ దశలో ఆగ్రహంతో అధికారులపై ఊగిపోయారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ సహనం కోల్పోయారు. సమావేశం మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలను సైతం సీఎం మందలించారు. సభ నిర్వహణపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖం చాటేసిన అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సీఎం సభకు అధికారులంతా హాజరయ్యారు. అయినప్పటికీ వారు వేదికపైకి వెళ్లకుండా ముఖం చాటేశారు. సీఎం పలుమార్లు ఇక్కడ అధికారులు ఎవరంటూ ప్రశ్నించినప్పుడు వేదిక దగ్గరగా ఉన్న అధికారులు వణికి పోయారు. సీఎం దగ్గరకు వెళితే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని వెళ్లకుండా ఉండిపోయారు. సమావేశానికి కలెక్టర్ తప్ప మిగిలిన ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ వేదిక పైకి వెళ్లలేదు. సీఎం ప్రసంగానికి ఆశించిన మేర స్పందన కరువైంది. చెరుకు రైతులు బకాయిలు చెల్లించాలని సీఎంను నిలదీశారు. -
గ్రామాల్లో నీటి సమస్య ఉండొద్దు
మాక్లూర్ : గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉంటే అధికారుల పై చర్యలు కఠినంగా ఉంటాయని జెడ్పీ సీఈఓ మోహన్లాల్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగు నీటి కోసం జెడ్పీ, మండల, ఏఆర్డబ్ల్యూఎస్, బీఆర్జీఎఫ్ కింద నిధులు మంజూరు చేశామన్నారు. ఏదైనా గ్రామంలో నీటి సౌకర్యం లేకపోతే ట్యాంకర్లలో అద్దెకు తెచ్చి నీటి సౌకర్యం కల్పించాలని సూచించినట్లు తెలిపారు. ఈజీఎస్, మిషన్ కాకతీయ, హరితహారం పథకం పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. త నిఖీ సమయంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మూమెంట్ రిజిష్టర్, హాజరు పట్టిక సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి నిధులు సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం మాదాపూర్లో పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. ముందుగా ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలు తనకు వికలాంగ పింఛను రావడం లేదని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా సదరం సర్టిఫికెట్ పరిశీలించడంతో పాటు ఆమె చేతిని తన సెల్లో ఫొటో తీసుకున్నారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ చంద్రశేఖర్శర్మ, జూనియర్ పర్యవేక్షకులు శ్రీనివాస్గౌడ్, సిబ్బంది, పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement