-
ట్రంప్కి సైతం వణుకుపుట్టించే స్థాయికి వివేక్ రామస్వామి
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న ఆయన... ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు. బయోటిక్ రంగంలో అమెరికాలో సంచలనం సృష్టించిన రామస్వామి... మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా వణుకుపుట్టించే స్థాయికి ఎలా ఎదిగారు? రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతకి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలోకి చేరుకొన్నారు ఆయన. ఈమధ్యనే జరిగిన జీవోపీ పోల్స్లో ఇది వెల్లడైంది. ఇంతకుముందు మూడో ప్లేస్లో ఉన్న భారత సంతతికి చెందిన రామస్వామి తాజాగా రెండో స్థానానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు... అధ్యక్ష రేసు కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్లో 39 శాతం మంది డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇస్తున్నారు. రామస్వామికి 13 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్నిబట్టి ట్రంప్కు రామస్వామే ముఖ్య పోటీదారుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ రెండు స్థానాలు తగ్గి అనూహ్యంగా ఐదో స్థానానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. మరోవైపు...వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75 శాతం మందిని తొలగిస్తానని అనూహ్య ప్రకటన చేశారు రామస్వామి. అంతేకాదు FBI లాంటి అనేక సంస్థలను మూసేస్తాని కూడా స్పష్టంచేశారు. వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగుల్ని తగ్గించడమే తన లక్ష్యమని కూడా చెప్పారు రామస్వామి.అంతేకాదు.. హెచ్-1 వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ విభాగంలో సుమారు 22 లక్షల 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 75 శాతం మంది తొలగించడమంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలనకడమేనన్నమాట. అంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తే బడ్జెట్లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు మూతపడే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు... ఈమధ్య జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలు చేసిన వివేక్ రామస్వామి చాలా మంది మద్దతు సంపాదించారు. తర్వాత నిర్వహించిన పోల్లో 504 మంది స్పందన తెలియజేస్తే... అందులో 28 శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే ...రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు రామస్వామి. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్ను ఆఫర్ చేస్తానని కూడా ప్రకటించారు రామస్వామి. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు రామస్వామి. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు. కానీ ఆయనకు భారత సంతతికి చెందిన అభ్యర్థుల నుంచి చివరిదాకా గట్టిపోటీ తప్పేలాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్ష ఎన్నికల నాటికి పరిస్థితులు మారే అవకాశముందని కూడా అంచనావేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబరులో జరగుతాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఆసమయంలోనే తాను 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీచేస్తానని ప్రకటించారు ట్రంప్. ఇక.. రామస్వామి పూర్వీకులు భారత్కు చెందిన వారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నుంచి అమెరికా వలసవెళ్లిన గణపతి రామస్వామి, గీతా రామస్వామికి 1985 ఆగస్టు 9న జన్మించారు వివేక్ రామస్వామి. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న వివేక్.. 2014లో రోవెంట్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించారు. 2015లో అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారుచేసి బయోటెక్ రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు ఆయన కీలక వ్యక్తిగా మారారు. -
అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ 'X' సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు. He is a very promising candidate https://t.co/bEQU8L21nd — Elon Musk (@elonmusk) August 17, 2023 ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చైనా పర్యటన సందర్బంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. త్వరలోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చైనాలో కూడా విస్తరించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ చైనాలో నమ్మకమైన, అనువైన పరిస్థితులున్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని వర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని తన 'X' సోషల్ మీడియా అకౌంట్లో రాశాడు. I’m breaking an unspoken rule in the GOP, but I call it like I see it: it’s deeply concerning that @elonmusk met with China’s foreign minister yesterday to oppose decoupling and referred to the U.S. & Communist China as “conjoined twins.” Tesla’s VP in China reposted that… pic.twitter.com/UD26pweilX — Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 31, 2023 ఇది కూడా చదవండి: Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో -
అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వివేక్ రంగస్వామి!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిక్కీ హేలీ, మైక్ పాంపియో, మైక్ పెన్స్ వంటి హేమా హేమీలు పోటీలో ఉండబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. అయితే తాజాగా మరో యువ పారిశ్రామికవేత్త పేరుకూడా గట్టిగా వినపడుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే గమనార్హం. శాకాహారి అయిన వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్గా గుర్తింపుపొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ 'రోయివంట్ సైన్సెస్'కు వ్యవస్థాపక సీఈఓ. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా ప్రముఖ మేగజీన్ 'ది న్యూయార్కర్'.. వివేక్ రంగస్వామిని 'యాంటీ-వోక్ సీఈఓ'గా అభివర్ణించింది. వోక్యిజం అంటే సామాజికంగా, రాజకీయంగా అందరీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత మనస్తత్వం లేదా భావజాలం. అయితే వోకియిజం పిడివాద భావజాలం అని వివేక్ వాదిస్తుంటారు. ఇది ప్రపంచంలోని వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువ ఆసక్తి కలిగిఉందని చెబుతుంటారు. అందుకే ఈయనను 'యాంటీ-వోక్ సీఈవో' అని న్యూ యార్కర్ అభివర్ణించింది. రాజకీయంగా వివేక్కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు. మరికొందరేమో అతనికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని, వోకియిజంపై అతని ఆలోచనలు వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవేళ వివేక్ రంగస్వామికి అమెరికా అభ్యర్థిగా నిలబడే అవకాశం లభిస్తే మాత్రం అది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పొచ్చు. చదవండి: ట్రంప్కు షాక్ ఇస్తున్న రిపబ్లికన్లు.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్.. నమ్మినవాళ్లే వ్యతిరేకులుగా.. -
సమున్నత పదవికి స్థాయి ముఖ్యం
జాతిహితం మన రాష్ట్రపతి పదవి చరిత్రను పరిశీలిస్తే విద్యార్హతలకీ, రాజకీయ నేపథ్యానికీ, కులమతాలకీ, సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి పదవిని చేపట్టబోయే వారి పనితీరు, ముద్రలను కరిక్యులమ్ వీటా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉంది, అది ఊహకి అతీతమైన లక్షణం : అదే స్థాయి. కలామ్, వెంకట్రామన్, నారాయణన్లకు అలాంటి స్థాయి ఉంది. వీవీ గిరి, ఫక్రుద్దీన్, ప్రతిభా పాటిల్కు అలాంటి స్థాయి లేదు. భారత 14వ రాష్ట్రపతి పదవిని చేపట్టడానికి కావలసిన అర్హతలన్నీ ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు ఉన్నాయా లేవా అన్న ప్రశ్న ఇప్పుడు పూర్తిగా విద్యా విషయకమైనది. సర్వ సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రజాజీవితంలో కోవింద్ సాధించిన విజయాలను గురించి ఆయనకు మద్దతు ఇస్తున్నవారు ఏకరువు పెట్టవచ్చు. అయితే ఈ వివరణలలో 2007 సంవత్సరంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిభా పాటిల్ను కాంగ్రెస్ నియమించినప్పుడు చెప్పిన మాటలే ధ్వనిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత పాటిల్ గతానికి సంబం«ధించిన రహస్యాలు బయటపడడంతో కాంగ్రెస్ నాయకులు ఇరకాటంలో పడ్డారు. అప్పుడు నా సంపాదకత్వంలోని పత్రిక ప్రతిభా పాటిల్ గతాన్ని వలేసి వెతికి పట్టుకుని చక్కెర వ్యాపారంలో, సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో, ప్రైవేటు విద్యా సంస్థలలో ఆమె చీకటి కార్యకలాపాలను గురించి ధారావాహికంగా ప్రచురించింది. అయినా అలాంటి శత్రుత్వానికి స్వస్తి పలికే ఉద్దేశంతో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక సాయంత్రం, బాగా పొద్దుపోయిన తరువాత నా దగ్గరకు వచ్చాడు. వెంట ఒక మామిడిపళ్ల బుట్ట కూడా తెచ్చాడు. ‘‘మీ విలేకరులు రాసిన వార్తలన్నీ నిజమే’’అన్నాడాయన. అయితే వాటిని మేమెందుకు ఆపాలి అని అడిగాను. ఎందుకా సోదరా! మంచికో చెడుకో జూలై 25కి ఆమె ఈ గణతంత్ర దేశపు వైభవానికి ప్రతినిధిగా నిలవబోతున్నారు. ఈ మురికంతా ఇప్పుడు తవ్విపోసి కాబోయే మీ రాష్ట్రపతికి అపకీర్తి ఎలా తెచ్చి పెట్టగలవు?’’అని కూడా అన్నాడాయన. ఇప్పుడు కోవింద్ అభ్యర్థిత్వం గురించి చెబుతున్న అంశాలు నాడు ప్రతిభా పాటిల్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలతో పోల్చదగినవిగా కనిపిస్తున్నాయి. ఆమెకు పార్లమెంటు సభ్యురాలిగా సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. గవర్నర్గా అనుభవం ఉందని చెప్పారు. మొదటి మహిళా రాష్ట్రపతి అని చెప్పారు. ఇంతకు ముందు పనిచేసిన వారికంటే ఎక్కువా కాదు తక్కువా కాదని వాదించారు. ఎలక్టొరల్ కాలేజ్లో సంఖ్య ప్రధానం కాబట్టి ఆనాడు యూపీఏ పక్షాలన్నీ కాంగ్రెస్ వెంటే విన్నాయి. అయితే ఈ కాలమిస్ట్ సహా చాలామంది విమర్శకులు నామమాత్రపుదే అయినా ఆ అత్యున్నత పదవికి సంబంధించిన అంశాన్ని తేలికగా తీసుకోవద్దని, అలాంటి నిర్ణయంతో పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అయినా ఒక అవాంఛనీయ సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఇప్పుడు అదే పునరావృతం కావడం చూస్తున్నాం. రాజకీయానుభవం అనే కోణం నుంచి చూస్తే కోవింద్ ప్రతిభా పాటిల్ కంటే కొంచెం వెనుకపడి ఉండవచ్చు. అయితే విద్యా విషయంలో ఆయన ఆమె కంటే ఉత్తమ అర్హతలే కలిగి ఉన్నారు. న్యాయ పరిజ్ఞానంలో మంచి పేరే ఉంది. వ్యక్తిగత, కుటుంబ జీవితాలు కూడా మచ్చలేనివిగానే ఉన్నాయి. ఆయన కరిక్యులమ్ వీటా (సీవీ, వ్యక్తిగత వివరాలు)ను బట్టి చూస్తే అ«ధ్యక్ష పదవికి ఆయనను అనర్హుడని ఎవరూ వాదించలేరు. కానీ ఒక ప్రశ్న అడగవలసిన అవసరం ఉంది: ఏ వ్యక్తికైనా దేశంలో అత్యున్నత పదవికి అర్హుడని చెప్పడానికి గొప్ప కరిక్యులమ్ వీటా ఒక్కటే సరిపోతుందా? అది గొప్పగా లేకుంటే వారు అనర్హులవుతారా? గతం మీద విహంగ వీక్షణం భారత రాష్ట్రపతుల పరంపరను చూస్తే వారి ఎంపికలో విద్యార్హతలు, సామాజిక, రాజకీయ నేపథ్యాలను పట్టించుకున్నట్టు కానరాదు. మేధాసంపన్నుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసుకున్నాం. అలాగే దాదాపు నిరక్షరాస్యుడైన జ్ఞానీ జైల్సింగ్ను కూడా ఆ పదవికి పంపించాం. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రణబ్ ముఖర్జీ, ఆర్. వెంకటరామన్ వంటి రాజ కీయ దిగ్గజాలనీ, అలాంటి వారే నీలం సంజీవరెడ్డి, శంకర్దయాళ్ శర్మలను, అంతంతమాత్రం అనిపించిన వీవీ గిరిని కూడా రాష్ట్రపతి పదవిలో చూశాం. విశేష గౌరవ ప్రతిష్టలు కలిగి, ముస్లిం వర్గం నుంచి వచ్చిన డాక్టర్ జకీర్హుస్సేన్తో పాటు, ఏమాత్రం గుర్తుంచుకోవలసిన అవసరం లేని ఫక్రుద్దీన్ అలీ అహ్మద్లను కూడా ఆ అత్యున్నత పదవిలో ప్రతిష్టించుకున్నాం. విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసిన కేఆర్ నారాయణన్, శాస్త్ర, సాంకేతిక రంగం నుంచి వచ్చిన మరో ఉన్నతోద్యోగి డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాంలను కూడా రాష్ట్రపతి పదవికి పంపించాం. ఆ పదవిని అలకరించిన వారికి సంబంధించి గుర్తు చేసుకోదగిన చక్కని ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఆ అత్యున్నత పదవి గౌరవ ప్రతిష్టలను నిలబెట్టేందుకు అవసరమైన రీతిలో వివాదరహితంగా వ్యవహరించడంలో ఎవరూ విఫలం కాలేదని సగర్వంగా కూడా చెప్పవచ్చు. కొన్ని మినహాయింపులు అయితే ఇందుకు కొన్ని చెప్పుకోదగిన మినహాయింపులు మాత్రం ఉన్నాయి: అత్యవసర పరిస్థితి వి«ధించినప్పుడు ఇందిరాగాంధీ జారీ చేసిన ఆర్డినెన్స్ను ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చదవకుండానే సంతకం చేశారు. ఇంకొక ఉదాహరణ– జ్ఞానీ జైల్సింగ్ పదవీకాలం చివరి అంకంలో నాటి ప్రధాని రాజీవ్గాంధీకి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి రాష్ట్రపతి భవన్ను కేంద్రంగా అనుమతిం చడం. అదే సమయంలో ఒక అత్యంత సాధారణ పౌరుడు కూడా ఆ అత్యున్నత పదవికి ఎదగవచ్చునని ఆయనతోనే వెల్లడైంది. కలకాలం గుర్తు పెట్టుకోవలసిన రాష్ట్రపతులు, ఎంతమాత్రం గుర్తుంచుకోనవసరంలేని కొందరు రాష్ట్రపతుల హయాముల మధ్య తేడాను ప్రత్యేకంగా పరీక్షిస్తే వాటి నడుమ చాలా వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇందుకోసం మనం మరీ యాభయ్యో దశకం, లేదా అరవయ్యో దశకం వరకూ కూడా వెళ్లనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులను పాతరేయడానికీ, పార్టీని చీల్చడానికీ ఇందిరాగాంధీ ఆడిన చదరంగంలో పావుగా ఉపయోగపడ్డ వీవీ గిరిని ఇప్పుడు యాభయ్యో పడిలో ఉన్నవారు ఎవరూ గుర్తు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆయన పూర్తికాలం ఆ పదవిలో కొనసాగారు కూడా. కానీ కొన్ని చేదువాస్తవాల కారణంగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను మాత్రం మనం గుర్తు చేసుకుంటాం. అద్భుత వ్యంగ్య చిత్రకారుడు అబూ అబ్రహాం వేసిన కార్టూన్ ఫక్రుద్దీన్ అంటే ఏమిటో మా తరానికి బాగా అవగాహనకు తెచ్చింది. ఆ వ్యంగ్య చిత్రంలో గుండెల నిండా రోమాలతో స్నానాల తొట్టెలో ఉన్న ఫక్రుద్దీన్ సంతకం చేసిన ఒక పత్రాన్నీ, కలాన్నీ తన వద్ద పనిచేసే సిబ్బందిలో ఒకరికి తిరిగి ఇస్తూ ఉంటారు. అప్పుడే ఒక మాట కూడా ఆయన అంటున్నట్టు అబూ చిత్రిం చారు, ఆ మాట: ‘ఇంకా ఆర్డినెన్స్లు ఉంటే కొద్దిసేపు వేచి ఉండమని చెప్పు!’. ఎగరేసిన కీర్తిపతాకాలు మరోపక్క గుర్తుండిపోయే విధంగా వ్యవహరించిన వారిలో అబ్దుల్కలామ్ ఉంటారు. బిహార్ విషయంలో ఆయన జోక్యం, కొలీజియం ఉన్నప్పటికీ న్యాయమూర్తుల నియామకాలలో జరిగిన మతలబుల విషయంలో కలగచేసుకోవడం గుర్తుండే విషయాలు. అలాగే గుజరాత్ అల్లర్ల అనంతర వాతావరణం మీద, ఆపరేషన్ పరాక్రమ్ తరువాత పరిస్థితుల మీద కలామ్ ప్రభావం పరోక్షంగా ఎంతో ఉంది. రోజువారీ వేతనాలతో నడిచినట్టు, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్న కాలంలో కూడా రాష్ట్రపతి వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరించవచ్చునో చూపి నమ్మకం కలిగించిన వారు ఆర్. వెంకట్రామన్, శంకర్దయాళ్ శర్మ. రాష్ట్రపతి పదవికి ఉండే మే«ధోపరమైన, నైతికమైన స్థాయిని తిరిగి నిలబెట్టిన వారు కేఆర్ నారాయణన్. ఆ విషయంలో కేఆర్ రాధాకృష్ణన్ హయాంను గుర్తుకు తెచ్చారు. కృతజ్ఞతాభావంతో, ప్రేమతో మనం గుర్తు చేసుకున్న రాష్ట్రపతుల హయాంలకు, మనం మరచిపోయిన రాష్ట్రపతులకు, మరచిపోవడమే మంచి దనిపించేవారి మధ్య ఉన్న తేడా ఏమిటి? మన రాష్ట్రపతి పదవి చరిత్రను పరిశీలిస్తే విద్యార్హతలకీ, రాజకీయ నేపథ్యానికీ, కులమతాలకీ, సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి పదవిని చేపట్టబోయే వారి పనితీరు, ముద్రలను కరిక్యులమ్ వీటా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉంది, అది ఊహకి అతీతమైన లక్షణం: అదే స్థాయి. కలామ్, వెంకట్రామన్, నారాయణన్లకు అలాంటి స్థాయి ఉంది. వీవీ గిరి, ఫక్రుద్దీన్, ప్రతిభా పాటిల్కు అలాంటి స్థాయి లేదు. కోవింద్ గురించి ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఉంటే కనక ఎంతటి ఉన్నతి పదవిలోకైనా వెళ్లవచ్చు. అయితే కరిక్యులమ్ వీటా ఉన్నతమైనదా, కాదా అన్న విషయంతో నిమిత్తం లేకుండా ఆ అత్యున్నత పదవికి తగిన స్థాయిని పెంపొందించుకోవడమే ఎవరికైనా పెద్ద సవాలు. మన రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి రాష్ట్రాల గవర్నర్ పదవి కంటే కూడా అప్రాధాన్యమైనది, నామమాత్రమైనది. రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో అయినా గవర్నర్ వాస్తవంగా కొన్ని అధికారాలను చలాయించగలుగుతారు. రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతి హోదాను గణతంత్ర రాజ్యానికి ప్రతీకగా, వైభవానికి చిహ్నంగా భావించారు.అయితే కోవింద్ గురించి ముందే మనం ఒక అభిప్రాయానికి రాకూడదు. ఏమో, ఆయన సంశయవాదులందరినీ విస్మయపరుస్తారేమో! తాజాకలం: జ్ఞానీ జైల్సింగ్ గురించి అంతగా నచ్చని విషయాలు కొన్ని ముచ్చటించుకున్న తరువాత, ఆయన తెలివితేటలు ఎలాంటివో సరసత, రాజకీయ చతురత ఎంతటివో చెప్పే ఒక ఘట్టాన్ని గుర్తు చేసుకోవడం కూడా న్యాయంగా ఉంటుంది. 1987 ఫిబ్రవరిలో నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్హక్ క్రికెట్ మ్యాచ్ వీక్షించే మిషతో భారత్కు వచ్చారు. ఆ సందర్భంలోనే జైల్సింగ్ను ఆయన కలుసుకున్నారు. అప్పుడే, ‘తనకూ ఒక ప్రధానమంత్రి ఉండేవారని (జునేజో), ఆయన రాష్ట్రపతి జైల్సింగ్ వలెనే ఉత్సవ విగ్రహం వంటివార’ంటూ పంజాబీలో జియా ఒక జోక్ పేల్చారు. ‘అయితే చిన్న తేడా ఉంది జియా గారూ!’ అంటూ జైల్సింగ్, ‘నా పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందో నాకు కచ్చితంగా తెలుసు. కానీ మీరు ఎంతకాలం ఉండదలుచుకుంటే అంతకాలం పదవిలోనే కొనసాగవచ్చు’ అన్నారు. జైల్సింగ్ ఐదేళ్లు ముగియగానే పదవీవిరమణ చేశారు. తరువాత జియా ఒక సంవత్సరం వరకు పదవిలో ఉన్నారు–సి–130తో ఆయన ఖర్మ కాలేదాకా. శేఖర్ గుప్తా twitter@shekargupta
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement