breaking news
Premier Hospital
-
Hyderabad: 15 రోజులకు రూ.16 లక్షలు వసూల్.. అయినా దక్కని ప్రాణం
సాక్షి, హైదరాబాద్: మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి వద్ద రూ.16 లక్షలు వసూలు చేసి ఆస్పత్రి వైద్యులు అతనికి మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. సబ్జి మండికి చెందిన జై కిషన్ గంగపుత్ర (54) గుండెనొప్పితో 15 రోజులు క్రితం ఆసుపత్రికి రాగా.. ట్రీట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. అయినా సరైన వైద్యం అందించక పోవడంతో అతను చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జై కిషన్ భార్య రాజ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అతని ఆకస్మిక మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తక్షణమే ప్రభుత్వం, మంత్రులు , పోలీసులు స్పందించి ప్రీమియర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే! -
స్వైన్ఫ్లూ బాధితుడికి వైద్యాధికారుల పరామర్శ
మొయినాబాద్: స్వైన్ఫ్లూ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతును గురువారం వైద్యాధికారులు పరామర్శించారు. అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించారు. మొయినాబాద్కు చెందిన రైతు మహ్మద్ ఆసీఫ్(29) స్వైన్ఫ్లూ వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రిమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం పత్రికల ద్వారా విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల క్లస్టర్ ఎస్పీహెచ్ఓ చెంచయ్య తమ సిబ్బందితో కలిసి గురువారం ఆస్పత్రిలో ఆసీఫ్ను పరామర్శించారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆసీఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రస్తుతం వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నారని, అతని ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నట్లు వైద్యులు చెప్పారని చెంచయ్య చెప్పారు. ఆసీఫ్ ఇంటి పరిసరాలు పరిశీలన మొయినాబాద్ పీహెచ్సీ సిబ్బందితో ఎస్పీహెచ్ఓ చెంచయ్య బాధితుడు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ప్రయాణం చేసే సందర్భాల్లో కూడా స్వైన్ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆసీఫ్ కుటుంబీకులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, వారికి ముందు జాగ్రత్తగా వ్యాధి నివారణ మాత్రలు అందజేస్తామని ఎస్పీహెచ్ఓ చెంచయ్య చెప్పారు. అధిక జ్వరం, దగ్గు, నీరసంగా ఉన్నట్లైతే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎస్పీహెచ్ఓ చెంచయ్యతో పాటు సీహెచ్ఓ డోరకమ్మ, హెల్త్ సూపర్వైజర్ నీరజ, ఏఎన్ఎం శోభ ఉన్నారు. గ్రామస్తుల ఆందోళన... మొయినాబాద్కు చెందిన రైతు ఆసీఫ్కు స్వైన్ఫ్లూ సోకిందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడం.. వాతవరణంలో మార్పులు రావడంతో వ్యాధి వ్యాపిస్తుందేమోనని భయపడుతున్నారు.