breaking news
pregenents
-
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మహిళల్లో, యువతుల్లో ఐరన్ లోపం సమస్య ఆందోళన రేపుతోంది.కానీ దీని గురించిపెద్దగా పట్టించుకోరు. తాజా లెక్కల ప్రకారం 90శాతం యువతులు ఇప్పటికీ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ టెక్నికల్ హెడ్, చీఫ్ పాథాలజిస్ట్ అపోలో డయాగ్నోస్టిక్స్ డాక్టర్ రాజేష్ బెంద్రే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. సమతులం ఆహారం, సప్లిమెంట్లపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణమన్నారు. ఐరన్తో కూడిన ఆహార వనరులు, ఆహార అవసరాలపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్ పేర్కొన్నారు. ఐరన్ లోపం, లక్షణాలు ► ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో పెరుగుదల లోపాలు కనిపిస్తాయి. అనీమియా వస్తుంది. ► తలనొప్పి, విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీలు కూడా ఇనుము లోపంతో బాధపడుతున్నారు. ►దాదాపు 50-60 శాతం మంది గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ► ఐరన్ లోపం పిండం ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని సమస్యలొస్తే ఇబ్బంది అవుతుంది. ► హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, రక్తహీనత, బలహీనత, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి ఐరన్ లోపం అనేది అనేక రోగాలకు పెట్టు. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండాలంటే సప్లిమెంట్లతో పాటు, పల్లీలు బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు, బచ్చలికూర, కొత్తిమీర పప్పులు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజల్లో బీన్స్, బఠానీల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. గుమ్మడి గింజల్లో ఐరన్ మాత్రమే కాదు విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. బ్రకోలి: బ్రకోలిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మన ఆహారంలో చేర్చుకోవాలి. టోఫూ: సోయా నుంచి తయారు చేసే పన్నీర్ టోఫు. ఇందులో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా. థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చేపలు: చేపల్లో ఐరన్తోపాటు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా ఉండేందుకు ,మెరుగైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దోహదపడతాయి. నట్స్ అండ్ ఫ్రూట్స్: బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి. -
Ayodhya: గర్భిణిల ఎదురుచూపు.. బాలుడైతే..
సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది. మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యానికి అభయం.. ‘కిల్కారీ’కి శ్రీకారం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు ‘కిల్కారీ’ పేరిట ఆడియో కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల మొబైల్కు డాక్టర్ అనిత అనే కల్పిత వైద్యురాలి వాయిస్తో ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన పోషకాహారం, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు వంటి అంశాలను వివరిస్తారు. ఈ సందేశాలు గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. వారిలో తలెత్తే ఎన్నో సందేహాలను నివృత్తి చేసే విధంగా వాయిస్ సందేశం ఉంటుందని చెబుతున్నారు. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి.. మహిళ గర్భం దాల్చిన నాల్గవ నెల నుంచి పాలిచ్చే తల్లుల వరకు.. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకూ 72 సార్లు మొబైల్ సందేశాలు వచ్చేలా కిల్కారీ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ 0124488000 నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఒకసారి ఫోన్ ఎత్తకుండా మిస్ అయితే, ఐవీఆర్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఒకేరోజు మూడుసార్లు ఫోన్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మూడు రోజులకు రెండుసార్లు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గర్భిణులు, బాలింత కిల్కారీ నుంచి కాల్ పొందలేకపోయినా, ఆ వారాల సందేశాన్ని తిరిగి వినాలనుకున్నా ఆమె దానిని మళ్లీ వినడానికి 14423కు డయల్ చేయవచ్చు. బాలింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను వివరిస్తారు. కిల్కారీపై విస్తృత అవగాహన గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ప్రవేశ పెట్టిన కిల్కారీ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాం. ఏఎన్ఎంలు ప్రతి గర్భిణి, పాలిచ్చే తల్లులను నమోదు చేస్తుండగా, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని వారు తప్పకుండా ఆ సందేశాలు వినేలా అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఆరోగ్యం విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఇలా సమగ్ర సమాచారాన్ని కల్పిత డాక్టర్ వాయిస్తో వారికి చేరవేస్తారు. డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్వో, ఎన్టీఆర్ జిల్లా -
తెలంగాణ: పోలీస్ ఉద్యోగాల్లో గర్భిణీలకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో గర్భీణులకు శుభవార్త తెలిపింది రిక్రూట్మెంట్ బోర్డు. గర్బీణిలకు ఈవెంట్స్ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బదులుగా గర్భీణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది బోర్డు. అయితే.. మెయిన్స్ పాసైతే నెలరోజుల్లో ఈవెంట్స్లో పాల్గొనాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రసవం సమయంలో మాతా, శిశు మరణాలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీయే ప్రధాన కారణమవుతోంది. ఈ క్రమంలో మాతా, శిశు మరణాల కట్టడికి ఇప్పటికే వివిధ చర్యలు చేపడుతున్న సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి మూడు, నాలుగు రోజుల ముందే ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించడం ద్వారా వారికి మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించాలని నిర్ణయించింది. హైరిస్క్ గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలింపునకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ప్రభుత్వం 108 అంబులెన్స్ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తూ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. 2020 నుంచి ఇప్పటివరకూ 108 అంబులెన్స్లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు హాజరవగా.. ఇందులో అత్యధికంగా 19 శాతం మంది గర్భిణులు ఉండటం గమనార్హం. ఏటా రూ.12 కోట్ల వరకు.. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి ముందే పెద్దాస్పత్రులకు తరలించడం కోసం నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని వైద్య శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్లో రిజిస్టర్ అవుతుంటారు. కాగా, వీరిలో 10 శాతం మంది హైరిస్క్లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకూ హైరిస్క్ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని పీహెచ్సీలకు రాబోయే వారం రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్ గర్భిణుల సమాచారం రాష్ట్రస్థాయి నుంచి అందజేస్తారు. సమాచారం ఆధారంగా పీహెచ్సీ సిబ్బంది హైరిస్క్ గర్భిణులను డెలివరీ తేదీకి మూడు నుంచి నాలుగు రోజుల ముందే దగ్గరలోని ఏరియా, జిల్లా, అవసరాన్ని బట్టి బోధనాస్పత్రులకు తరలిస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా యాప్ను సిద్ధం చేశారు. హైరిస్క్ గర్భిణి వాహనంలో పెద్దాస్పత్రికి తరలింపు, పెద్దాస్పత్రిలో అడ్మిట్ చేయడం, ప్రసవానంతరం ఫొటోలను యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యాప్ ట్రయల్ రన్ సైతం పూర్తయింది. చిన్నచిన్న మార్పు చేర్పులను చేస్తున్నారు. అందుబాటులోకి కాల్ సెంటర్ మరోవైపు గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై వాకబు చేయడం కోసం వైద్య శాఖ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ సేవలు ప్రారంభమయ్యాయి. రెండు షిఫ్టుల్లో 80 మంది సిబ్బంది కాల్సెంటర్లో పనిచేస్తున్నారు. రాత్రివేళల్లో అత్యవసర సేవల కోసం కొందరు సిబ్బంది కాల్సెంటర్లో ఉంటున్నారు. గర్భిణులు, బాలింతలకు ఏఎన్సీ, పీఎన్సీ, ఇతర వైద్యసేవల కల్పన, చిన్నారులకు ఇమ్యునైజేషన్ వంటి ఇతర అంశాలను కాల్సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హైరిస్క్ గర్భిణులపై కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మాత, శిశు మరణాల కట్టడి కోసమే మాతా, శిశు మరణాల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హైరిస్క్ గర్భిణులపై ఫోకస్ పెంచుతున్నాం. వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రసవానికి ముందే వారిని పెద్దాస్పత్రులకు తరలించడం కోసం పీహెచ్సీలకు నిధులు మంజూరు చేయనున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
నిండు గర్భిణులకు నోట్ల కష్టాలు
దాచేపల్లి: తొమ్మిది నెలల గర్భిణికి నోట్ల కష్టలు తప్పలేదు. మరో నాలుగు రోజుల్లో డెలీవరి కావాల్సిన ఆ నిండు గర్భీణి అతికష్టం మీద నడికుడి భారతీయ స్టేట్ బ్యాంక్కు వచ్చింది. డెలీవరి కోసం అప్పుగా తెచ్చుకున్న పాత నగదు మార్చి కొత్త నగదును తీసుకునేందుకు యిరికేపల్లికి చెందిన కొదమగుండ్ల సునీత తల్లితో కలిసి బ్యాంక్కు చేరుకున్నది. తొమ్మిది నెలల గర్భిణీ అయిన సునీత మరో రెండు రోజుల్లో డెలివరీకి వెళ్లాల్సి ఉంది. ఆపరేషన్ ద్వారా మొదటì æకాన్పులో బిడ్డకు జన్మనిచ్చిన సునీత రెండో సారి గర్భం దాల్చి డెలివరీ సమయంలో అపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. భర్త మల్లికార్జునరావు వ్యవసాయ కూలీ కావటంతో డెలీవరి కోసం అవసరమైన రూ10వేల నగదును ఇతరుల వద్ద అప్పుగా తెచ్చుకున్నారు. పాత నోట్లను ఇవ్వడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంక్కు వచ్చింది. గంటల తరబడి లైన్లో నిలబడిన సునీత అలసిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారు విషయాన్ని బ్యాంక్ మేనేజర్కు చెప్పడంతో లోపలికి అనుమతిచ్చారు. తన వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంక్లో ఇచ్చి కొత్త నోట్లను తీసుకున్నారు. అపరేషన్ కోసం వెళ్లాల్సి ఉండటం వలనే తాను బ్యాంక్కు వచ్చానని, ఇబ్బందులు పడుతూ బ్యాంక్కు చేరుకున్నానని సునీత చెప్పింది. మొత్తంమీద పాతనోట్ల బాధలు నిండు గర్భీణిని కూడా వెంటాడాయి.


