-
APSRTC: ఆర్టీసీలో అదృష్టవంతులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్లవాత్మక విధాన నిర్ణయం ఆ సంస్థ ఉద్యోగులకు వరంగా మారింది. 2020, జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) ఏర్పాటు చేయడంతో తాజా పీఆర్సీ సిఫార్సుల్లో ఆ సంస్థ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం కలగనుంది. పీటీడీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కలగనున్నాయని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు పీటీడీ ఉద్యోగులకు 32 గ్రేడ్లు, 83 దశలతో కూడిన రివైజ్డ్ పే స్కేల్ను సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా... ► పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమానమైన పే స్కేల్ను కేటాయించారు. ఆర్టీసీలో 9 లేదా 18ఏళ్లు స్టాగ్నేషన్ గ్రేడ్ పే స్కేల్ డ్రా చేస్తున్నవారికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ పే స్కేల్, స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ ఐబీ / స్పెషల్ అడహాక్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ ఐబీ కేటాయించాలని సిఫార్సు చేశారు. ► ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్కేల్స్లో గ్రేడ్ 25 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రయోజనాలు అందజేస్తారు. ► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ 2020, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 2018, జూలై 1 కంటే ముందు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వేతన స్థిరీకరణ రెండు దశల్లో చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. అంటే ముందు 2018, జూలై 1నాటికి నోషనల్గా నిర్ణయించి, ఆపై 2020, జనవరి 1నాటికి పే ని మళ్లీ నిర్ణయిస్తారు. మొదటి దశ కింద 2018, జూలై 1 నాటికి 1.6శాతం ఫిట్మెంట్ ప్రయోజనాన్ని కమిషన్ సిఫార్సు చేసింది. 2018, జూలై 1 నుంచి 2020, జనవరి 1 మధ్య సర్వీసులో చేరిన ఉద్యోగుల వేతన స్థిరీకరణకు కూడా సిఫార్సు చేశారు. అన్ని ప్రయోజనాలూ జనవరి 1, 2020 నుంచి వర్తింపు.. ► పీటీడీ ఉద్యోగులకు డీఏ ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా 2020, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ► ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ) కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2020, జనవరి 1 నుంచి వర్తిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని వర్క్ స్టేషన్లలోని పీటీడీ ఉద్యోగులకు గరిష్టంగా రూ. 26వేలకు లోబడి 30శాతం హెచ్ఆర్ఏ సిఫార్సు చేశారు. ► సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని వర్క్ స్టేషన్లలోని పీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక రేట్లను సూచించింది. ► ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీటీడీ ఉద్యోగులకు కూడా ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్, కారుణ్య నియామకాల పథకం, ఏపీజీఎల్ఐ/ జీఐఎస్ బీమా రక్షణ తదితర ప్రయోజనాలను 2020, జనవరి 1 నుంచి వర్తింపజేస్తారు. ► పీటీడీ ఉద్యోగులకు పింఛన్ ప్రయోజనాల కోసం ఈపీఎస్–95 పథకంగానీ సీపీఎస్ పథకాన్నిగానీ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. సీపీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకునేవారు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే డీసీఆర్జీ పథకం కిందకు వస్తారు. ఈపీఎస్–95 పథకంలో కొనసాగాలని ఎంపిక చేసుకునేవారికి గతంలో ఏపీఎస్ఆర్టీసీ గ్రాట్యుటీ విధానంలో ప్రయోజనం కల్పిస్తారు. ► ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్జిత సెలవుల ఎన్క్యాష్మెంట్, ఈహెచ్ఎస్ కవరేజీ, మెడికల్ అలవెన్స్, వైద్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనాలు, డెత్ రిలీఫ్ తదితరమైనవన్నీ వర్తిస్తాయి. ‘అప్పటి పెన్షన్ విధానాన్ని కల్పించండి’ ఆర్టీసీ ఉద్యోగులకు 2004కు ముందు అమల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, ఐ.శ్రీనివాసరావు కోరారు. ఎస్ఆర్బీఎస్ను రద్దు చేసినందున 2020 జనవరి 1 తరువాత రిటైరయ్యే ఉద్యోగులకు కొంత పెన్షన్ కూడా రాని పరిస్థితి తలెత్తిందన్నారు. కాబట్టి తమకు 2004 ముందునాటి పెన్షన్ విధానాన్ని వర్తింపజేసి ఆర్థిక భద్రత కల్పించాలని సోమవారం ఓ ప్రకటనలో కోరారు. -
వైద్యుల్లో పీఆర్సీ జోష్
సాక్షి, అమరావతి: ఇటీవలి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బోధనాస్పత్రుల్లో వైద్యులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ఆస్పత్రుల్లోని వైద్యుల్లో ఆనందం వెల్లువెత్తింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ఆస్పత్రుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి వైద్యులు క్షీరాభిõÙకం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఫొటో ముందు కేక్లు కట్చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 110 శాతం, అసోసియేట్లకు 60 శాతం, ప్రొఫెసర్లకు 50 శాతం వరకూ వేతనం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 312 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. తమ సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీ ఇచ్చారని, మాట ఇస్తే వెనక్కి తగ్గరనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డా.జయదీర్ అన్నారు. 2016లోనే పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తాజా పీఆర్సీ వల్ల 3 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కడప రిమ్స్లో సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న వైద్యులు కోవిడ్ సేవలు.. ఆయుష్ వైద్యులకు లబ్ధి కోవిడ్ సేవల్లో భాగంగా ఆయుష్ వైద్యులను నియమించడం 300 మంది వైద్యులకు లబ్ధి జరిగిందని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయుష్ వైద్యుల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయుష్ వైద్యులకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని సీఎంకు విన్నవించింది. -
ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్థిరీకరణలో కీలకమైన ఇంటి అద్దె భత్యానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆర్థిక శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటివరకు మూల వేతనంలో 8 శాతం లేదా గరిష్టంగా నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంటి అద్దె భత్యం చెల్లించేవారు. అయితే ఇకపై పదో పీఆర్సీ సిఫార్సు ప్రకారం మూలవేతనంలో 8 శాతం లేదా గరిష్టంగా రూ.2 వేలు చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. టైపిస్టు, స్టెనోగ్రాఫర్లు, టైపిస్ట్ కం అసిస్టెంట్స్కు సంబంధించి ప్రత్యేక వేతనాల ఉత్తర్వును కూడా జారీ చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement