breaking news
Prasad Lab
-
కాశీ నేపథ్యంలో.. 'కైలాసవాస శివ'..
శివుడి అనుమతి ఉంటేనే కాశీ వెళ్లగలమని, శివతత్వాన్ని మరోసారి పాటలో ప్రతిబింబించారని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ నేతృత్వంలో రూపొందించిన ‘కైలాసవాస శివ’ పాటను నగరంలోని ప్రసాద్ ల్యాబ్ వేదికగా సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల, శ్రీనివాస్ అవసరాల, బీవీఎస్ రవి, యదువంశీ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పాట విన్నాక భావోద్వేగంతో మళ్లీ ఓసారి కాశీకి వెళ్లాలనిపించిందని భరణి అన్నారు. ఆసియాలోనే అత్యంత ప్రాచీన నగరమైన కాశీ, కాశీ సాహిత్యానికి సంబంధించి తెలుగులో మొదటిసారి ఏనుగుల వీరాస్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ను రచించారని గుర్తు చేశారు. రౌద్రానికి భిన్నంగా శాంతి సంగీతం.. కుంభమేళా జరిగిన నెల రోజులకు కాశీ వెళ్లి ఈ పాట చిత్రీకరించామని సంగీత దర్శకులు అనుదీప్ అన్నారు. శివుడి పాటలంటేనే గుర్తొచ్చే స్వరం.. విజయ్ ప్రకాశ్. ఆయనే తెలుగు, హిందీ భాషల్లో ఈ పాట పాడారు. అద్భుతమైన తెలుగు పదాలతో కిట్టు రాసిన ఈ పాట ప్రైవేట్ ఆల్బమ్స్లో పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఈ పాట నిర్మాణానికి ఎస్ఆర్డీ సంస్థ ఆర్థిక సాయం అందించింది. శివుడి పాట అంటే రౌద్రం, హై పిచ్ మ్యూజిక్ ఎక్కువ. కానీ శివుడిలోని ధ్యాన సంద్రం, శాంతిని ప్రతిబింబించేలా స్లో మెలోడీలో ఈ పాట చేశామని పేర్కొన్నారు. డైరెక్టర్ నాగ్ అర్జున్ రెడ్డి, మాలిక్రామ్, హర్షితా రెడ్డి, కమిటీ కుర్రోళ్లు సిసీ బృందం పాల్గొని సందడి చేసింది. (చదవండి: -
దర్శకుడు రాంబాబు హఠాన్మరణం
దర్శకుడు కావాలనే కలతో చిత్రపరిశ్రమకి వచ్చి, ఆ అవకాశం అందుకుని ఓ సినిమా తెరకెక్కించి, ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి అని సంతోషించేలోపే విషాదం నెలకొంది. తాను ఎంతో కష్టపడి తెరకెక్కించిన ‘బ్రహ్మాండ’ సినిమా ప్రివ్యూ చూస్తూ దర్శకుడు రాంబాబు హఠాన్మరణం చెందారు. ఆమని, బన్నీ రాజు, జయరామ్, కనికా వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బ్రహ్మాండ’. ఈ సినిమా ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో దాసరి సురేష్, దాసరి మమత నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో మంగళవారం రాత్రి యూనిట్ చూస్తుండగా హఠాత్తుగా పడిపోయారట రాంబాబు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్తో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల చిత్ర యూనిట్తో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం రాంబాబు అంత్యక్రియలు జరిగాయి. -
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ సినిమా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ `గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి.ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం`అన్నారు. `రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను`అన్నారు ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ..`ఈ సినిమా కోసం రాజు, రమేష్చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్పుట్ ఇవ్వడం కష్టం. గ్రే మంచి సినిమా అవుతుందని నమ్ము తున్నాను. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ`అన్నారు. -
'అజాత శత్రువు' వెబ్ సిరీస్ టీజర్ లాంచ్ ఫోటోలు..
-
రాడాన్ లఘు చిత్ర అవార్డుల ప్రదానం
రాడాన్ లఘు చిత్రాల అవార్డుల వేడుక బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది.జాతీయ,అంతర్జాతీయ స్థాయికి చెందిన పలు లఘు చిత్రాలు పోటీలో పాల్గొనడం విశేషం. నటి రాధిక శరత్కుమార్ కూతురు రెయాన్ నిర్వహించిన ఈ లఘు చిత్ర పోటీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.ఈ పోటీలో దర్శకుడు వివేక్ ఇళంగోవన్ దర్శకత్వం వహించిన ఓడమ్ అనే లఘు చిత్రం టైటిల్ విన్నర్గా నిలిచింది.దీనికి రూ 1.5 లక్షల నగదు బహుమతిని అందించారు.కాగా అంజలి పద్మనాభన్ దర్శకత్వం వహించిన నిళల్ షార్ట్ ఫిలిం రన్నరప్ టైటిల్ను గెలుచుకుంది. దీనికి 75 వేల నగదు బహుమతిని అందించారు. వీటితో పాటు జీకే దర్శకత్వం వహించిన అస్సారి చిత్రం, వివేక్ మనో తడై,అంజలి ఇరుదివరై చిత్రాలు వరుసగా ప్రధమ,ద్వితీయ,తృతీయ అవార్డులను గెలుచుకున్నాయి.ఈ కార్యక్రమంలో నటుడు శరత్కుమార్,రాధిక శరత్కుమార్,దర్శకుడు కే. భాగ్యరాజ్,కార్తీక్ సుబ్బరాజ్, నటుడు ఆర్య,సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సినీ ప్రముఖులు పాల్గొని విజేతలకు అవార్డులను అందించారు.ఆ పోటీల్లో అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకులను సినీ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకురాలు రెయాన్ వెల్లడించారు.