breaking news
praja garjana meeting
-
బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన
Updates.. పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ►నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. ►తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. ►రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. ►చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. ►దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. ►మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. ►ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. ►మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం. ►తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. ►2014కు ముందు కేవలం 2500 కి.మీ నేషనల్ హైవేలున్నాయి. ►మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. ►తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. ►తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ►చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. ►తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. ►పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ►నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. ►అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. ►రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. ►పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ►ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం. ►2014కు ముందు కాంగ్రెస్ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ►రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. ►కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. ►అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. ►రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. ►రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించాం. ►రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ►బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ►పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ►పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ►పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. ►తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం కేసీఆర్పై కిషన్రెడ్డి ఫైర్.. ►పాలమూరు సభలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ శ్రేణుల తరఫున ప్రధానికి స్వాగతం. పాలమూరు ప్రజాగర్జున తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని గర్జన. గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో గర్వపడుతున్నాను. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడం ఆనందంగా ఉంది. పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు ప్రకటన చారిత్రాత్మకం. తెలంగాణలో చాలా మంది రైతులు పసుపు పండిస్తారు. పసుపు బోర్డు ప్రకటించిన మోదీకి కృతజ్ఞతలు. అనేక ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్కు తీరిక లేదు. కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. కేసీఆర్ లాంటి మోసపూరిత సీఎంను ఎక్కడా చూడలేదు. ►త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఎలాంటి ప్రభుత్వం ఉందో మీకు తెలుసు. కేసీఆర్ ఫామ్హౌస్లో ఉంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా.. మాకేం ఇచ్చారు.. మా ఫామ్హౌస్కు ఏమిచ్చారు? అన్నట్టుగా వారు తీరు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటు వేసినట్టే. బీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్కు వేసినట్టే. కాబట్టి బీజేపీకి ఓటు వేయండి. ►పాలమూరుకు చేరుకున్న ప్రధాని మోదీ. ►కాసేపట్లో ప్రజాగర్జన బహిరంగ సభలో మోదీ ప్రసగించనున్నారు. ►ఓపెన్ టాప్ జీపులో పార్టీ శ్రేణులకు ప్రధాని అభివాదం. ► పాలమూరు బీజేపీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ. ►ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. ►తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ►పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ►పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. ►పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. ►సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ►జాతీయ రహదారులు, రైల్వేతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మోదీ. ►కాచిగూడ-రాయ్చూర్ మధ్య కొత్త ట్రైన్ను ప్రారంభించిన మోదీ. ►హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్లైన్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. హెచ్సీయూలో భవానాలను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ►మునీరాబాద్-మహబూబ్నగర్ ప్రాజెక్ట్లో భాగమైన జక్లేర్-కృష్ణా రైల్వే లైన్ జాతికి అంకితం. ►వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుప్థాపన ►కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రాజెక్ట్ పైప్లైన్ ప్రారంభం. ►రూ.2457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు శ్రీకారం. ►తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోంది. తెలంగాణ కోసం కేంద్రం రూ.9లక్షల కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ హయంలోనే అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. వైద్య, విద్య సెక్టార్ల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. తెలంగాణ రైల్వేల అభివృద్ధికి కూడా కేంద్రం సాయం అందించింది. రైల్వే అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున మోదీకి కృతజ్ఞతలు. ►రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం కేసీఆర్కు కలిసేందుకు సమయం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. కేంద్రం చేపట్టే పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్ రావడం లేదు. తెలంగాణలో అద్భుతమైన రహదారులు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ చుట్టూ రైల్వే లైన్ వేసేందుకు సర్వే జరుగుతోంది. ►సభా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 2:19 PM ► మహబూబ్నగర్ చేరుకున్న ప్రధాని మోదీ. 1:54 PM ►శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో మహబూబ్నగర్ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ 1:35PM ►శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్న ప్రధాని మోదీ ►ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ►ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘనస్వాగతం ►శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ పాలమూరుకు ప్రధాని ►పాలమూరు ప్రజా గర్జన సభలో మాట్లాడనున్న మోదీ ►తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు నుంచే శంఖారావం పూరించేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం ►దాదాపు 13,545 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పాలమూరు ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగసభకు ఇటు అధికార యంత్రాంగం, అటు పార్టీ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు ►ప్రధాని రాక నేపథ్యంలో మూడంచెల భారీ భద్రతతో పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పటిష్ట చర్యలు 2 లక్షల మంది జనసమీకరణ సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి దాదాపు రెండు లక్షల మందిని తరలించేలా బీజేపీ నేతలు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి తదితరులు మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి జనసమీకరణపై పలువురి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనాలను తరలించేలా వాహనాలను సమకూర్చారు. ‘పాలమూరు’పైనే సర్వత్రా ఆసక్తి.. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండో సారి పాలమూరుకు వస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆయన మహబూబ్నగర్లో నిర్వహించిన భారీ బహిరంగసభకు హాజరయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎలక్షన్లకు ముందుగా ఆయన ఎన్నికల శంఖారావం పూరించేందుకు పాలమూరును ఎంచుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకోగా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై ఆయన ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించకుండా, కృష్ణానదిలో వాటా తేల్చకుండా మోసం చేశారని అధికార బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారు.. వరాలు కురిపిస్తారా.. అనే చర్చ జోరుగా సాగుతోంది. షెడ్యూల్ ఇలా.. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్నగర్కు చేరుకోనున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధి అమిస్తాపూర్లోని ఐటీఐ కళాశాల మైదానంలో సుమారు 26 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ వద్ద ముందుగా రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్లకు సంబంధించి వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గుజరాత్ నుంచి వచ్చిన ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రెండో వేదిక వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్కి ఎక్కడిది?
సాక్షి, చేవెళ్ల: కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, అందుకే.. ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటిస్తోంది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. చేవెళ్లలో శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్పై ప్రకటన చేశారు. ప్రజాగర్జన సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సభకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. అనంతరం డిక్లరేషన్కు సంబంధించిన పోస్టర్లను వేదిక మీద ఉన్న నేతలంతా ప్రదర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో కీలకాంశాలు ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు. ►పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షలు సాయం ►పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం ►ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ►ప్రతి కార్పొరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు ►మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు ► దళిత గిరిజన విద్యార్థులకు పది పాస్ అయితే రూ. 10 వేలు. ► డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 25 వేలు. ► పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందజేత. ► అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు అధికారంలోకి వస్తే.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తాం. అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వాటాల ద్వారా న్యాయం చేస్తాం’’ వెల్లడించారాయన. రేపు అమిత్ షా వస్తారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రజా గర్జన వేదిక నుంచి ప్రసంగించిన ఖర్గే.. ► తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుంది. ఉద్యమంలో అనేక మంది భాగస్వామ్యం అయ్యారు. కానీ, తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది(కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి..). తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్కు ఎక్కడిది?. ఇది తెలంగాణ ప్రజల పోరాటం. కేసీఆర్కు బలం ఇచ్చింది మేం. కానీ, మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కానీ, తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ► ప్రజల అభీష్టం.. సొనియా గాంధీ చొరవతో తెలంగాణ ఏర్పడింది. ఇక్కడున్నవాళ్లంతా తెలంగాణ కోసం కొట్టాడినవాళ్లే. కేసీఆర్ను గద్దెదించడానికే మీరంతా వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తాం. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్జోడో యాత్ర చేశారు. అదీ కాంగ్రెస్ పార్టీ శక్తి. సీడబ్ల్యూసీ సభ్యులు మరింత పెరుగుతారు. వారిలో తెలంగాణ వారికి అవకాశాలు ఉంటాయి. గతంలో సీడబ్ల్యూసీ లో ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక్కరే ఉండేవారు. నేను వచ్చాక ఆరుగురికి ఛాన్స్ ఇచ్చాను. సీడబ్ల్యూసీ లో 66 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. ► రేపు అమిత్ షా ఖమ్మం వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని అంటారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసిందెవరు? కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశంలో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది ఎవరు?. ఉమ్మడి ఏపిలో కట్టిన ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్రశ్నించారు ఖర్గే. ► బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే నేరుగా బీఆర్ఎస్ను విమర్శించరు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం లాక్కున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వాళ్ళకే ఇస్తాం. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు. బీజేపీకి మద్దతు ఇస్తాడు. మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్ ని సైతం గద్దె దించుతాం. ► కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి.. అమలు చేస్తున్నాం. తెలంగాణలోనూ అదే చేస్తాం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతుంది అని ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడగొట్టండి. దేశంలో మోదీని ఓడగొట్టండి అని ఖర్గే చేవెళ్ల వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రజా గర్జన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉక్కు ప్రజాగర్జనకు పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాగర్జన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. విశాఖ గర్జన సభలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొననున్నారు. -
సీఎం సమైక్యవాది కాదు వల్లకాడు వాది
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాదు వల్లకాడు వాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ఎద్దేవా చేశారు. సచివాలయంలో ఆయన ఓవర్టైం డ్యూటీ చేస్తూ జీవోలపై పెన్నుతో బ్యాటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు విభజనకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. తాడేపల్లి గూడెంలో శనివారం నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభలోనైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యమన్న మాట పలుకుతారని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజనను సాక్షాత్తూ చంద్రబాబే కోరుకుంటుంటే ఆ పార్టీ నేతలు మాత్రం దేశంలో ఎందుకు కలిసుండాలని మాట్లాడటం దారుణమని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి బయటకు రండి అంటు రాష్ట్ర సమైక్యాన్ని కోరుకుంటున్న టీడీపీ నేతలకు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అడ్డగోలు నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీలతో సమైక్యానికి అనుకూలంగా ఓటు వేసేలా విప్ జారీ చేయాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.