breaking news
Power Office
-
నాణ్యమైన సేవల కోసం.. పనివేళల్లో సెల్ఫోన్ కట్!
సాక్షి, అమరావతి: విద్యుత్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అదేపనిగా సెల్ఫోన్లు ఉపయోగిస్తూ పని గంటలు వృథా చేస్తున్నారని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎండీ.. కార్యాలయాల పని వేళల్లో సెల్ఫోన్లు వాడొద్దంటూ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయిలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఇవే నిబంధనలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూపరింటెండెంట్ ఇంజినీర్లను ఆదేశించారు. ఇటీవల ఏపీసీపీడీసీఎల్ సీఎండీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడిన అంశాలను.. వాయిస్ రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీనిపై సీఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలతో పాటు కార్యాలయాల పనివేళల్లో సెల్ఫోన్లను విపరీతంగా ఉపయోగించడం వల్ల సంస్థ పనితీరుకు, అంతర్గత భద్రతకు, గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముందని సీఎండీ భావించారు. అక్టోబరు 1 నుంచి పనివేళల్లో సెల్ఫోన్ వాడకూడదనే నిబంధనను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నుంచి ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తమ ఫోన్లను సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలి. భోజన విరామ సమయంలో ఫోన్లు వాడుకునే అవకాశమిచ్చారు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే.. ఉన్నతాధికారి ఫోన్ను ఉపయోగించుకోవచ్చు. -
అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించగలరా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు అధికా ర పార్టీ అధ్యక్షుడిని చేయగలరా? అని హైకోర్టు బుధవారం పోలీసులను ప్రశ్నించింది. రేవంత్ అరెస్టు విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోలేదని వ్యాఖ్యానించింది. రేవంత్తో ముఖ్యమంత్రి సభకు ఇబ్బంది కలుగుతుందని భావించినప్పుడు అతన్ని గృహ నిర్బంధం చేసి ఉండొచ్చునని, గడప దాటరాదని ఆంక్షలు విధించి ఉండొచ్చునని పేర్కొంది. చట్టం నిర్దేశించిన విధి విధానాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అభ్యంతరకరమని పేర్కొంది. టీఆర్ఎస్ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) పంపిన లేఖపై కూడా రజత్కుమార్ సంతకం లేకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రేవంత్ నిర్బంధానికి దారి తీసిన పరిస్థితులు, నిఘా నివేదికలు, తేదీలు తదితర అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, గడువునివ్వాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ పదే పదే అభ్యర్థించడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ హాజరయ్యేలా చూడండి... సీఎం సభను జరగనివ్వనని రేవంత్ ప్రకటించారని, అల్లరిమూకలను పంపి ఘర్షణలు సృష్టించాలన్నది ఆయన వ్యూహమని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని ఏజీ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పంది స్తూ, అధికార పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ సభలను జరగనివ్వనని చెబితే ఆ కారణంతో పోలీసులు నిర్బంధించగలరా? చట్టం ముందూ అందరూ సమానమేనంటూ అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించే తెగువ పోలీసులకు ఉందా అని ప్రశ్నించింది. రేవం త్ని అర్ధరాత్రి నిర్బంధించాలని ఎస్పీకి ఎవరు చెప్పారని, డీజీపీ అటువంటి ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము స్వయంగా డీజీ పీ నుంచి స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నామంది. మధ్యాహ్నం 2.15కి తమ ముందు డీజీపీ హాజరయ్యే లా చూడాలని ఏజీకి ధర్మాసనం పేర్కొంది. నోట్ ఫైళ్లపైనే సంతకాలు, సీలు.. మొదట సరేనన్న ఏజీ, ఆ తరువాత డీజీపీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. కోర్టు ఆదేశించిన తరువాత ఆయన ఎక్కడున్నా కూడా తమ ముందు హాజరు కావాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో డీజీపీ మహేందర్రెడ్డి కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం నేరుగా డీజీపీ నుంచి కొన్ని వివరణలు అడిగింది. టీఆర్ఎస్ ఫిర్యా దు మేరకు తెలంగాణ సీఈవో తమకు లేఖ రాశారని, కొడంగల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని కోరారని, దీనిలో భాగం గానే చర్యలు తీసుకున్నామని డీజీపీ చెప్పారు. నిఘా అధికారులు, ఎస్పీకి మధ్య జరిగిన సంప్రదింపుల డాక్యుమెంట్లపై తేదీలు, సంతకాలు, ఆఫీసు సీలు లేకపోవడంపై ప్రశ్నించగా, నోట్ ఫైళ్లపై మాత్రమే సంతకాలు ఉంటాయని డీజీపీ చెప్పారు. ఈ సమాధానంపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. నిర్బంధం అక్రమమా? సక్రమమా? అన్నదే ముఖ్యం... ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, సంతకాలు లేనంత మాత్రాన ఓ డాక్యుమెంట్ తన విలువను కోల్పోదని, మిగిలిన ఇతర అంశాలను కూడా పరి గణనలోకి తీసుకోవాలని, ఈ మొత్తం వ్యవహారం పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. రేవంత్ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే విడుదల చేశామని చెప్పగా, ఇక్కడ రేవంత్ విడుదల చేశారా? లేదా? అన్నది సమస్య కాదని, అరెస్టు సక్రమమా? అక్రమమా? అన్నదే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. విచారణ జరుగుతున్నంత సేపు కోర్టు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. -
పవర్ ఆఫీసులో చెలరేగిన మంటలు
♦ అగ్నికి ఆహుతైన మరమ్మతులో ఉన్న టాన్స్ఫార్మర్స్ ♦ వాటితోపాటు ఆయిల్ డ్రమ్ములు ♦ తృటిలో తప్పిన ప్రాణాపాయం ♦ రూ.10 లక్షల మేర నష్టం ♦ {పమాద స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఎస్ఈ జయకుమార్ ఒంగోలు క్రైం : ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న పవర్ ఆఫీసులో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. పనులు ముగించుకొని సిబ్బంది 6.30 గంటలకల్లా ఉద్యోగులు బయటకొచ్చిన కొంత సేపటికే ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతు విభాగంలో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆయిల్ ఫిల్టర్ నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వాచ్మెన్ వెంటనే అక్కడున్న విద్యుత్ అధికారులకు, ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే మరమ్మతుకు సిద్ధంగా ఉన్న మూడు ట్రాన్స్ఫార్మర్లకు అంటుకున్నాయి. వాటితోపాటు ఐదు ఆయిల్ డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించాయి. ఈలోగా అగ్నిమాపక శాఖకు చెందిన రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. లేకుంటే పెను ప్రమాదమే సంభవించేది. ఎందుకంటే చుట్టూ మరమ్మతు చేసిన ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల స్క్రాప్ కూడా ఉంది. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.జయకుమార్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నష్టం ఏవిధంగా జరిగిందీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.