breaking news
power agreements
-
అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్ష
అదానీ గ్రీన్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం కిలోవాట్కు 8.2 యూఎస్ సెంట్ల చొప్పున గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విద్యుత్ ధరను యూనిట్కు 6 సెంట్ల దిగువకు తీసుకురావాలని కొత్త యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.స్థానిక బిడ్డర్లు తక్కువ యూనిట్ ధరలకు ఆఫర్ చేయడం.. ఇరవై ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధిక రేటుకు కుదుర్చుకోవాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. అధ్యక్షుడు అనురా కుమార దిస్సానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వారి ప్రస్తుత ప్రాధాన్యతలు, ఇంధన విధానాలకు అనుగుణంగా నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించింది. అయితే అదానీ గ్రూప్, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరి ప్రాజెక్ట్ను కొనసాగిస్తున్నట్లు ప్రకటన రావాల్సి ఉంది.ఇదీ చదవండి: పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్మే 2024లో ఆమోదించిన టారిఫ్ను పునఃసమీక్షించాలని శ్రీలంక కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రామాణిక సమీక్షా ప్రక్రియలో భాగమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ మొత్తం ప్రాజెక్టును సమీక్షించనుంది. అదానీ గ్రూప్ శ్రీలంక గ్రీన్ ఎనర్జీ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రద్దయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. నిబంధనలు ప్రస్తుత లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి పునరాలోచనలో ఉన్నట్లు పేర్కొంది. శ్రీలంకలో పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపింది. -
Editor Comment: కలి బాబులు కుమ్మక్కె క్యారెక్టర్ పై పుస్తున్న మరకలు
-
KSR Live Show: కరెంట్ చార్జీలు పెంచి కప్పిపుచ్చే కుట్ర.. డైవెర్షన్ లో బాబు సిద్ధహస్తుడు
-
ఏపీ చరిత్రలోనే అత్యంత తక్కువ ధరకు డీల్ కుదిరింది తమ హయాంలోనే
-
సెకి ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారాయన. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో.... 2021 సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకి అభినందించింది. యూనిట్కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ ఇది... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్ ఇంటెన్సివ్ ఇస్తానంది. ఇక్కడ.. యూనిట్ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి... ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.ఇంకా జగన్ ఏమన్నారంటే.. 👉ఆరోజుల్లో దాదాపు 18 లక్షల పంప్సెట్లు. దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు రూ.9 వేల కోట్ల ఖర్చు.అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే.. విద్యుత్ రంగం దారుణం. డిస్కమ్లు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. డిస్కమ్ల పరిస్థితి చూస్తే, చంద్రబాబు రాకముందు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88 శాతం సీఏజీఆర్. డిస్కమ్ల నష్ట పరిస్థితి.ప్రభుత్వం నుంచి డిస్కమ్లకు సపోర్టు చూస్తే.. రూ.13255 కోట్లు మాత్రమే చేయగా, మా ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు. ఆ విద్యుత్ను 20 ఏళ్లపాటు ఉచితంగా ఇచ్చేలా, ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.👉టెండర్లు. చంద్రగ్రహణం2020 నవంబర్ లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సోలార్ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరాకు ఎన్టీపీసీ వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి, రకరకాల పద్ధతుల్లో కోర్టుల్లో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి.2020 నవంబరులో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి, ఆ తర్వాత వివిధ కోర్టుల్లో దీని కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.👉సెకి లేఖ రాక. తీపి కబురు2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే..6400 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర రూ.2.49 చూశాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కమ్ల మీద భారం తగ్గిస్తూ, రైతులను ఆదుకుంటున్న విధానాన్ని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, ఆ విద్యుత్ను తామే రూ.2.49కే ఇస్తామని సెకి వెల్లడించింది.అంతే కాకుండా, వారు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక స్పెషల్ ఇన్సెంటివ్గా.. ఐఎస్టీఎస్ (ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్)ను 25 ఏళ్లపాటు రద్దు చేస్తామని వెల్లడించారు.అలా 2026 నాటికి మొత్తం మీద 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని సెకి వివరించింది.👉నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ లెటర్లో టేక్ ఎవేస్ చూస్తే..కేంద్ర సంస్థ సెకితో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం.యూనిట్ రూ.2.49కే. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్.ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఐఎస్టీఎస్ (ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్) ఉండదు. ఇది స్పెషల్ ఇన్సెంటివ్గా ఇస్తున్నామని చెప్పడం. 👉సంపద సృష్టి అంటే ఏమిటి? మీరే చెప్పండి:గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.10. అదే మనకు 17 వేల మిలియన్ యూనిట్లు కేవలం రూ.2.49కే ఇవ్వడానికి కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది.అంటే ఒక్కో యూనిట్ ధర ఇక్కడ రూ.2.60 తగ్గింది. దీని వల్ల ఏటా రూ.4400 కోట్లు. 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా?👉అలాంటి ఆఫర్ కాదంటే.. కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే.. అతి తక్కువ ధరకు విద్యుత్. ఐఎస్టీఎస్ మాఫీ. 25 ఏళ్లలో మీకు లక్ష కోట్లకు పైగా ఆదా. రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే..అలాంటి లెటర్ను పక్కన పెడితే, మీరంతా నన్ను ఏమనేవారు? ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమని విమర్శించేవారు. ఆలోచన చేయమని కోరుతున్నాను. రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే, బురద చల్లుతున్నారు. వారు చేస్తోంది ధర్మమేనా? మనమంతా అడగాలి. చంద్రబాబుకు అన్నీ తెలుసు. అయినా ఆయనే ఆ నింద వేస్తున్నారు.రూ.2.49కే యూనిట్ పవర్. ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సా«ధ్యమైంది. అది చరిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుబడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు.👉చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లుచంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014ృ19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు గమనిస్తే.. రూ.4.84 నుంచి రూ.4.83 వరకు ఉన్నాయి. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్ కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఏ చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. రూ.5.25 నుంచి 6.99 మధ్య ఒప్పందం చేసుకున్నారు.2015లో రూ.5.96 కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50 కి కొనుగోలు చేశారు. ఆయన సోలార్ ఎనర్జీని యావరేజ్ గా రూ.5.90కి కొనుగోలు చేశారు.👉అతి తక్కువ రేట్కు పీపీఏ చేయడం తప్పా?: చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90. మరి నేను రూ.2.49కు అంటే చంద్రబాబు పెట్టిన దానిలో సగం రేటుకు కొనుగోలు చేస్తే.. చీపెస్ట్ రేట్ కి పవర్ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే.. ఐఎస్ టీ ఎస్ చార్జెస్ మాఫీ చేస్తామని చెబితే.. నేను స్పందించకపోయి ఉంటే నన్ను మీరేమని ఏమనేవారు?.స్పందించిన నేను మంచి వాడినా.. అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచి వాడా?👉ఎవరికి సంపద సృష్టి. ఎవరికి ఆవిరి?:చంద్రబాబు హయాంలో సంపద ఎలా ఎరోడ్ (ఆవిరైపోయిందో) అయిందో చెబుతాను.చంద్రబాబు సోలార్, విండ్ పీపీఏలను వైయస్సార్ సీపీ చేసుకున్న సోలార్ ఒప్పందంతో పోలిస్తే.. అవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్న భారం.. రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఇది. ఇదే మాదిరిగా చూస్తే.. 3500 విండ్ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్ మనం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్ యూనిట్లు..అంటే రూ.2.35 ఇంటూ 9000 మిలియన్ సంవత్సరానికి రూ.2వేల కోట్లు.. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం.సోలార్ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లు ఆయన చేసుకున్న ఒప్పందం.. యావరేజ్ ప్రైస్ రూ.5.90.అదే మేము ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే రూ.3.41 ఆయన చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట ప్రభుత్వం అదనంగా కట్టాలి కదా? 2400 మెగావాట్లు అంటే.. 4200 మిలియన్ యూనిట్లు ఇంటూ రూ.3.41. ఏడాదికి 1500 కోట్లు సంవత్సరానికి భారం పడుతుంది. 1500 కోట్లు ఇంటూ 25 ఏళ్లు అంటే.. 37500 కోట్లు.. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుంటే.. చంద్రబాబు చేసుకున్న సోలార్, విండ్ ఒప్పందాల వల్ల.. 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. తేడా గమనించండి.👉సెకి లేఖ. పరిణామాలు. ఒప్పందం:సెకి నుంచి 2021, సెప్టెంబరు 15న లేఖ రాగా, ఇటువంటి మంచి ఆఫర్ రావడంతో, ఆ మర్నాడే క్యాబినెట్ మీటింగ్ ఉండగా, దాన్ని టేబుల్ ఐటెం కింద పెట్టాం. అంటే సెప్టెంబరు 16న క్యాబినెట్లో చర్చించాం. ృ ఎనర్జీ శాఖ అన్నీ అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాదాపు 40 రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన ఇంధనశాఖ కమిటీ, 2021, అక్టోబరు 25న నివేదిక సమర్పించారు.ఆ తర్వాత అక్టోబరు 28న క్యాబినెట్ జరగ్గా, ఆ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత క్యాబినెట్ ఏం చెప్పిందంటే, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోవాలని నిర్దేశించి, ఆమోదం తెలిపింది.ఆ తర్వాత నవంబరు 11న ఏపీఈఆర్సీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్రమంలో డిసెంబరు 1, 2021న ప్రభుత్వం, సెకి మధ్య పవర్సేల్ అగ్రిమెంట్ జరిగింది.దాంట్లో ఎవరెవరు సైన్ చేశారంటే.. సెకి, రాష్ట్ర ప్రభుత్వం, నాలుగు డిస్కమ్లు సంతకాలు చేశారు. ఇక్కడ ఎక్కడా థర్డ్ పార్టీ లేదు.స్పష్టంగా చెప్పాలంటే.. అది సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్ల మధ్య జరిగిన ఒప్పందం. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది.👉ఆ ఒప్పందం కనుక చేసుకోకపోయి ఉంటే..:ఒక చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంటే.. రూ.2.49కే విద్యుత్ మన రాష్ట్రానికి దొరుకుతుంటే, ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్గా ఐఎస్టీఎస్ మాఫీ. అదెంతో తెలుసా? ఒక్కో యూనిట్కు రూ.2. అంటే ఒక్కో మెగావాట్కు నెలకు దాదాపు రూ.4 లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రూ.50 లక్షలు అన్నమాట. అంత తక్కువ ధరకు మనకు సోలార్ విద్యుత్ వచ్చింది. ఆత్మ నిర్బల్ భారత్ కింద, సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తూ, కేంద్రం మనకు ఆ ఇన్సెంటివ్ ఇచ్చింది.అంత మంచి ఆఫర్ను నేను పక్కనపడేసి ఉంటే, అదే మీరు ఏమనేవారు? 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి కాదా? నిజానికి అది ఒక రోల్మోడల్ కేసు.అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధర:ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇదే సెకి, అదే ఆత్మ నిర్బల్ భారత్ కింద.. తమిళనాడుకు కూడా విద్యుత్ సరఫరా చేసింది.చత్తీస్గడ్ రూ.2.61. ఒడిషా రూ.2.61. తమిళనాడు రూ.2.61అదే మన రాష్ట్రానికి 12 పైసలు తక్కువగా రూ.2.49కే తెస్తే, నన్ను సన్మానించాల్సింది పోయి, ఏం విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు సంపద ఆవిరి చేస్తే, నేను సృష్టించాను. మరి ధర్మం, న్యాయం ఎక్కడుంది?ఎల్లో మీడియా పిచ్చి రాతలు:ఇక ఎల్లో మీడియా రాతలు. వారికి తోడు తానా అంటే తందానా అంటూ, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన మనుషులు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ల పిచ్చి విమర్శలు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే, మనం రూ.2.49కి ఎందుకు కొన్నామని అంటున్నారు.అక్కడి పరిస్థితులు వేరు. ఇర్రేడియేషన్ స్థితి. ఎడారి ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ.కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా అతి తెలివి ప్రదర్శిస్తూ.. గుజరాత్, రాజస్థాన్లో ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఎంతో తెలుసా? యూనిట్కు రూ.1.98.మరి ఈనాడు గుజరాత్ గురించి రాశారు. అక్కడ యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.1.99 అంటున్నారు. మరి ఎక్కడ ఉత్పత్తి? ఎక్కడ వినియోగం? చూడాలి కదా?అంటే గుజరాత్లోనే ఉత్పత్తి చేసి, ఆ రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. అంటే మొత్తం అంతా రాష్ట్రంలోనే. అందుకే వారికి ఆ రేట్లు వర్తిస్తున్నాయి.వారికి అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్ వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.1.99.రాజస్థాన్లో చూస్తే, అదే స్థితి. ఉత్పత్తి, సరఫరా అంతా ఒకే రాష్ట్రంలో. అయినా ఈనాడులో అది రాయరు. కేవలం ఉత్పత్తి వ్యయం తక్కువ అని మాత్రమే చెబుతారు. అక్కడ కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు. మరి అలా రాయడం వక్రీకరణ కాదా?👉కోవిడ్ తర్వాత, తాజాగా గుజరాత్లో సెకి టెండర్లు చూస్తే.. 2024, మార్చి 15న టెండర్ల బిడ్లు చూస్తే, రూ.2.62 నుంచి రూ.2.67 వరకు ధర. అంటే గుజరాత్లోనే ఉత్పత్తి. ధర.రాజస్థాన్లో కూడా బిడ్లు చూస్తే.. దాదాపు అవే ధరలు. అంటే ప్రస్తుత రెన్యూవబుల్ ఎనర్జీ రేట్లు ఇలా ఉన్నాయి.👉ఆ లెక్కన రూ.1.50కే రావాలి కదా?:మనకు అక్కడి జనరేషన్ కాస్ట్ కంటే తక్కువకు రూ.2.49కే వచ్చాయని సంతోషపడాలి.ఈనాడులో ఏం రాశారు? ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త మోడళ్ల టీవీల ధరలు తగ్గుతాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత తగ్గాలి కదా? అంటున్నారు.ఆ ప్రకారం, ఈనాడు థియరీ ప్రకారం చూస్తే.. అదే గుజరాత్లో సోలార్ పవర్ ఇవాళ రూ.1.50కే రావాలి కదా? మరి రూ.2.67 వరకు ఎందుకు పోయింది? అంటే ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.👉మీడియా ప్రశ్నలకు సమాధానంగా..చంద్రబాబు ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే..ఎవరూ అంత తెలివి తక్కువగా ఆ పని చేయరు. అంత తక్కువ ధరకు విద్యుత్ దొరకదు. పైగా 25 ఏళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా. 2009 నుంచి చూస్తే.. రూ.3.70 మొదలు చంద్రబాబు హయాంలో రూ.6.99 వరకు చేరింది.మా హయాంలో ఒకే అగ్రిమెంట్. యూనిట్ ధర రూ.2.49.అంత తక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయలేరు. ఇది వాస్తవం.ఇంకా చెప్పాలంటే చరిత్రాత్మకం. డిస్కమ్లు కరెంటు కొంటున్నాయి. సెకి సరఫరా చేస్తోంది. మేము యూనిట్కు రూ.2.49 చొప్పున సెకికి చెల్లిస్తున్నాం. అది అప్పట్లో చాలా తక్కువ ధర. పైగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల మాఫీ. అంత మంచి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? మీరే చెప్పండి. దాని వల్ల ఏటా రూ.4400 కోట్లు ఆదా. అంటే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా. ఇది ముమ్మాటికీ సంపద సృష్టే.సెకితో ఏపీ ప్రభుత్వ ఒప్పందం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇంత మంచి చేసిన నన్ను అభినందించి సత్కరించాల్సింది పోయి.. రాళ్లు వేస్తునన్నారు. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్ అన్నారు. -
విద్యుత్ సంస్థలు లాభాల బాట: బాలినేని
సాక్షి, విజయవాడ: విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ. 70వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలను ముంచేశారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గడచిన ఏడాది కాలంలో 30 వేల కోట్ల రూపాయలపైగా ఇచ్చామని చెప్పారు. (చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. 7 వేలకుపైగా జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే మీటర్లు బిగిస్తున్నామని ఆయన వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు అంతా అవినీతిమయమేని మంత్రి బాలినేని దుయ్యబట్టారు.(చదవండి: ‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’) -
విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
సాక్షి, అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు. పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్ సబ్కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. -
సత్రం భోజనం.. పెద్దారెడ్డి రికమండేషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల ముసుగులో టీఆర్ఎస్ సర్కారు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం అక్రమాలకు తెర తీసిందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో అత్యంత అవినీతి దాగుందన్నారు. విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై శ్వేతపత్ర విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘డిస్ట్రిబ్యూషన్లకు ఐఏఎస్లను కాకుండా, కేసీఆర్ సన్నిహితులను నియమించుకున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు అబద్దాలు చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఆయనతో చర్చకు కాంగ్రెస్ సిద్ధం. గోల్మాల్ ఒప్పందాలతో ఒక సంస్థకు ప్రభుత్వం రూ. 957 కోట్లు చెల్లించింది నిజం కాదా? కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్లు సురేష్ చంద్ర, అరవింద్ కుమార్లను తప్పించింది వాస్తవం కాదా? ప్రభుత్వం ఐఏఎస్ల స్థానంలో అర్హతలేని అధికారులను నియమించడం ద్వారా తెలంగాణకు వచ్చిన లాభం ఏంటో కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్మాల్ ఒప్పందాలే. నాడు కాంగ్రెస్ ముందుచూపు నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా నేడు మిగులు విద్యుత్ సాధ్యమైంది. విద్యుత్ మిగులు, సరఫరాలో కేసీఆర్ సాధించింది శూన్యం. ఏపీలో అదనపు విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? తెలంగాణలో విద్యుత్ సరఫరా చూస్తుంటే.. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్లుంద’ని రేవంత్ ఎద్దేవా చేశారు. నీ బతుకెంటో తెలుసుకో.. కాంగ్రెస్ పార్టీని తిడుతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ముందు తన బతుకేంటో తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించారంటే తాము నమ్మలేమన్నారు. గతంలో నకిలీ అవార్డులు తీసున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వంకు ఉందని ఆరోపించారు. ఉత్తమ్కు అభినందనలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన ఉత్తమ్కుమార్ రెడ్డికి రేవంత్ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. -
'ఎమ్మెల్యేలను లాక్కోవడం అప్రజాస్వామికం'
హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం చేసే పోరాటానికి కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోఅధికార టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో కూడా కలవడానికే కూడా సిద్ధమేనన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. ప్రజల, హక్కులను, స్వేచ్ఛను హరించేవిధంగా ప్రభుత్వం వ్యవహరించరాదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాక్కోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి విధానాలతో నవతెలంగాణ నిర్మాణం జరపలేరన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని జైపాల్రెడ్డి అన్నారు.