breaking news
Ponji
-
సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్, కాగ్ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత వ్యవస్థను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్ల సూచనలలో ‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని’ విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ స్వయంప్రతిపత్తిని నిర్ధారించగలమని గమనించిన న్యాయస్థానం.. ‘చట్టబద్ధమైన హోదాను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి మరింత అధికారం కల్పించాలి.. దీని వల్ల సీబీఐపై ప్రభుత్వ పరిపాలనా నియంత్రణ లేకుండా క్రియాత్మక స్వయంప్రతిపత్తి కలుగుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులోని పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలి.. సీబీఐ డైరెక్టర్కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వబడతాయి.. డీఓపీటీ ద్వారా కాకుండా నేరుగా మంత్రి/ ప్రధాన మంత్రికి నివేదించాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, సంస్థలో మానవవనరుల కొరతతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించలేమని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ అంశంపై నెల రోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. 1941లో ఏర్పడిన సీబీఐ.. ప్రధాన మంత్రి కార్యాలయం అధీనంలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ)కు బాధ్యత వహిస్తోంది. దీని డైరెక్టర్ను ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఎంపిక చేస్తుంది. -
పోంజీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్ : పోంజీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీపై గతంలోని ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ డైరెక్టర్ రాధే శ్యామ్, బన్సీలాల్తోపాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు. పీఎమ్ఎల్ఏ(ప్రివేన్షన్ ఆఫ్ మనీ లాండరీంగ్) యాక్ట్ ద్వారా మొత్తం 261 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసి అటాచ్ చేశారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ముఖ్యంగా గృహ నిర్మాణాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నాయి. -
‘పొంజీ’ ఆపరేటర్లపై ఇక ఉక్కుపాదం!
♦ పదేళ్ల వరకూ జైలు శిక్ష... ♦ రూ. 50 కోట్ల జరిమానా కూడా... ♦ కొత్త బిల్లులో ప్రతిపాదించిన కేంద్రం న్యూఢిల్లీ: పొంజీ స్కీమ్ ఆపరేటర్లపై కొరడా ఝలిపించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ‘అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం-డిపాజిటర్ల మనోభావాల పరిరక్షణ’ ముసాయిదా బిల్లు ప్రకారం.. అక్రమ సొమ్ము డిపాజిట్ పథకాలను నడిపిస్తున్న (పొంజీ ఆపరేటర్లు) వారు రూ.50 కోట్లు జరిమానా చెల్లించడం సహా పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అన్ని అనియంత్రిత డిపాజిట్ పథకాలన్నీ కూడా డ్రాఫ్ట్ బిల్లు పరిధిలోకి వస్తాయి. నిందితుడు ఒక ఏడాది తక్కువ కాకుండా జైలు శిక్ష (ఇది ఐదేళ్ల వరకు పొడిగించొచ్చు)తోపాటు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక వ్యక్తి పదే పదే అక్రమాలకు పాల్పడితే అతను కనీసం ఐదేళ్లు (పదేళ్లకు పొడిగించొచ్చు) జైలు శిక్ష అనుభవించడంతోపాటు రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ బిల్లుపై ఏప్రిల్ 30 వరకు ప్రజాభిప్రాయాలను సేకరించనున్నది.