-
విభజన రాజకీయాల అడ్డాగా అమెరికా
అమెరికా ఇటీవలి జ్ఞాపకాల్లో కనీవినీ ఎరగనంత స్థాయిలో ఓటర్లను నిలువునా చీల్చివేసిన తాజా ఎన్నికలు దాని ముగింపును కూడా అంతే విభజనతో లిఖించేటట్లు కనబడుతోంది. ప్రపంచంలో అమెరికా స్థాయిని, దాని విలువను తగ్గించే పర్యవసానాలను ఈ విభజన తీసుకొచ్చేటట్టుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. ఫలితాల వెల్లడి ప్రారంభమైన తొలిరోజే ఏమాత్రం ఆగలేక తానే గెలిచానని ప్రకటించేసుకున్న దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థులు ఎన్నికల ఫలితాలను తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్య సుదీర్ఘకాల ఆరోగ్యం, చట్టబద్ధత గురించి తనకు ఏమాత్రం పట్టింపులేదని నిరూపించుకుంటూ వచ్చిన దేశాధ్యక్షుడు ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి తిరస్కరించడాన్ని ప్రపంచం దిగ్భ్రాంతితో చూస్తోంది. అధ్యక్షుడి అధికారాలను పక్కన బెడితే, రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ ప్రస్తుతం చలాయిస్తున్న, భవిష్యత్తులో చలాయించగల ఆధిపత్యం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లయింది. అలాగే ఆర్థికంగా, చట్టపరంగా తాను ఎదుర్కొనబోయే సమస్యలనుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ఆధిపత్య స్థాయిని ఉపయోగించే సామర్థ్యం కూడా క్షీణించిందనే చెప్పాలి. ఓటమిని ట్రంప్ హుందాగా అంగీకరించి తప్పుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైనట్లేనని చెప్పాల్సి ఉంటుంది. బ్యాలెట్లలోని ఓట్లన్నీ లెక్కించాక జో బైడెన్కే గెలుపు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తూండవచ్చు కానీ, బైడెన్ ఓడిపోతే మాత్రం డెమొక్రాటిక్ మద్దతుదారులకు అది పెనుదెబ్బ అయ్యే అవకాశం ఉంది. వీరిలో చాలామంది బైడెన్ ఓడిపోయినట్లతే మాత్రం ఈ ఎన్నికలు తమకు వ్యతిరేకంగా జరిగిన రిగ్గింగ్ ఫలితమేనని కూడా భావిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్నదాంతో పని లేకుండా, 2020వ సంవత్సరంలో ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ ప్రజాస్వామ్యం కూడా అమెరికాలాగా రాజకీయంగా ఇంతగా వేరుపడిపోయిన పాపాన పోలేదు. ఎన్నికల ఫలితాలపై ముందస్తు అంచనాలకు మించి ట్రంప్ ప్రదర్శించిన అతి చర్యలు, అమెరికా ఓటర్లలో వచ్చిన ఈ విభజనను రాజకీయ పండితుల అంచనాల వల్ల కలిగిన ఫలితంగా కాకుండా అత్యంత వ్యవస్థీకృతంగానే జరిగిన పరిణామమని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాన్ని ఇరు పక్షాల్లో ఏదీ సత్వరమే అంగీకరించబోవడం లేదన్న వాస్తవాన్ని పక్కనబెట్టి చూస్తే, ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. అమెరికా నిరంకుశ రాజ్య వ్యవస్థగా మారిపోనుంది. ఇటీవలి కాలంలో కాస్త బలహీనపడినట్లు కనబడుతున్నప్పటికీ, అమెరికాలోని ప్రజాస్వామ్య సంస్థలు క్రమక్రమంగా.. ప్రభుత్వ విధానాల్లో ప్రజల ప్రత్యక్ష ఇచ్ఛను ప్రతిఫలించే కెనడా లేక జర్మనీ తరహా నిజమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థనుంచి రానురానూ పక్కకు పోతున్నాయి. పైగా హంగరీ, టర్కీల్లాగా అమెరికా ఒక హైబ్రిడ్ రాజకీయ వ్యవస్థ దిశగా సాగిపోతోంది. ఇది పూర్తి నియంతృత్వ వ్యవస్థ అంతటి చెడ్డది కాకపోయినప్పటికీ, అమెరికా మాత్రం ఆ దశవైపే ప్రమాదకరంగా సాగిపోతోంది. అంతిమంగా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు అనేదాంతో పనిలేకుండా, గత 50 ఏళ్లతో పోల్చి చూస్తే స్వదేశంలో రాజకీయపరంగా కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఉనికి పరంగా గానీ ఎన్నడూ లేనంత బలహీనంగా అమెరికా రాజకీయ ప్రమాణాలు పడిపోయాయి. దేశీయంగా చూస్తే, రాజకీయ ప్రక్రియలు, స్వేచ్ఛా వ్యాపారం, వలస సమస్య వంటి విధానపరమైన అంశాలపై వాదనలు, చర్చలు మినహా, దేశాన్ని వేరుపర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక సోషల్ మీడియా సైతం విభిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన అమెరికన్లను విడదీసి వేరుచేసే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. దేశీయంగా ఇలా వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం అనేది.. వాతావరణ మార్పు, టెక్నాలజీ క్రమబద్ధీకరణ వంటి కీలకమైన అంశాల్లో అమెరికా ఆధిపత్యాన్ని కష్టసాధ్యం చేస్తోంది. లేదా వాణిజ్యం, భద్రత వంటి సంక్లిష్ట అంశాల్లో ఐక్య సంఘటనతో చైనాకు వ్యతిరేకంగా నిలిచే శక్తి కూడా అమెరికాలో తగ్గుముఖం పడుతోంది. చివరకు బైడెన్ అధ్యక్ష స్థానం చేజిక్కించుకున్నప్పటికీ, రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉండే సెనేట్ను తాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విదేశీ విధానంపై రాజకీయంగా ఎంత సమర్థంగా బైడెన్ వ్యవహరిస్తారన్నది ప్రశ్నార్థకమే. అమెరికా నుంచి స్ఫూర్తిదాయకమైన, రాజనీతిజ్ఞత కలిగిన ఎన్నికలకోసం తక్కిన ప్రపంచం ఎదురుచూస్తోంది. కానీ స్వదేశంలోనూ, విదేశాల్లోనూ వచ్చే నాలుగేళ్లలో అమెరికా రాజకీయాలు గత 50 ఏళ్ల కాలంలో ఉన్న స్థాయిని అందుకోవడం కాకుండా ట్రంప్ నాలుగేళ్ల పాలనలోని ఫలితాలనే సాగించేటట్టు కనబడుతోంది. -ఇయాన్ బ్రెమ్మర్, కాలమిస్ట్ -
రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలి
కొడవలూరు, న్యూస్లైన్: రాహుల్ గాంధీకీ నాయకత్వ లక్షణాలు ఉంటే దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ఉపసంహరించుకున్న విధంగా రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని వైఎస్సార్ కూడలిలో సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరాహారదీక్ష చేస్తున్న వారిని కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ మేకపాటి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీల్చాలని తలపెట్టిన ఆలోచన దుర్మార్గం అన్నారు. జగన్మోహన్రెడ్డిని 16 నెలలు జైలులో నిర్బంధించి సీబీఐ విచారణల పేరుతో కాలయాపన చే శారన్నారు. ఆయనకు బెయిలు లభిస్తే సోనియాగాంధీకి తాము కృతజ్ఞతలు చెప్పామని కొందరు మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబు లాంటి అబద్ధాల కోరు ఎవరూ లేరన్నారు. జగన్మోహన్రెడ్డిపై బురదజల్లి రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. కేంద్రానికి లేఖ ఇచ్చి సీమాంధ్రులకు అన్యాయం చేయాలని బాబు కంకణం కట్టుకున్నాడన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కన్వీనర్లు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు కానీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడ్డాం కావలి, న్యూస్లైన్ : సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్ను కేబినెట్లో గురువారం ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ రోడ్డుపై రిలేదీక్షతో పాటు రాస్తారోకో నిర్వహించింది. అదే సమయంలో ఆ మార్గంలో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్తో కలిసి కావలికి వచ్చిన ఎంపీ మేకపాటి వారి నిరసనకు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రపై వైఎస్సార్సీపీ అభిప్రాయం ఏంటని ఎంపీని ఉద్యోగ జేఏసీ నేతలు ప్రశ్నించారు. మేకపాటి స్పందిస్తూ తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు. పార్లమెంట్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డును వైఎస్ జగన్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో సీమాంధ్రలో చంద్రబాబు చేపట్టిన పర్యటనను అడ్డుకుంటామని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఎంపీ ఎదుట స్పష్టం చేశారు. అలాగే సమైక్యాంధ్రకు కట్టుబడిన వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement