breaking news
in polavaram
-
పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై సమీక్ష
పోలవరం : పోలవరం ప్రాజెక్టు కట్టడాల డిజైన్లపై డామ్ డిజైన్స్ రివ్యూ పానల్(డీడీఆర్పీ) కమిటీ శక్రవారం పోలవరం ప్రాజెక్టు ఏజెన్సీ కార్యాలయంలో సమావేశమై చర్చించింది. కమిటీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. తొలుత కమిటీ వారు స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ఫిల్డ్యామ్, పవర్హౌస్, గేట్ల తయారీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపర్ డ్యామ్ డిజైన్కు సంబంధించి ప్రధానంగా చర్చించామన్నారు. కాపర్డ్యామ్ నిర్మాణంలో ఎగువన ఎంత ఎత్తు పెట్టాలి, దిగువన ఎంత ఎత్తు పెట్టాలి అనే అంశాలతో పాటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ట్రీట్మెంట్పై కమిటీ చర్చించినట్టు చెప్పారు. కమిటీ సభ్యులు వైకే హాండా, దినేష్ భార్గవ్, ప్రతినిధులు ఎన్.శివకుమార్, అస్తన్ అబ్దుల్లా, ఆర్కే గుప్తా, ఖయ్యం అహ్మద్, ముఖేష్కుమార్, అనిల్జైన్, ఆర్.చిత్ర, ఎస్ సత్యనారాయణ, పీఎస్ కుంజరే, నీనా ఐజిన్, ఎ.పరమేశ్వరన్, ఎస్ఈ వీఎస్ రమేష్బాబు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు పరిధిలో చేపల సంచారంపై పరిశీలన
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గోదావరి నదిలో చేపల సంచారానికి ఇబ్బందులు లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రాజెక్టు ఇంజినీరింగ్, మత్స్యశాఖ అధికారులు బుధవారం సాంకేతికంగా పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ అతిథి గృహంలో సమావేశం నిర్వహించి, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ బాషా మాట్లాడుతూ కొన్ని రకాల చేపలు కాలువల నుంచి నదిలోకి మైగ్రేషన్ ఉంటుందన్నారు. ఏ నెలల్లో ఏఏ రకాల చేపలు అందుబాటులో ఉంటాయి? సంచరిస్తాయి? అనేది ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. చేపల సంచారానికి వీలుగా స్పిల్వేలో ఎక్కడ డిజైన్ చేయాలనేది ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో చర్చించటం జరిగిందన్నారు. స్పిల్వే ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్నారు. స్పిల్వే 1, 2 బ్లాక్ల మధ్య చేపల సంచారానికి వీలుగా ఏర్పాట్లు చేయటంపై ఇంజినీరింగ్ అధికారులు చర్చించారన్నారు. ప్రధానంగా బొచ్చె, శీలావతి, మోసు, గండుమేను, ఇసుకదొందులు, జెల్ల, పులస, వాలుగు, కొర్ర మేను, రొయ్యలు, బొమ్మిడాయి జాతులు ఉంటాయన్నారు. సైజును బట్టి అవి ప్రయాణం చేస్తాయన్నారు. సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వి.సురేష్, డాక్టర్ మాన్సన్, మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, ఏడీలు పి.రామ్మోహన్, డి.గోపిరెడ్డి, పోలవరం అథారిటీ సీఈ ఎ.పరమేశ్వరన్, ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్.రమేష్బాబు సమావేశంలో పాల్గొన్నారు.