breaking news
plant load factory
-
దొరకని ఆచూకీ ఆగని కన్నీళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచి పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. కుటుంబసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్్కకు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. క్యాంపులో బిక్కుబిక్కుమంటూ... బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.స్నేహితుడి ఆచూకీ కోసం.. పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరం వద్ద కూడా ఆరా తీశారు. ఎక్కడా తన స్నేహితుడి జాడ కనిపించకపోవంతో వీరంతా తీవ్ర ఆవేదనతో కాలం వెల్లబోసుకుంటున్నారు. -
లక్ష్యసాధనలో ఎన్టీపీసీ రామగుండం వెనుకంజ
జ్యోతినగర్, న్యూస్లైన్: ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ 2013-14 వార్షిక లక్ష్యసాధనలో వెనుకంజలో ఉంది. నిర్ధేశిత వార్షిక లక్ష్యం 20,519 మిలియన్ యూనిట్లు కాగా మార్చి 30 వరకు 98శాతం ప్లాంటులోడ్ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో 19,683 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఒకరోజు 63 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. గతేడాది నిర్ధేశించిన వార్షిక లక్ష్యం 20,448 మిలియన్యూనిట్లు కాగా ఐదురోజుల ముందుగానే 91శాతం పవర్లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) ఉత్పత్తితో వార్షిక లక్ష్యాన్ని చేరుకుంది. మొత్తంగా గడిచిన వార్షిక సంవత్సరంలో 20,785 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. ప్రస్తుతం 20,519 మిలియన్యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిలక్ష్యంగా నిర్ణయించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. వర్షాలు పడి సింగరేణి నుంచి ఆశించిన మేరకు బొగ్గు రవాణాకాలేదు. దీంతో కొన్ని రోజులు ఓ యూనిట్ను నిలిపేశారు. దీంతో లక్ష్యాన్ని చేరుకోవడంతో వెనుకబడ్డది.