breaking news
pig hunt
-
కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో నాటు తుపాకీతో పందులను కాల్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు చేరవేయగా.. వారు వచ్చి చిన్నారిని చూసేసరికి అప్పటికే మృతిచెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్పై వస్తుంటే -
దంపతుల ప్రాణం తీసిన పందుల వేట..!
నాగర్కర్నూల్ రూరల్: పందులవేటకు వినియోగిస్తున్న డిటోనేటర్ పేలి భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన శనివారం మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూ ల్ మండలం గుడిపల్లి మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమీపంలో జరిగింది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన లింగయ్య(45), అతని భార్య ఇంద్రమ్మ(40) మరికొందరు కొద్దిరోజులుగా గుడిపల్లిగుట్టలో అడవిపందుల వేట సాగిస్తున్నారు. శనివారం వీరంతా గుట్ట వద్దకు వెళుతుండగా వారు వెంట తెచ్చుకున్న టిఫిన్బాక్స్లో ఉంచిన డిటోనేటర్ పేలింది. లింగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. ఇంద్రమ్మ నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది.