breaking news
petitions Cancellation
-
అగ్నిపథ్ను సమర్థించిన హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేత
ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్నిపథ్ పథకాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో అగ్నిపథ్ను సవాల్ చేస్తూ వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదిక కేంద్రం తీసుకున్న విధానమని హైకోర్టు పేర్కొంది. అయితే, 2019 అగ్నిపథ్ రిక్రూట్మెంట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వాదనల అనంతరం.. హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణ కమిటీల్లో ప్రజా ప్రతినిధుల స్థానాన్ని తొలగించి ఆ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణ మార్గదర్శకాలను మారుస్తూ ప్రభుత్వం గతేడాదిజారీ చేసిన జీవో నెం.48ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం గురువారం తుది తీర్పునిచ్చింది. వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు బిజీగా ఉండటంతో కమిటీ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారని, ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలను మార్చామన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. రాజకీయ కారణాలతోనే అభివృద్ధి కమిటీల నుంచి ఎమ్మెల్యేలను ప్రభుత్వం తొలగించిందన్న పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది.