periodical report
-
ఏప్రిల్లో నిరుద్యోగిత రేటు @ 5.1 శాతం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్లో నిరుద్యోగిత రేటు 5.1 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు ఈ డేటాను మూడు నెలలకోసారి, ఏడాదికోసారి ప్రకటిస్తున్న కేంద్రం .. ఇలా నెలవారీ గణాంకాలను విడుదల చేయడం ఇదే ప్రథమం. ఉద్యోగార్హతలు ఉన్న నిరుద్యోగుల గణాంకాలను రియల్ టైమ్లో పర్యవేక్షించే దిశగా కేంద్ర గణాంకాలు, ప్రోగ్రాంల అమలు శాఖ గురువారం తొలిసారిగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను (పీఎల్ఎఫ్ఎస్) విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్లో వివిధ వయస్సుల్లోని ఉద్యోగార్థుల్లో నిరుద్యోగిత రేటు 5.1 శాతంగా ఉంది. ఇది మహిళలతో పోలిస్తే (5 శాతం) పురుషుల్లో కాస్త అధికంగా 5.2 శాతంగా ఉంది. 89,434 కుటుంబాలపై (గ్రామీణ ప్రాంతాల్లో 49,323, పట్టణ ప్రాంతాల్లో 40,111) ఈ సర్వే చేశారు. ఇందులో 3,80,838 మంది (గ్రామీణ ప్రాంతాల్లో 2,17,483 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,63,355 మంది) పాల్గొన్నారు. మరిన్ని వివరాలు.. → దేశవ్యాప్తంగా 15–29 వయస్సు గ్రూప్లో నిరుద్యోగిత రేటు (యూఆర్) 13.8 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 17.2 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతంగా నమోదైంది. → 15–29 ఏళ్ల గ్రూప్లో మహిళల్లో యూఆర్ మొత్తం మీద 14.4 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 23.7 శాతంగా, గ్రామాల్లో 10.7 శాతంగా ఉంది. అదే పురుషుల విషయానికొస్తే దేశవ్యాప్తంగా 13.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 15 శాతంగా, గ్రామాల్లో 13 శాతంగా నమోదైంది. -
ప్రభుత్వ భూములకు రక్షణ
బంజర్, పోరంబోకు భూముల వద్ద బోర్డుల ఏర్పాటు రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం విశాఖ రూరల్ : ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా, రక్షణ కల్పించాలని చెప్పి ఏడాది అవుతున్నా కొన్ని మండలాల్లో సర్వేలు నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు జాబ్ చార్ట్ విధిగా నిర్వర్తించాలని చెప్పారు. గ్రా మాల్లోని బంజర, పోరంబోకు భూములను గుర్తించి, అక్కడ ప్రభు త్వ భూమి అని బోర్డులు పెట్టాలని సూచించారు. ఆర్ఐలు గ్రామాలను సందర్శించాలి ప్రతీ నెలా ఆర్ఐలు గ్రామాలను సందర్శించి ఆక్రమణలపై పీరియాడికల్ రిపోర్టును పంపించాలని చెప్పారు. భూ ఆక్రమణలకు సంబంధించి పేపర్లలోను, నేరుగా ఫిర్యాదు వస్తే తప్పా ఆర్ఐలు ముందుగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను వసూలు చేయాలన్నారు. మండలాల వారీగా ప్రస్తుతం ఉన్నవి, కొత్తగా వేసిన లేఅవుట్ల సంబంధించి వివరాలను ఈ నెల 15లోగా సమర్పించాలని ఆదేశించారు. ‘భూ’ ఫిర్యాదులే ఎక్కువ ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి భూ తగాదాలు, పట్టాదారు పాస్పుస్తకాలు తదితర సమస్యలపై పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయని జేసీ ప్రవీణ్కుమార్ తెలిపారు. తహశీల్దార్ల కార్యాలయాల్లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సర్కారు భూముల రక్షణకు సర్వే పూర్తి చేసి అడంగల్ అప్ డేట్ చేయాలని సూచించారు. జమాబంది, నీటి తీరువా వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన వివరాలు ఈనెల 17లోగా సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినపుడు వీఆర్వో వద్ద సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఏజేసీ వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.