people survey
-
పీ4 సర్వేపై ప్రజల్లో ఆందోళన.. ఎన్నో సందేహాలు!
కడప సెవెన్రోడ్స్: పీ4 పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. ఇప్పటికే ఎన్నికల ముందు ఎడతెరిపి లేని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు పరచకపోగా ఏదో ఒక నెపంతో నీరుగార్చే యత్నాలు చేపట్టిన విషయం ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా పైలెట్ ప్రాజెక్టు (pilot project) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 20వ తేది నుంచి వైఎస్ఆర్ జిల్లాలో పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టిసిపేషన్ (పీపీపీ) పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేది నాటికి పీ4 సర్వే (P4 Survey) పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,70,365 కుటుంబాలు ఉండగా, ఇప్పటికి 1,88,893 కుటుంబాలను అంటే 40.16 శాతం సర్వే పూర్తి చేశారు. ఇందులో 157213 కుటుంబాల (83.23 శాతం) ఆమోదం తీసుకున్నారు. ఇక 2,81,472 కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 645 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 20 శాతం నిరుపేద కుటుంబాలు గుర్తించి గ్రామ సభల ద్వారా నిర్దారిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగు పరచడమే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు.ఎన్నో సందేహాలు! సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయభూమి ఎంత ఉంది? మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? ఇన్కం ట్యాక్స్ (Income Tax) ఏమైనా చెల్లిస్తున్నారా? నెలకు విద్యుత్ వినియోగం ఎంతమంది అనే అంశాలపై సచివాలయ సిబ్బంది ఆరా తీస్తున్నారు. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. నాడు సంక్షేమ జాతర.. నేడు పాతరవైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమం అర్హత కలిగిన ప్రతి ఇంటి గడపను తాకింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చారు. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే నేతలు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు సవరించారు.చదవండి: బడ్జెట్తో చంద్రబాబు దగా ఇలా..పెన్షన్ రూ. 1000లు పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగించే చర్యలు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా పీ4 సర్వే చేపట్టడం ఇందులోభాగమనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారి పేర్లు సైతం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం, అలాంటి వివరాలు నమోదు చేసినపుడు బయో మెట్రిక్ ద్వారా ధృవీకరించాలని కూడా చెప్పడం అనుమానాలు బలపడేందుకు కారణాలుగా ఉన్నాయి. సంపాదన పరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేగుట్టు బాబుకే ఎరుకని పరిశీలకులు వివరిస్తున్నారు. -
ఇంటింటా విశేష ఆదరణ
సాక్షి, అమరావతి: ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల కుటుంబాలు సీఎం జగన్ పాలనకు మద్దతు పలికాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జోగి రమేశ్, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు మెగా సర్వే సాగుతున్న తీరును ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వెల్లడించారు. కుప్పం.. నగరి ఎక్కడైనా చర్చకు సిద్ధం రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్ చంద్రబాబే. పేదలకు మంచి జరగ కూడదనే దురుద్దేశంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు టిడ్కో ఇళ్లపై సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. చంద్రబాబు తన హయాంలో మంచి చేసిన ఒక్క పేద వాడి ఇంటి దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ చేయగలరా? దమ్ముంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. కుప్పం అయినా సరే.. నగరి అయినా ఓకే. గాం«దీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందుకే మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది. ఇంటింటికీ జగనన్న స్టిక్కర్ చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో గుబులు పట్టుకుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పి పేదల ఇంటికి స్టిక్కర్లు వేయాలి. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ఎన్ని ఇబ్బందులున్నా ఆగని సంక్షేమాభివృద్ధి గత ఎన్నికల్లో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతానికి పైగా నెరవేర్చిన సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకం ఇంతగా మద్దతు పలికేలా చేసింది. ఈ మెగా పీపుల్స్ సర్వే దేశ చరిత్రలోనే ప్రథమం. కరోనా, ఇతరత్రా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఎక్కడా తేడా లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2021–22లో రూ.1.92 లక్షలు ఉన్న తలసరి ఆదాయం 2022 –23లో రూ.2.19 లక్షలకు పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. సీఎం జగన్ దార్శనికతతో రాష్ట్రం 11.43 శాతం గ్రోత్ రేట్ సాధించింది. – ఆదిమూలపు సురేశ్, మున్సిపల్ శాఖ మంత్రి ‘జగనన్నే మా భవిష్యత్’ చరిత్రలో ఓ రికార్డు ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకు చేర్చిన సీఎం జగన్ లాంటి సాహసోపేత నిర్ణయం ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. ఈనెల 7వ తేదీ నుంచి పార్టీ సైనికులతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఇప్పటికే 49 లక్షల కుటుంబాలు సీఎం జగనన్న పాలనకు మద్దతు పలికాయి. రాష్ట్ర ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది. నిబద్ధత కలిగిన నేతకు.. అసత్య ప్రచారాలకు మధ్య యుద్ధం ఇది. తుది విజయం జగనన్నదే. – జోగి రమేశ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సంక్షేమాభివృద్ధి సారథి జగన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివక్ష లేని సంక్షేమాభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. 98 శాతం పైగా హామీలు అమలు చేసి, సంక్షేమాభివృద్ధి సారథిగా నిలిచారు. అందుకే మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్, వెల్నెస్ సెంటర్ల ద్వారా సరికొత్త సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలు గౌరవంగా జీవించేలా చేస్తున్నారు. ప్రతి పథకంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుడికే నగదు వెళ్లేలా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. అందుకే ప్రజల్లో ఇంత ఆదరణ కనిపిస్తోంది. – మోపిదేవి వెంకటరమణ, రాజ్యసభ సభ్యుడు -
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు
-
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా మోదీ!
రీడర్స్ పోల్లో మోదీ గెలుపు న్యూయార్క్: టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ కోసం జరిగిన రీడర్స్ పోల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఆదివారం రాత్రి ముగిసిన ఈ పోల్లో మోదీ 18 శాతం ఓట్లు సాధించారు. 2016కు సంబంధించిన ఈ పోల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటి వారు పోటీలో ఉన్నారు. ఈ ఓటింగ్లో ఒబామా, ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేలకు 7 శాతం చొప్పున ‘యెస్’ ఓట్లు వచ్చారుు. ఇక హిల్లరీ క్లింటన్కు 4 శాతం, ఫేస్బుక్ ఫౌండర్ జుకర్బర్గ్కు 2 శాతం ఓట్లు లభించారుు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరనేది టైమ్ ఎడిటర్ త్వరలో నిర్ణయిస్తారు. అయితే ఆన్లైన్ పోల్ ఫలితాలు ప్రపంచం దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ ఏడాది దిశానిర్దేశకులపై అదో ముఖ్యమైన గవాక్షం లాంటిదని టైమ్ పేర్కొంది. కాగా, ఆన్లైన్ పోల్లో విజయం సాధించడం మోదీకి ఇది రెండోసారి. చెడు లేదా మంచి విషయాల్లో వార్తలను, ప్రపంచాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తిని ప్రతిఏటా టైమ్ పత్రిక ఎంపిక చేస్తుంది. మోదీకి భారత్ నుంచేగాక అమెరికా రాష్ట్రాలైన కాలిఫోర్నియా, న్యూజెర్సీ నుంచి కూడా ఓట్లు వచ్చాయని ఓటింగ్ నిర్వహించిన అపెస్టర్ పేర్కొంది. పోల్లో మోదీ తొలిస్థానాన్ని కై వసంచేసుకోవడాన్ని కొందరు కేంద్రమంత్రులు స్వాగతించగా, ఇదే సర్వేను పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్లో చేసి ఉంటే మోదీ పాపులారిటీ తగ్గిపోయేదని విపక్షాలు వ్యాఖ్యానించారుు. నోట్లు రద్దు చేసి ఏడాదిలో ఎవరూ చేయనట్లుగా ఒకే దెబ్బతో దేశప్రజలందరినీ కష్టాల్లోకి నెట్టిన మోదీని ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ కాదని ఎవరంటారు? అని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యంగ్యంగా అన్నారు. -
టైమ్ సర్వే: ట్రంప్, ఒబామాలను దాటేసిన మోదీ!
ప్రపంచంలో వివిధ నాయకులు, కళాకారులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులందరిలో అగ్రగామి ఎవరంటే... భారత ప్రధాని నరేంద్రమోదీయేనని తేలింది. ఈ విషయమై టైమ్ పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరంటే.. మోదీయేనని ఎక్కువమంది ఓటేశారు. అయితే, టైమ్ పత్రిక ఎడిటర్లు మాత్రం ఇంకా తమ పత్రిక తరఫున పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. ఆ నిర్ణయం ఈనెల 7వ తేదీన వెలువడనుంది. ప్రస్తుతానికి ప్రజల సర్వే ఫలితాలు మాత్రం వెల్లడయ్యాయి. ఆదివారం అర్ధరాత్రితో ఈ సర్వే గడువు ముగిసేసరికి నరేంద్రమోదీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.. వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిల్లరీ క్లింటన్కు 4 శాతం, మార్క్ జుకర్బర్గ్కు 2 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల వారు కూడా మోదీకి అనుకూలంగా బాగా ఓటుచేసినట్లు తెలుస్తోందని ప్రస్తుత సర్వే వివరాలను విశ్లేషించిన యాప్స్టర్ సంస్థ తెలిపింది. టైమ్ పత్రిక ప్రతియేటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరన్న విషయమై సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ యేడాది ఓపెన్టాపిక్, ఐబీఎం సంస్థలతో కలిసి టైమ్ ఎడిటర్లు తుది విజేతను నిర్ణయిస్తారు.