-
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబుకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదని మంత్రి, వైఎస్సార్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, ఎల్ఐసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి చచ్చిన పాములాంటివాడని, ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారని కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్లి సేవలు అందించామని తెలిపారు.వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు సైతం భయపడినా, జగనన్న వలంటీర్లు మాత్రం ధైర్యంగా రోగులకు సేవలు అందించారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. జగన్మోహన్రెడ్డి చేసేవి మాత్రమే చెబుతారని , వాటినే మేనిఫెస్టోగా విడుదల చేశారన్నారు. ఐదేళ్లలో 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన వైఎస్సార్సీపీకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు.చంద్రబాబు , పవన్కల్యాణ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని, దీన్ని బట్టే అది ఎంత మోసకారి మేనిఫెస్టోనో అర్థమవుతోందని తెలిపారు. బారు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈనెల 13న జరిగే పోలింగ్ రోజున ప్రతి ఒక్కకూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృదీ్ధన్షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ జిల్లా అమ్ము పాల్గొన్నారు. -
సీఎం జగన్ పై మంత్రి పెద్దిరెడ్డి ప్రశంసలు
-
ఈనెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు సభను విజయవంతం చేయండి. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతీ ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. కళ్యాణదుర్గం సభలో ఇన్ పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేస్తారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దే. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు అని తెలిపారు. ఇక, కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నారా లోకేష్కి మాజీ మంత్రి అనిల్కుమార్ సవాల్ -
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్
సాక్షి, అనంతపురం జిల్లా: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయంగా చంద్రబాబు నడవలేని స్థితిలో ఉన్నారని.. అందుకే నాలుగైదు పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంత్రి ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎంత మందితో చంద్రబాబు వచ్చినా వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరని.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అన్నారు. చంద్రబాబు మహానటుడు అని.. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాల మ్యానిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శించారు. చదవండి: ‘వైఎస్ జగన్ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
విజయవాడలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
తప్పక చదవండి
Advertisement