-
మకర తోరణం తరలింపుతో ముగిసిన పెద్దగట్టు జాతర
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలో కొలువైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ముగిసింది. గురువారం రాత్రి మకర తోరణాన్ని సూర్యాపేటలోని గొల్ల బజారుకు చెందిన వల్లపు, కోడి వంశస్తులు తీసుకువెళ్లడంతో జాతర ముగిసినట్లు పూజారులు ప్రకటించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 28 హుండీల ద్వారా రూ. 25.71 లక్షల ఆదాయం వచ్చింది. అదే విధంగా 550 గ్రాముల వెండి, రెండు గ్రాముల బంగారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
వైభవంగా లింగన్న కల్యాణం (ఫొటోలు)
-
నల్గొండ జిల్లా : తెలంగాణలో రెండవ అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
పర్యాటక ప్రదేశాల ఖిల్లా.. సూర్యాపేట జిల్లా
దురాజ్పల్లి (సూర్యాపేట) : పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా అలరారుతోంది. జిల్లాలో అతి పురాతన కట్టడాలు సంస్కృతికి అద్దం పడుతాయి. తెలంగాణ– ఆంద్రప్రదేష్ రాజాధానులకు 143 కిలో మీటర్ల సమాన దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక అపురూప కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు కను విందుగొలుపుతాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్ళు, క్రీస్తు పూర్వం నాటి భౌద్దస్తూపాలు, కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి శివాలయాలు, అపురూప శిల్పలు, మండపాలు, మూసి రిజర్వయర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా. కాకతీయుల కళ నైపుణ్యం అద్దం పటే పిల్లలమర్రి... జిల్లా కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్ జాతీయ రహదారికి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కాల నైపుణ్యానిక అద్దం పడుతున్నాయి. క్రి.శ 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ నిర్మించిన శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికూటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిద్యభరితమైన శిల్పాలు ఈ ఆలయాలలో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాలిస్తంబం, రాతి కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాలలో వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి– మార్చి మాసంలో జరుగుతాయి. ఇక పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం పిల్లలమర్రి. ఫణిగిరిలో ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం.... జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ద బౌద్ధక్షేత్ర పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది. ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ. పూ 1–3 ఎడి శతాబ్దం నాటి భౌద మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మాంచిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు,భౌద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి. వీటియి కొండపై భద్రపరిచారు. ఇలా తొవ్వకాలలో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలుస్తున్నాయి పురాతన గిరిదుర్గం.. ఉండ్రుగొండ ప్రసిద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. చుట్టు కొండలు, దట్టమైన అడవి మద్య ఆద్యత్మికత ఉట్టి పడే విధంగా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 1370 ఎకరాల విస్తీర్ణంలో నిగనిగలాడే చెట్ల చెట్ల మద్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవులన నిర్మించిన ఎత్తైన దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాల దార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఉండ్రుగొండ ప్రత్యేకత. శాతవాహనులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహాన్లు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ది చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ గుట్టలపై శ్రీ లకక్ష్మీ నరసింహస్వామి, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృమాలు, బోగందానిగద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పాహడ్శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతుంటారు. తెలంగాణ అతి పెద్ద జాతర... పెద్దగట్టు లింగన్న జాతర తెలంగాణలో సమ్మక్క– సారలమ్మ జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర జరిగేది సూర్యాపేట జిల్లాలోనే. సూర్యాపేటకు 7 కిలో మీటర్ల దూరంలో దురాజ్పల్లి గ్రామంలో ఉన్న పెద్దగట్టు(గొల్లగట్టు) ఏటేటా అభివృద్ధిచెందుతూ పర్యాటక ప్రదేశంగా ఎదుగుతున్నది. ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన మొక్కులను తీర్చే స్వామిగా పేరొందిన లింగన్న దర్శనానికి ఇప్పుడు ప్రతి రోజు భక్తులు వస్తున్నారు. మత సమైక్యతకు చిహ్నం.. జానపహడ్ దర్గా.. కుల మతాలకు అతీతంగా దర్శించుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్పహడ్ దర్గా.. 4 శతాబ్దాల చరిత్ర గల ఈ ధర్గాలో హజ్రత్ సయ్యద్ మోహినుద్ధీన్షా, జాన్సాక్షహిద్రహమత్తుల్లా సమాధులు ఉన్నాయి. ఈ దర్గాను మానవత్వనికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గందానికి ప్రత్యేకత ఉంది. ఈ దర్గా పర్యాటక ప్రదేశంగా కొనసాగుతున్నది. ఇవే కాకుండా ప్రత్యేక గల అనేక దేవాలయాలు, కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాగులపహడ్ శివాలయం, మట్టంపల్లి లక్ష్మినర సింహస్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ, మిర్యాలలో సీతరామచంద్రస్వామి దేవస్థానం, అర్వపల్లిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం, దర్గా తదితర ప్రదేశాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. -
భక్తజన సంద్రం.. పెద్దగట్టు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: పెద్దగట్టు (గొల్లగట్టు) భక్త జన సంద్రమైంది. సూర్యాపేట జిల్లాలోని కేసారం గ్రామంలో లింగమంతుల స్వామి కొలువైన ఈ గట్టుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ‘ఓ లింగా’నామస్మరణతో మార్మోగాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె ఆలయానికి చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం బోనాల సమర్పణకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంతంకిక్కిరిసింది. మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దగట్టుకు పోటెత్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్లు లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామునుంచి బోనాల సమర్పణ.. తెల్లవారుజాము నుంచి మొదలైన బోనాల సమర్పణ, గంపల ప్రదక్షిణ రాత్రి పొద్దుపోయే వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. ఎండ బాగా ఉన్నా, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేయడంతో జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకున్నారు. కరోనా భయం ఉన్నా భక్తులు భారీ ఎత్తున తరలిరావడం గమనార్హం. స్వామి దర్శనం తర్వాత భక్తులు యాటపోతులను బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు బోనమెత్తుకొని చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక మూడో రోజు మంగళవారం ప్రధాన ఆలయం ముందు పూజారులు చంద్రపట్నం వేయనున్నారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి పెద్దగట్టు పైనే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కనుల పండువగా జాతర స్వరాష్ట్రంలో కనుల పండువగా పెద్దగట్టు జాతర జరుగుతోందని, ఈ జాతరకు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదవుల మీద ఉన్న అభిమానంతో ప్రభుత్వం పెద్దగట్టుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం జలాల ప్రభావం పెద్దగట్టు జాతరపై స్పష్టంగా కనిపిస్తోందని, జాతరకు తరలివస్తున్న రైతుల కళ్లల్లో ఆనందమే ఇందుకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. లింగమంతుల స్వామి యాదవుల ఇలవేల్పని, స్వామి కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ స్వామిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement