12న హజరత్ పీరుల్లా మాలిక్ గంధోత్సవం
కడప కల్చరల్:
కడప నగరం అస్థానె మగ్దూమ్ ఇల్లాహి (అమీన్పీర్ దర్గా)లో ఈనెల 12వ తేదిన గంధం ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. దర్గాలో ప్రధాన గురువులు హజరత్ సయ్యద్షా పీరుల్లా మాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన రోజున బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మజార్పై గంధాన్ని సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దర్గాలోని ప్రధాన ప్రాంగణాన్ని కళ్లు చెదిరే రంగురంగుల పూలతో అలంకరిస్తామని ఆయన తెలిపారు. దర్గా ప్రాంగణంలోని పీర్ల చావిడిలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఆధ్యాత్మిక వక్తల ప్రసంగాలు కొనసాగనున్నట్లు వివరించారు.