breaking news
passbook of holder
-
అంత లంచం ఇచ్చుకోలేనయ్యా..
మల్దకల్: తమ పేరుపై ఉన్న పట్టాభూమిని సర్వే చేసి రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్ ఏకంగా రూ.60 వేలు డిమాండ్ చేయడంతో, మనస్తాపంతో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగాడు. ఈ ఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్లో చోటు చేసుకుంది. మద్దెలబండ గ్రామానికి చెందిన బుడ్డ వీరన్న, నర్సింహులు, భీమేష్లు అన్నదమ్ములు. వీరికి గ్రామ శివారులో సర్వే నంబర్ 64లో 3.16 ఎకరాల పొలం ఉంది. 2015లో ఉపాధి నిమిత్తం ముగ్గురూ వలస వెళ్లి.. తిరిగి 2018లో స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే వీరి పొలంలో 1.10 ఎకరాలను రాములు నాయక్ ఆక్రమించుకున్నాడు. దీనిపై జిల్లా రెవెన్యూ, పోలీసులకు సదరు రైతులు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్ర యించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారుల ను వేడుకోగా, సర్వే చేసి రిపోర్టు అందజేస్తే, న్యా యంచేస్తామని చెప్పారని ఆ రైతులు తెలిపారు. రూ. 60 వేలు ఇస్తేనే.. కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఉన్న తన భూమిని సర్వే చేసి, రిపోర్టు ఇవ్వా లని సర్వేయర్ బ్రహ్మయ్యను వారు సంప్రదించా రు. భూ ఆక్రమణదారుడు తనకు రూ.50 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, మీరు రూ.60 వేలు ఇస్తే రిపోర్టు అనుకూలంగా ఇస్తానని సర్వేయర్ చెప్పినట్లు బాధితులు తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేమని బతిమాలుకున్నా సర్వేయర్ కనికరించలే దన్నారు. దీంతో మనస్తాపం చెందిన బుడ్డ వీరన్న శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది, రైతులు వెంటనే ఆయనను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ విషయంపై మల్దకల్ తహసీల్దార్ మీర్ అజాం అలీని వివరణ కోరగా, బుడ్డ వీరన్న పేరున పట్టా భూమి ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నట్లు తెలిసిందని, అందుకే రైతుకు న్యాయం చేయలేకపోయామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. -
ఏసీబీ వలలో ఏఎస్ఓ
పట్టాదారు పాస్బుక్కు కోసం లంచం తీసుకుంటూ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఏఎస్ఓ) ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం సంచలనం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ ఆర్. సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని బాగిర్థిపేట గ్రామానికి చెందిన రైతు బొడ్డు శ్రీనివాసరావు జనవరి 7న బైక్పై వెళుతుండగా అతడి పట్టాదారు పాస్పుస్తకం ఎక్కడో పడిపోరుుంది. ఎంత వెతికినా దొరకకపోవడంతో పాస్బుక్కు(బి) తిరిగి పొందేందుకు తహసీల్దార్ కార్యాలయంలో జనవరి 21న దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే నంబర్ 220(బీ)లో ఉన్న 20 గుంటల భూమి, 225సీలోని ఒక ఎకరం 30 గుంటల భూమిపై పట్టాపాస్పుస్తకం పొందాల్సి ఉంది. తహసీల్దార్ శ్రీనివాసరావు(ఇటీవల బదిలీపై వెళ్లారు) సంబంధిత ఫైల్పై సంతకం చేసి ఏఎస్ఓ శాగంటి వెంకన్న దగ్గరకు పంపారు. వెంకన్న దగ్గరికి రైతు శ్రీనివాసరావు వెళ్లగా నిబంధనల ప్రకారం పాస్బుక్ ఇవ్వాలంటే పోలీస్ సర్టిఫికెట్తోపాటు నోటరీ అఫిడవిట్ కావాలని చెప్పాడు. దీంతో ఆయన సంబంధిత సర్టిఫికెట్లన్ని తీసుకొచ్చి ఏఎస్ఓకు అప్పగించాడు. అన్నీ ఉన్నా పాస్పుస్తకం పొందాలంటే రూ.6 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. రైతు అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో రూ.4 వేలు ఇవ్వాలని తేల్చి చెప్పాడు. సరేనని ఒప్పుకున్న బాధితుడు ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మార్చి 1న వరంగల్లో ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. దీంతో వారి సూచనలతో అతడు మంగళవారం తహసీల్దార్ కార్యాలయూనికి చేరుకుని ఏఎస్ఓ వెంకన్నకు రూ.4 వేలు ఇచ్చాడు. దీంతో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజర్చునునట్లు ఏసీబీ డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపారు. వెంకన్నను పట్టుకున్న వారిలో సీఐలు ఎస్వీ రాఘవేందర్రావు, పి. సాంబయ్య, ఎం. వెంటేశ్వర్రావు, ఏసీబీ సిబ్బంది ఉన్నారు.